Political News

భారత్ అమ్ములపొదిలో అమెరికన్ ‘అస్త్రాలు’

భారత రక్షణ రంగానికి అదిరిపోయే గుడ్ న్యూస్. మన సైనిక శక్తిని అమాంతం పెంచేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 93 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 800 కోట్లు) విలువైన భారీ ఆయుధ ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ‘జావెలిన్’ యాంటీ ట్యాంక్ మిసైల్స్‌తో పాటు, శత్రువులను పిన్ పాయింట్ అక్యురసీతో కొట్టే ‘ఎక్స్‌కాలిబర్’ ఆర్టిలరీ మందుగుండు సామగ్రి కూడా ఉంది.

ఈ డీల్‌కు సంబంధించిన సర్టిఫికేషన్ పూర్తయిందని, అక్కడి పార్లమెంట్ కు సమాచారం ఇచ్చినట్లు అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ డీల్‌లో మొదటి భాగం జావెలిన్ మిసైల్ సిస్టమ్. దీని విలువ సుమారు 45.7 మిలియన్ డాలర్లు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ట్యాంకులను తుక్కుతుక్కు చేసిన ఈ జావెలిన్ క్షిపణులు ఇప్పుడు మన ఆర్మీ చేతికి రాబోతున్నాయి.

ఇందులో 25 కమాండ్ లాంచ్ యూనిట్లు, జావెలిన్ FGM 148 మిసైళ్లు ఉన్నాయి. ఇది ఒకసారి టార్గెట్ సెట్ చేసి వదిలేస్తే చాలు, శత్రువు ట్యాంక్ ఎక్కడున్నా వెతికి మరీ కొడుతుంది. ఇక రెండోది ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్. దీని విలువ 47.1 మిలియన్ డాలర్లు. ఇందులో భాగంగా భారత్ 216 ఎక్స్‌కాలిబర్ (M982A1) రౌండ్లను కొనుగోలు చేయనుంది.

ఇవి సాధారణ బాంబులు కాదు. జీపీఎస్ సాయంతో పనిచేసే స్మార్ట్ ఆర్టిలరీ షెల్స్. శత్రువుల బంకర్లు ఎంత దూరంలో ఉన్నా, అత్యంత కచ్చితత్వంతో, పక్కన ఉన్న సివిలియన్లకు హాని కలగకుండా కేవలం టార్గెట్‌ను మాత్రమే ధ్వంసం చేయడం వీటి స్పెషాలిటీ. ఈ ఆయుధాల అమ్మకం వల్ల ఈ ప్రాంతంలో సైనిక సమతుల్యత దెబ్బతినదని, పైగా ఇది ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దోహదపడుతుందని అమెరికా పేర్కొంది. భారత్ తమకు అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామి అని, ప్రస్తుత, భవిష్యత్తు ముప్పులను ఎదుర్కోవడానికి ఈ ఆయుధాలు భారత్‌కు ఎంతగానో ఉపయోగపడతాయని DSCA వెల్లడించింది.

చైనా, పాకిస్థాన్ వంటి పొరుగు దేశాల నుంచి సవాళ్లు ఎదురవుతున్న వేళ, ఈ డీల్ భారత్‌కు కొండంత బలాన్నిస్తుంది. ముఖ్యంగా సరిహద్దుల్లో పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయాల్సి వస్తే జావెలిన్, ఎక్స్‌కాలిబర్ రెండూ గేమ్ ఛేంజర్లుగా మారతాయి. ఈ కొత్త అస్త్రాలతో భారత ఆర్మీ ఫైర్ పవర్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం ఖాయం.

Satya

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

1 minute ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

6 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

6 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

6 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago