Political News

భారత్ అమ్ములపొదిలో అమెరికన్ ‘అస్త్రాలు’

భారత రక్షణ రంగానికి అదిరిపోయే గుడ్ న్యూస్. మన సైనిక శక్తిని అమాంతం పెంచేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 93 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 800 కోట్లు) విలువైన భారీ ఆయుధ ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ‘జావెలిన్’ యాంటీ ట్యాంక్ మిసైల్స్‌తో పాటు, శత్రువులను పిన్ పాయింట్ అక్యురసీతో కొట్టే ‘ఎక్స్‌కాలిబర్’ ఆర్టిలరీ మందుగుండు సామగ్రి కూడా ఉంది.

ఈ డీల్‌కు సంబంధించిన సర్టిఫికేషన్ పూర్తయిందని, అక్కడి పార్లమెంట్ కు సమాచారం ఇచ్చినట్లు అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ డీల్‌లో మొదటి భాగం జావెలిన్ మిసైల్ సిస్టమ్. దీని విలువ సుమారు 45.7 మిలియన్ డాలర్లు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ట్యాంకులను తుక్కుతుక్కు చేసిన ఈ జావెలిన్ క్షిపణులు ఇప్పుడు మన ఆర్మీ చేతికి రాబోతున్నాయి.

ఇందులో 25 కమాండ్ లాంచ్ యూనిట్లు, జావెలిన్ FGM 148 మిసైళ్లు ఉన్నాయి. ఇది ఒకసారి టార్గెట్ సెట్ చేసి వదిలేస్తే చాలు, శత్రువు ట్యాంక్ ఎక్కడున్నా వెతికి మరీ కొడుతుంది. ఇక రెండోది ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్. దీని విలువ 47.1 మిలియన్ డాలర్లు. ఇందులో భాగంగా భారత్ 216 ఎక్స్‌కాలిబర్ (M982A1) రౌండ్లను కొనుగోలు చేయనుంది.

ఇవి సాధారణ బాంబులు కాదు. జీపీఎస్ సాయంతో పనిచేసే స్మార్ట్ ఆర్టిలరీ షెల్స్. శత్రువుల బంకర్లు ఎంత దూరంలో ఉన్నా, అత్యంత కచ్చితత్వంతో, పక్కన ఉన్న సివిలియన్లకు హాని కలగకుండా కేవలం టార్గెట్‌ను మాత్రమే ధ్వంసం చేయడం వీటి స్పెషాలిటీ. ఈ ఆయుధాల అమ్మకం వల్ల ఈ ప్రాంతంలో సైనిక సమతుల్యత దెబ్బతినదని, పైగా ఇది ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దోహదపడుతుందని అమెరికా పేర్కొంది. భారత్ తమకు అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామి అని, ప్రస్తుత, భవిష్యత్తు ముప్పులను ఎదుర్కోవడానికి ఈ ఆయుధాలు భారత్‌కు ఎంతగానో ఉపయోగపడతాయని DSCA వెల్లడించింది.

చైనా, పాకిస్థాన్ వంటి పొరుగు దేశాల నుంచి సవాళ్లు ఎదురవుతున్న వేళ, ఈ డీల్ భారత్‌కు కొండంత బలాన్నిస్తుంది. ముఖ్యంగా సరిహద్దుల్లో పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయాల్సి వస్తే జావెలిన్, ఎక్స్‌కాలిబర్ రెండూ గేమ్ ఛేంజర్లుగా మారతాయి. ఈ కొత్త అస్త్రాలతో భారత ఆర్మీ ఫైర్ పవర్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం ఖాయం.

This post was last modified on November 20, 2025 3:33 pm

Share
Show comments
Published by
Satya
Tags: America

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

4 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

4 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

4 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

6 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

7 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

7 hours ago