Political News

మొన్న బాబు, నిన్న లోకేష్, నేడు నారా భువనేశ్వరి

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ త‌ర‌చుగా ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌జ‌ల నుంచి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు.. వారి విజ్ఞాప‌న‌ల‌పై స్పందిస్తున్నారు. ఇటీవ‌ల మంత్రి నారా లోకేష్.. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యాని కి వెళ్లి  ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించిన‌ప్పుడు.. సుమారు 4 వేల మందికి పైగా ప్ర‌జ‌లు వ‌చ్చి.. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొన్నారు. అదేవిధంగా సీఎం చంద్ర‌బాబు పార్టీ కార్యాల‌యానికి వెళ్లిన‌ప్పుడు కూడా వేల మంది స‌మ‌స్య‌ల‌తో వ‌చ్చారు. వారి స‌మ‌స్య‌ల‌ను విని.. వాటిని ప‌రిష్క‌రించేందుకు సీఎం, మంత్రి ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ ప‌రంప‌ర‌లో సీఎం స‌తీమ‌ణి, ఎన్టీఆర్ ట్ర‌స్ట్ నిర్వాహ‌కురాలు.. నారా భువ‌నేశ్వ‌రి కూడా ప్ర‌జా ప్ర‌తినిధి కాక‌పోయినా.. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నేనున్నానంటూ.. వారికి భ‌రోసా క‌ల్పిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కుప్పంలో ప‌ర్య‌టిస్తున్న భువ‌నేశ్వ‌రి..ఇక్క‌డి వారి స‌మ‌స్య‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టిన భువ‌నేశ్వ‌రి.. తాజాగా శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం.. ప్ర‌జాద ర్బార్ నిర్వ‌హించారు. దీనికి కుప్పం స‌హా..ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ప్ర‌జ‌లు భారీ సంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చారు. సుమారు అర కిలో మీట‌రు మేర‌కు.. క్యూ లైన్ ఏర్ప‌డింది.

వారంద‌రినీ ఓపిక‌గా ప‌ల‌క‌రించిన భువ‌నేశ్వ‌రి వారి నుంచి అర్జీలు తీసుకున్నారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే.. ఎక్కువ మంది త‌మ‌కు ఇళ్లు లేవ‌ని.. సొంత ఇల్లు క‌ల్పించాలని కోరారు. రెండో ప్రాధాన్యంగా రేష‌న్ కార్డు, మూడో ప్రాధాన్యంగా పింఛ‌ను క‌ల్పించాల‌ని ఎక్కువ మంది విన‌తులు స‌మ‌ర్పించారు. అదేవిధంగా కొంద‌రు సీఎంఆర్ ఎఫ్ నుంచి నిధులు ఇవ్వాల‌ని కోరారు. అయితే.. వారి నుంచి అర్జీలు తీసుకున్న నారా భువ‌నేశ్వ‌రి వెంట‌నే త‌న పీఏకు అక్క‌డి నుంచి క‌లెక్ట‌ర్ ఆఫీసుకు వాటిని పంపించారు. మ‌రికొన్నింటిని అక్క‌డిక‌క్క‌డే(ఆరోగ్య సంబంధ‌మైన‌) డిజిట‌లీక‌ర‌ణ చేయించి మంత్రి నారా లోకేష్ డ్యాష్ బోర్డుకు, సీఎం చంద్ర‌బాబు పేషీకి పంపించారు.

This post was last modified on November 21, 2025 10:12 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

52 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago