Political News

పేలిపోయే ఆన్సరిచ్చిన పవన్ కళ్యాణ్

వరదలొచ్చినా.. విపత్తులొచ్చినా.. జనాలకు ఇంకే కష్టం వచ్చినా.. విరాళాలు ప్రకటించే వాళ్లలో సినిమా వాళ్లు ముందుంటారు. ఆ సమయంలో జనాల దృష్టి కూడా వాళ్ల మీదే ఉంటుంది. సినిమాల ద్వారా కోట్లు సంపాదించే హీరోలు ఎవరు ఎంత విరాళం ప్రకటించారని చూస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై ఫిలిం సెలబ్రెటీలను నెటిజన్లు నిలదీసేస్తుంటారు కూడా. ఎవరెంత ఇచ్చారన్న దాన్ని బట్టి వాళ్ల వ్యక్తిత్వాన్ని కూడా నిర్దేశిస్తుంటారు.

ఐతే ఆయా సమయాల్లో మిగతా రంగాల ప్రముఖుల స్పందన ఎలా ఉందన్నది మాత్రం ఎవరూ పట్టించుకోరు. వందలు, వేల కోట్లు సంపాదించే రాజకీయ, వ్యాపార దిగ్గజాల గురించి అడిగేవాళ్లు ఎవరూ ఉండరు. వాళ్లలో చాలామంది ఒక్క రూపాయి కూడా విదల్చరు. ముఖ్యంగా రాజకీయ నాయకులైతే విరాళాలు ప్రకటించిన దాఖలాలే కనిపించవు. ఎన్నికల సమయాల్లో తప్పితే వాళ్ల నుంచి రూపాయి బయటికి రాదు.

ఇదే విషయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఓ సందర్భంలో ప్రస్తావించాడు. తాజాగా ఆయన ఆంధ్రా ప్రాంతంలో వరదల ధాటికి దెబ్బ తిన్న రైతులను పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఓ విలేకరి పవన్‌ను ఓ ప్రశ్న అడిగాడు. వరద వల్ల దెబ్బ తిన్న రైతులకు మీరు ఏం సాయం చేస్తున్నారు అని అడిగాడు.

దీనికి పవన్ బదులిస్తూ.. ‘‘ఈ ప్రశ్న నన్ను బాగానే అడిగారు. నా తరఫున, పార్టీ తరఫున ఏం జరగాలో అది జరుగుతుంది. మేం ఏం చేయగలమో అంతా చేస్తాం. కానీ ఇదే మాట మీరు అందరు రాజకీయ నాయకులనూ అడగాలి. ఎన్నికల కోసం వాళ్లు 30 కోట్లు.. 50 కోట్లు.. 150 కోట్లు.. ఇలా ఖర్చు చేస్తున్నారు. వందల కోట్లు సంపాదిస్తున్నారు. అందులో కొంత మొత్తం తీసి వరద బాధితులను ఆదుకోవచ్చు కదా. ఎప్పుడైనా వాళ్లు ఇలాంటి పరిస్థితుల్లో విరాళాలు ఇచ్చారా? దీని గురించి మీరు ఇంతే ధైర్యంగా రాజకీయ నాయకులను ప్రశ్నించాలి’’ అని పవన్ అన్నాడు. జనసేన అధినేత ప్రశ్న నూటికి నూరు శాతం సమంజసం. ఇలాంటి సందర్భాల్లో అందరి దృష్టీ సినిమా వాళ్ల మీద పడుతుంది తప్ప రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారన్నది ఎవ్వరూ పట్టించుకోరు.

This post was last modified on December 4, 2020 12:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

2 minutes ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

51 minutes ago

బూతులు తిట్టటం ట్రంప్ తోనే ఆరంభం కాలేదు

నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా…

2 hours ago

పవన్ ను తిట్టిన ద్వారంపూడి ఇప్పుడు టార్గెట్ అయ్యారా?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?... ఆయ‌న ప్రాభ‌వాన్ని.. వైభ‌వాన్ని…

2 hours ago

రైటర్ గారు… చేదుగా ఉన్నా నిజమే చెప్పారు

రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

పేర్ని పాకులాట‌.. ఇమేజ్ కోస‌మేనా.. ?

పేర్ని నాని. వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ నుంచి త‌ప్పుకొని వారసుడు కిట్టుకు…

5 hours ago