వరదలొచ్చినా.. విపత్తులొచ్చినా.. జనాలకు ఇంకే కష్టం వచ్చినా.. విరాళాలు ప్రకటించే వాళ్లలో సినిమా వాళ్లు ముందుంటారు. ఆ సమయంలో జనాల దృష్టి కూడా వాళ్ల మీదే ఉంటుంది. సినిమాల ద్వారా కోట్లు సంపాదించే హీరోలు ఎవరు ఎంత విరాళం ప్రకటించారని చూస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై ఫిలిం సెలబ్రెటీలను నెటిజన్లు నిలదీసేస్తుంటారు కూడా. ఎవరెంత ఇచ్చారన్న దాన్ని బట్టి వాళ్ల వ్యక్తిత్వాన్ని కూడా నిర్దేశిస్తుంటారు.
ఐతే ఆయా సమయాల్లో మిగతా రంగాల ప్రముఖుల స్పందన ఎలా ఉందన్నది మాత్రం ఎవరూ పట్టించుకోరు. వందలు, వేల కోట్లు సంపాదించే రాజకీయ, వ్యాపార దిగ్గజాల గురించి అడిగేవాళ్లు ఎవరూ ఉండరు. వాళ్లలో చాలామంది ఒక్క రూపాయి కూడా విదల్చరు. ముఖ్యంగా రాజకీయ నాయకులైతే విరాళాలు ప్రకటించిన దాఖలాలే కనిపించవు. ఎన్నికల సమయాల్లో తప్పితే వాళ్ల నుంచి రూపాయి బయటికి రాదు.
ఇదే విషయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఓ సందర్భంలో ప్రస్తావించాడు. తాజాగా ఆయన ఆంధ్రా ప్రాంతంలో వరదల ధాటికి దెబ్బ తిన్న రైతులను పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఓ విలేకరి పవన్ను ఓ ప్రశ్న అడిగాడు. వరద వల్ల దెబ్బ తిన్న రైతులకు మీరు ఏం సాయం చేస్తున్నారు అని అడిగాడు.
దీనికి పవన్ బదులిస్తూ.. ‘‘ఈ ప్రశ్న నన్ను బాగానే అడిగారు. నా తరఫున, పార్టీ తరఫున ఏం జరగాలో అది జరుగుతుంది. మేం ఏం చేయగలమో అంతా చేస్తాం. కానీ ఇదే మాట మీరు అందరు రాజకీయ నాయకులనూ అడగాలి. ఎన్నికల కోసం వాళ్లు 30 కోట్లు.. 50 కోట్లు.. 150 కోట్లు.. ఇలా ఖర్చు చేస్తున్నారు. వందల కోట్లు సంపాదిస్తున్నారు. అందులో కొంత మొత్తం తీసి వరద బాధితులను ఆదుకోవచ్చు కదా. ఎప్పుడైనా వాళ్లు ఇలాంటి పరిస్థితుల్లో విరాళాలు ఇచ్చారా? దీని గురించి మీరు ఇంతే ధైర్యంగా రాజకీయ నాయకులను ప్రశ్నించాలి’’ అని పవన్ అన్నాడు. జనసేన అధినేత ప్రశ్న నూటికి నూరు శాతం సమంజసం. ఇలాంటి సందర్భాల్లో అందరి దృష్టీ సినిమా వాళ్ల మీద పడుతుంది తప్ప రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారన్నది ఎవ్వరూ పట్టించుకోరు.
This post was last modified on December 4, 2020 12:38 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…