Political News

పేలిపోయే ఆన్సరిచ్చిన పవన్ కళ్యాణ్

వరదలొచ్చినా.. విపత్తులొచ్చినా.. జనాలకు ఇంకే కష్టం వచ్చినా.. విరాళాలు ప్రకటించే వాళ్లలో సినిమా వాళ్లు ముందుంటారు. ఆ సమయంలో జనాల దృష్టి కూడా వాళ్ల మీదే ఉంటుంది. సినిమాల ద్వారా కోట్లు సంపాదించే హీరోలు ఎవరు ఎంత విరాళం ప్రకటించారని చూస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై ఫిలిం సెలబ్రెటీలను నెటిజన్లు నిలదీసేస్తుంటారు కూడా. ఎవరెంత ఇచ్చారన్న దాన్ని బట్టి వాళ్ల వ్యక్తిత్వాన్ని కూడా నిర్దేశిస్తుంటారు.

ఐతే ఆయా సమయాల్లో మిగతా రంగాల ప్రముఖుల స్పందన ఎలా ఉందన్నది మాత్రం ఎవరూ పట్టించుకోరు. వందలు, వేల కోట్లు సంపాదించే రాజకీయ, వ్యాపార దిగ్గజాల గురించి అడిగేవాళ్లు ఎవరూ ఉండరు. వాళ్లలో చాలామంది ఒక్క రూపాయి కూడా విదల్చరు. ముఖ్యంగా రాజకీయ నాయకులైతే విరాళాలు ప్రకటించిన దాఖలాలే కనిపించవు. ఎన్నికల సమయాల్లో తప్పితే వాళ్ల నుంచి రూపాయి బయటికి రాదు.

ఇదే విషయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఓ సందర్భంలో ప్రస్తావించాడు. తాజాగా ఆయన ఆంధ్రా ప్రాంతంలో వరదల ధాటికి దెబ్బ తిన్న రైతులను పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఓ విలేకరి పవన్‌ను ఓ ప్రశ్న అడిగాడు. వరద వల్ల దెబ్బ తిన్న రైతులకు మీరు ఏం సాయం చేస్తున్నారు అని అడిగాడు.

దీనికి పవన్ బదులిస్తూ.. ‘‘ఈ ప్రశ్న నన్ను బాగానే అడిగారు. నా తరఫున, పార్టీ తరఫున ఏం జరగాలో అది జరుగుతుంది. మేం ఏం చేయగలమో అంతా చేస్తాం. కానీ ఇదే మాట మీరు అందరు రాజకీయ నాయకులనూ అడగాలి. ఎన్నికల కోసం వాళ్లు 30 కోట్లు.. 50 కోట్లు.. 150 కోట్లు.. ఇలా ఖర్చు చేస్తున్నారు. వందల కోట్లు సంపాదిస్తున్నారు. అందులో కొంత మొత్తం తీసి వరద బాధితులను ఆదుకోవచ్చు కదా. ఎప్పుడైనా వాళ్లు ఇలాంటి పరిస్థితుల్లో విరాళాలు ఇచ్చారా? దీని గురించి మీరు ఇంతే ధైర్యంగా రాజకీయ నాయకులను ప్రశ్నించాలి’’ అని పవన్ అన్నాడు. జనసేన అధినేత ప్రశ్న నూటికి నూరు శాతం సమంజసం. ఇలాంటి సందర్భాల్లో అందరి దృష్టీ సినిమా వాళ్ల మీద పడుతుంది తప్ప రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారన్నది ఎవ్వరూ పట్టించుకోరు.

This post was last modified on December 4, 2020 12:38 pm

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

4 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

4 hours ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

8 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

8 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

9 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

9 hours ago