Political News

దూసుకొచ్చిన పెట్టుబడులు.. ఒక్కరోజులో ఎంతంటే

ఏపీ సీఎం చంద్రబాబు స్ట్రాటజీ సక్సెస్ అయింది. విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు ద్వారా భారీ ఎత్తున పెట్టుబడిదారులను ఆకర్షించాలన్న ఆయన వ్యూహం సఫలమైంది. శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సులో తొలి రోజే 13 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు సాధించినట్టు సీఎం చెప్పారు. వాస్తవానికి ఈ సదస్సు జరిగే రెండు రోజుల్లో మొత్తం 10 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు.

అయితే తొలి రోజే అంచనాలకు మించి 13 లక్షల కోట్ల రూపాయల మేరకు సాధించినట్టు సీఎం చంద్రబాబు వివరించారు. ఇక ఇప్పటివరకు జరిగిన 17 మాసాల కాలంలో 10 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు సాధించామని, తాజాగా జరిగిన పెట్టుబడుల ఒప్పందాలతో ఈ సంఖ్య 23 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పోర్టులు, విద్యుత్, స్టార్టప్, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు విరివిగా వచ్చాయని చెప్పారు.

ఈ పెట్టుబడుల ద్వారా వేల మందికి ఉద్యోగాలు, లక్షల సంఖ్యలో ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. అదే సమయంలో శ్రీసిటీ తిరుపతిలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఉత్సాహంగా ముందుకు వచ్చారని చెప్పారు. వివిధ దేశాల పరిశ్రమలు శ్రీసిటీ పారిశ్రామిక టౌన్షిప్ కు రావాలని సూచించారు. అక్కడ మరొక 6 వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. 2028 నాటికే రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

కాగా తొలి రోజు సదస్సుకు 72 దేశాలకు చెందిన ప్రతినిధులు రాగా, రెండో రోజు మరొక 10 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. పెట్టుబడులకు గట్టి హామీ ఇస్తున్నందుకే ఈ తరహా స్పందన లభిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని మరోసారి హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి కూడా సహకారం ఉందని తెలిపారు.

Satya

Recent Posts

అస్సలు తగ్గనంటున్న గుణశేఖర్

సీనియర్ దర్శకుడు గుణశేఖర్‌ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…

8 minutes ago

సుస్మితా సేన్ గోల్డ్ డిగ్గరా లలిత్ మోడీ?

బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్‌మ్యాన్‌లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్‌షిప్‌లు ఉండి ఆర్థిక…

38 minutes ago

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

4 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

5 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

6 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

8 hours ago