Political News

జ‌గ‌నే… నన్ను దూరం పెట్టాడు: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్ సోద‌రి, ప్ర‌స్తుతం ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా ఉన్న వైఎస్ ష‌ర్మిల‌.. మ‌రోసారి త‌న అన్న‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను జ‌గ‌న్‌కు దూరం కాలేద‌ని.. జ‌గ‌నే త‌న‌ను, త‌న త‌ల్లిని కూడా దూరం పెట్టాడ‌ని ఆమె అన్నారు. “ఎవ‌రు చెప్పారు.. జ‌గ‌న్‌కు నేను దూరంగా ఉన్నాన‌ని?” అని ఆమె ప్ర‌శ్నించారు. అంతేకాదు..”జ‌గ‌న్ ఎప్పుడు అడిగినా.. నేను రాజ‌కీయంగానే కాదు.. కుటుంబ ప‌రంగా కూడా అండ‌గా ఉన్నా.” అని తెలిపారు. కానీ, ఆయ‌నే రాజ‌కీయంగా త‌న‌ను దూరం పెట్టార‌ని అన్నారు. ఆస్తుల వివాదాల సృష్టి కూడా ఆయ‌నదేన‌ని చెప్పారు.

తాజాగా విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడిన ష‌ర్మిల‌.. జ‌గ‌న్‌పై స్పందించారు. అన్న‌గా జ‌గ‌న్ అంటే ఇప్ప‌టికీ అభిమాన‌మేనని చెప్పారు. ఆయ‌న అడిగిన వెంట‌నే 3 వేల కిలోమీట‌ర్ల దూరాన్ని కూడా అల‌వోక‌గా పాద‌యాత్ర చేశాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే పార్టీ నిల‌బ‌డింద‌న్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాలా? అని ఎదురు ప్ర‌శ్నించారు. ఇంత చేసినా.. త‌న‌ను ఆయ‌నే గుర్తించ‌లేద‌న్నారు. తాను స్వ‌యంగా జ‌గ‌న్‌ను వ‌దిలేయ‌లేద‌ని.. జ‌గ‌నే త‌న‌ను వ‌దిలేశార‌ని.. బంధాన్నికూడా బ‌ద్నాం చేశాడ‌ని అన్నా రు. దీంతో త‌న దారి తాను చూసుకున్నాన‌ని ష‌ర్మిల తెలిపారు.

“నేను పార్టీ పెట్టుకున్నా. నీకు(జ‌గ‌న్‌) ఇబ్బంది లేదు. అయినా.. పార్టీని కూడా వేధించేలా వార్త‌లు రాయించారు. ఇది త‌గునా? అని అన్నందుకు సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. బీఆర్ఎస్‌తో క‌లిసి.. న‌న్ను అరెస్టు చేయించారు.” అని ఆనాటి సంగ‌తులను ష‌ర్మిల గుర్తు చేసుకున్నారు. అన్న‌గా త‌న పాత్ర‌ను జ‌గ‌న్ మ‌రిచిపోయినా.. సోద‌రిగా తాను మాత్రం ఎప్పుడూ జ‌గ‌న్‌కు అండ‌గా ఉన్నాన‌ని చెప్పారు. విశ్వాసం అనేది ఎవ‌రో ఇస్తే వ‌చ్చేది కాద‌న్న ష‌ర్మిల‌.. అది మ‌న‌సులో ఉండాల‌న్నారు. కానీ, అది లేదు కాబట్టే.. నా దారి నేను చూసుకున్నాన‌ని వెల్ల‌డించారు.

“జ‌గ‌న్ జైల్లో ఉన్న‌ప్పుడు.. ఎలాంటి ప‌రిస్థితి ఉందో తెలుసుక‌దా?. అప్ప‌ట్లో వైసీపీ నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. అయినా.. నేను కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని పాద‌యాత్ర చేశా? నిజంగా నాకు అంత స్టామినా ఉంటుంద‌ని అనుకోలేదు. కానీ, అన్న‌గా ఆయ‌న‌కు అండ‌గా ఉండాల‌ని భావించిన‌ప్పుడు.. న‌న్ను నేను మ‌లుచుకున్నా. ” అని ష‌ర్మిల వివ‌రించారు. ఇక‌, ఆస్తుల వివాదం కూడా తాను సృష్టించింద‌ని ప్ర‌చారం చేశార‌ని.. కానీ, దీనిలోనూ వాస్త‌వం లేద‌ని.. ఇంత‌క‌న్నా ఏమీ చెప్ప‌లేన‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

This post was last modified on November 20, 2025 8:37 am

Share

Recent Posts

సాయిపల్లవిని కావాలనే టార్గెట్ చేస్తున్నారా

నిన్న విడుదలైన రామాయణ నాలుగు నిమిషాల ట్రైలర్ సోషల్ మీడియాలో పెద్ద చిచ్చే పెట్టింది. ఒకవైపు ఆదిపురుష్ పోలికలను తీసుకొచ్చి…

1 hour ago

జూలై నెలాఖరు… జోష్ ఎలా ఉంది గురు

జూలై అయిపోయింది. వేసవిలో ఎండల బాలన్స్ ఏదైనా ఉందంటే ఈ నెలతో సమాప్తం అయినట్టే. ఆల్రెడీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను…

2 hours ago

మళ్ళీ పేపర్ లీక్ అయిందా సారూ…

పేపర్ లీకేజి భూతం ఒదిలిపెట్టేలా కనిపించడం లేదు.  కేంద్ర విద్యా శాఖ మంత్రిని పదవిని బలిగొన్నా అక్రమార్కులు వెనకంజ వేయడం…

2 hours ago

ఇకపై వందేమాతరం పాడేటప్పుడు ఇవి చెయ్యకూడదు

నిత్యం పాఠ‌శాలల్లోనూ.. జాతీయ పండుగ‌ల దినాల్లోనూ అంద‌రూ క‌ల‌సి పాడుకునే జాతీయ గేయం వందేమాతరం ఇక‌, చ‌ట్ట‌బ‌ద్ధం కానుంది. దీనికి…

3 hours ago

ప‌రామ‌ర్శ‌ల‌తో `పోయేది` చాలానే ఉంది… జ‌గ‌న్‌.. !

ప‌రామ‌ర్శ‌లు చేయ‌డం త‌ప్పుకాదు. పార్టీని కాపాడుకోవ‌డ‌మూ త‌ప్పుకాదు. కానీ, ఎవ‌రిని పరామ‌ర్శించాలన్న విష‌యంలోనే పార్టీలు విజ్ఞ‌త‌తో ముందుకు సాగాలి. ఈ…

3 hours ago

కొత్త కుర్రాడి మీద కామెంట్స్ ఏంటి

భారీ అంచనాలు కాదు కానీ ఘట్టమనేని ఫ్యామిలీ కావడంతో జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం మీద ఆడియన్స్ లో…

3 hours ago