Political News

వెంక్నన దర్శనం..కరోనాకు ముందు..కరోనా తర్వాత

కలియుగ దైవం వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు వస్తుంటారు. విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు….తమ బాలాజీకి మొక్కులు చెల్లించుకునేందుకు వెంకన్న సన్నిధికి వస్తుంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అయితే లక్షలాది మంది భక్తులతో తిరుమల తిరుపతి దేవస్థానం కిటకిటలాడుతుంటుంది.

అయితే, కరోనా మహమ్మారి పుణ్యమా అంటూ గత 40 రోజులుగా తిరుమలతో పాటు దేశంలోని అన్ని మతాల ప్రార్థనా మందిరాలను మూసివేశారు. స్వామివారికి నిత్య నైవేద్య పూజలు జరుగుతున్నప్పటికీ…వెంకన్న సన్నిధిలోకి సాధారణ భక్తులకు అనుమతి లేదు. లాక్ డౌన్ 3.0లోనూ ప్రార్థనా మందిరాలకు, మతపరమైన కార్యక్రమాలను అనుమతినివ్వలేదు.

ఈ నేపథ్యంలో భవిష్యత్తులో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు మళ్లీ స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని, అయితే, తిరుమలలో గతంలో మాదిరి వేలు, లక్షల మందికి దర్శనాలు ఉండకపోవచ్చని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

కొంతకాలం వరకు భక్తులందరూ భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు, క్యూలైన్లలో కూడా మార్పులు ఉంటాయని వైవీ తెలిపారు. ఒక్కో భక్తుడు కనీసం ఒక మీటర్ భౌతి దూరాన్ని పాటించేలా చూస్తామన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత సాధ్యమైనంత త్వరలో భక్తులకు దర్శన అనుమతి కల్పిస్తామన్నారు. మాస్కులు, శానిటైజర్లు వంటి సదుపాయాలు తిరుమలలోనూ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వైవీ చెప్పారు.

కరోనా పుణ్యమా అంటూ… ఇకపై తిరుపతిలో తనివితీరా స్వామివారి దర్శనం చేసుకోవచ్చని కొందరు భక్తులు అభిప్రాయపడుతున్నారు. గతంలో మాదిరిగా క్యూలైన్లో తోపులాటలు, పరిగెత్తించడాలు వంటివి ఉండకపోవచ్చని అనుకుంటున్నారు. గతంలో దర్శనం సమయంలో చాలామందికి క్యూలైన్లలో తమ వంతు ఎప్పుడు వస్తుందా అన్న విషయంపై ఫోకస్ ఉంటుందని…ఇకపై పరిమిత సంఖ్యలో భక్తులకు …క్రమ పద్ధతి ప్రకారం అనుమతి ఉండే అవకాశం ఉండడంతో ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

మనసంతా దేవుడిపై లగ్నం చేయవచ్చని…హాయిగా వెంకన్నను ఆరాధించవచ్చని అంటున్నారు. గతంలో ఓ టైం స్లాట్ లో వందలాది భక్తులను పంపేవారని…అప్పుడు కూడా తోపులాటలు, ఇబ్బందులు ఉండేవని…ఇకపై పరిమిత సంఖ్యలో వ్యక్తిగతంగా లేదా కుటుంబాల వారీగా టైం స్లాట్ కేటాయిస్తారేమోనని అనుకుంటున్నారు.

This post was last modified on May 2, 2020 6:47 pm

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

1 hour ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

1 hour ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

1 hour ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

2 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

2 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

2 hours ago