ఏపీ సీఎం చంద్రబాబు.. కేంద్ర హోం శాఖ మంత్రితో 20 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయ్యారా? రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించారా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ ఎంపీలు. అయితే.. లోపల ఏం జరిగిందో తమకు తెలియదని చెబుతూనే.. కొన్ని ‘కీలక’ విషయాలు చర్చించినట్టు పేర్కొన్నారు. బీహార్లో ఎన్డీయే ప్రభుత్వం మరోసారి కొలువుదీరింది. సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారన్నది వాస్తవం. వేదికపై కూడా దాదాపు ఇద్దరూ ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పటికీ.. ముచ్చటించుకుంటూనే కనిపించారు. దీనికి ముందు ఇద్దరూ.. ఏకాంతంగా 20 నిమిషాలు చర్చించుకున్నారని జాతీయ మీడియాలోనూ చర్చ వచ్చింది. అయితే.. ఏ విషయాలపై అనేది స్పష్టత లేదు. కానీ, మూడు కీలక విషయాలపై చర్చించి ఉంటారని జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
1) ఇటీవల ఏపీలో జరిగిన ఎన్కౌంటర్: ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందారు. అదేవిధంగా వరుసగా రెండో రోజు కూడా మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ విషయంపై చంద్రబాబు.. అమిత్ షాలు చర్చించుకుని ఉంటారన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. రాష్ట్రానికి మావోయిస్టులు ఎలా వచ్చారన్న విషయంతోపాటు.. గతంలో తనపై జరిగిన దాడి(అలిపిరి) విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించారని చెబుతున్నారు.
2) చంద్రబాబు బీహార్కు వెళ్లిన రోజే.. వైసీపీ అధినేత జగన్ కోర్టుకు వెళ్లారు. ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసులో నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ విషయాన్ని కూడా చంద్రబాబు అమిత్ షాకు వివరించి ఉంటారని.. కేసుల పరిణామం.. ఆయన బెయిల్పై ఉన్న తీరు… వంటివి ఇరువరి మధ్య ప్రస్తావనకు వచ్చి ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.
అదేవిధంగా 3) త్వరలో ఏపీకి రావాలని.. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న డిఫెన్స్ సెక్టర్(మచిలీపట్నం)ను పరిశీలించాలని చంద్రబాబు అమిత్ షాను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…