సినిమా వాళ్లకు రాజకీయం ఎందుకు అన్న వాళ్ల నోళ్లు మూయిస్తూ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయి సంచలనం సృష్టించారు ఎన్టీ రామారావు. అదే సమయంలో అటు తమిళనాడులోనూ రాజకీయాల్లో సినిమా వాళ్ల ఆధిపత్యం మొదలైంది. అక్కడ సినీ రంగం నుంచి వచ్చి ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ముఖ్యమంత్రి పీఠాలను అధిష్టించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ తదనంతరం రాజకీయాల్లో సినిమా వాళ్ల ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది కానీ.. తమిళనాట మాత్రం సినీ-రాజకీయ నేతల ఆధిపత్యం కొనసాగింది.
ఎన్టీఆర్ చనిపోయాక ఒక పుష్కర కాలానికి మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయి జనాదరణ సంపాదించుకున్న మెగాస్టార్.. ఎన్టీఆర్ రికార్డును బద్దలు కొడుతూ ఇంకా తక్కువ సమయంలో పార్టీ పెట్టి సీఎం అయిపోవాలనుకున్నారు. కానీ రోజులు బాగా మారిపోయిన పరిస్థితుల్లో ఆయన అంచనాలు తలకిందులయ్యాయి. తొలి ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల తర్వాత చిరు కాస్తయినా ఓపిక పట్టలేకపోయారు. రెండేళ్లు తిరిగేసరికి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేశారు. చిరు దెబ్బకు మళ్లీ ఏ సినీ హీరో కూడా పెద్ద లక్ష్యాలతో రాజకీయాల్లోకి రాలేని పరిస్థితి తలెత్తింది. ఈ ప్రభావం పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన మీద బాగానే పడింది. ఆయన వ్యక్తిగత వైఫల్యం కూడా తోడై జనసేనకు గత ఎన్నికల్లో దారుణమైన ఫలితాలొచ్చాయి. ఈ దెబ్బతో తెలుగునాట సినిమా రాజకీయాలకు దాదాపు తెరపడినట్లయింది. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఏమైనా కథ మారుస్తాడేమో చూడాలి.
తమిళనాట రాజకీయాల విషయానికి వస్తే.. జయలలిత, కరుణానిధిల మరణంతో అక్కడ రాజకీయ శూన్యత నెలకొందని, ఇలాంటి సమయంలో రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు బరిలోకి దిగితే సులువుగా అధికారం చేపట్టవచ్చని అంచనా వేశారు. ఐతే వీళ్లిద్దరూ నిరాశ పరిచారు. ఇద్దరూ కలిసి ఎన్నికలకు రెండు మూడేళ్లు ముందు ఉమ్మడిగా పార్టీ మొదలుపెట్టి బలమైన కార్యాచరణతో రంగంలోకి దిగితే బాగుండేదేమో. కానీ అలా ఏమీ జరగలేదు.
కమల్ సొంతంగా పార్టీ పెట్టాడు. ఆయన ప్రభావం ఇప్పటి వరకు అయితే అంతంతమాత్రంగానే ఉంది. రజినీ మీద ఆశలు పెట్టుకుంటే ఆయన మరింతగా నిరాశ పరిచారు. పార్టీని ప్రకటించడానికే ఆయన చాలా సమయం తీసుకున్నారు. ఆయన నాన్చుడు ధోరణితో జనాలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇప్పుడు పార్టీ ప్రకటన గురించి సంకేతాలిచ్చినా పెద్దగా స్పందన లేదు. రాబోయే ఎన్నికల్లో కమల్ కానీ, రజినీ కానీ పెద్దగా ప్రభావం చూపిస్తారన్న అంచనాలైతే పెద్దగా లేవు. చూస్తుంటే తమిళనాట కూడా తెలుగు రాష్ట్రాల పరిస్థితులే పునరావృతం అవుతాయేమో అనిపిస్తోంది.
This post was last modified on December 3, 2020 10:11 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…