ఏపీ సీఎం చంద్రబాబు.. కేంద్ర హోం శాఖ మంత్రితో 20 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయ్యారా? రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించారా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ ఎంపీలు. అయితే.. లోపల ఏం జరిగిందో తమకు తెలియదని చెబుతూనే.. కొన్ని ‘కీలక’ విషయాలు చర్చించినట్టు పేర్కొన్నారు. బీహార్లో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి కొలువుదీరింది. సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారన్నది వాస్తవం. వేదికపై కూడా దాదాపు ఇద్దరూ ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పటికీ.. ముచ్చటించుకుంటూనే కనిపించారు. దీనికి ముందు ఇద్దరూ.. ఏకాంతంగా 20 నిమిషాలు చర్చించుకున్నారని జాతీయ మీడియాలోనూ చర్చ వచ్చింది. అయితే.. ఏ విషయాలపై అనేది స్పష్టత లేదు. కానీ, మూడు కీలక విషయాలపై చర్చించి ఉంటారని జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
1) ఇటీవల ఏపీలో జరిగిన ఎన్కౌంటర్: ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు. అదేవిధంగా వరుసగా రెండో రోజు కూడా మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ విషయంపై చంద్రబాబు.. అమిత్ షాలు చర్చించుకుని ఉంటారన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. రాష్ట్రానికి మావోయిస్టులు ఎలా వచ్చారన్న విషయంతోపాటు.. గతంలో తనపై జరిగిన దాడి(అలిపిరి) విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారని చెబుతున్నారు.
2) చంద్రబాబు బీహార్కు వెళ్లిన రోజే.. వైసీపీ అధినేత జగన్ కోర్టుకు వెళ్లారు. ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసులో నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ విషయాన్ని కూడా చంద్రబాబు అమిత్ షాకు వివరించి ఉంటారని.. కేసుల పరిణామం.. ఆయన బెయిల్పై ఉన్న తీరు… వంటివి ఇరువరి మధ్య ప్రస్తావనకు వచ్చి ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అదేవిధంగా 3) త్వరలో ఏపీకి రావాలని.. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న డిఫెన్స్ సెక్టర్(మచిలీపట్నం)ను పరిశీలించాలని చంద్రబాబు అమిత్ షాను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
This post was last modified on November 21, 2025 12:35 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…