Political News

పేలిపోయే ఆన్సరిచ్చిన పవన్ కళ్యాణ్

వరదలొచ్చినా.. విపత్తులొచ్చినా.. జనాలకు ఇంకే కష్టం వచ్చినా.. విరాళాలు ప్రకటించే వాళ్లలో సినిమా వాళ్లు ముందుంటారు. ఆ సమయంలో జనాల దృష్టి కూడా వాళ్ల మీదే ఉంటుంది. సినిమాల ద్వారా కోట్లు సంపాదించే హీరోలు ఎవరు ఎంత విరాళం ప్రకటించారని చూస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై ఫిలిం సెలబ్రెటీలను నెటిజన్లు నిలదీసేస్తుంటారు కూడా. ఎవరెంత ఇచ్చారన్న దాన్ని బట్టి వాళ్ల వ్యక్తిత్వాన్ని కూడా నిర్దేశిస్తుంటారు.

ఐతే ఆయా సమయాల్లో మిగతా రంగాల ప్రముఖుల స్పందన ఎలా ఉందన్నది మాత్రం ఎవరూ పట్టించుకోరు. వందలు, వేల కోట్లు సంపాదించే రాజకీయ, వ్యాపార దిగ్గజాల గురించి అడిగేవాళ్లు ఎవరూ ఉండరు. వాళ్లలో చాలామంది ఒక్క రూపాయి కూడా విదల్చరు. ముఖ్యంగా రాజకీయ నాయకులైతే విరాళాలు ప్రకటించిన దాఖలాలే కనిపించవు. ఎన్నికల సమయాల్లో తప్పితే వాళ్ల నుంచి రూపాయి బయటికి రాదు.

ఇదే విషయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఓ సందర్భంలో ప్రస్తావించాడు. తాజాగా ఆయన ఆంధ్రా ప్రాంతంలో వరదల ధాటికి దెబ్బ తిన్న రైతులను పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఓ విలేకరి పవన్‌ను ఓ ప్రశ్న అడిగాడు. వరద వల్ల దెబ్బ తిన్న రైతులకు మీరు ఏం సాయం చేస్తున్నారు అని అడిగాడు.

దీనికి పవన్ బదులిస్తూ.. ‘‘ఈ ప్రశ్న నన్ను బాగానే అడిగారు. నా తరఫున, పార్టీ తరఫున ఏం జరగాలో అది జరుగుతుంది. మేం ఏం చేయగలమో అంతా చేస్తాం. కానీ ఇదే మాట మీరు అందరు రాజకీయ నాయకులనూ అడగాలి. ఎన్నికల కోసం వాళ్లు 30 కోట్లు.. 50 కోట్లు.. 150 కోట్లు.. ఇలా ఖర్చు చేస్తున్నారు. వందల కోట్లు సంపాదిస్తున్నారు. అందులో కొంత మొత్తం తీసి వరద బాధితులను ఆదుకోవచ్చు కదా. ఎప్పుడైనా వాళ్లు ఇలాంటి పరిస్థితుల్లో విరాళాలు ఇచ్చారా? దీని గురించి మీరు ఇంతే ధైర్యంగా రాజకీయ నాయకులను ప్రశ్నించాలి’’ అని పవన్ అన్నాడు. జనసేన అధినేత ప్రశ్న నూటికి నూరు శాతం సమంజసం. ఇలాంటి సందర్భాల్లో అందరి దృష్టీ సినిమా వాళ్ల మీద పడుతుంది తప్ప రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారన్నది ఎవ్వరూ పట్టించుకోరు.

This post was last modified on December 4, 2020 12:38 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

3 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

3 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

5 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

5 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

5 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

7 hours ago