Political News

దూసుకొచ్చిన పెట్టుబడులు.. ఒక్కరోజులో ఎంతంటే

ఏపీ సీఎం చంద్రబాబు స్ట్రాటజీ సక్సెస్ అయింది. విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సు ద్వారా భారీ ఎత్తున పెట్టుబడిదారులను ఆకర్షించాలన్న ఆయన వ్యూహం సఫలమైంది. శుక్రవారం ప్రారంభమైన ఈ సదస్సులో తొలి రోజే 13 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు సాధించినట్టు సీఎం చెప్పారు. వాస్తవానికి ఈ సదస్సు జరిగే రెండు రోజుల్లో మొత్తం 10 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు.

అయితే తొలి రోజే అంచనాలకు మించి 13 లక్షల కోట్ల రూపాయల మేరకు సాధించినట్టు సీఎం చంద్రబాబు వివరించారు. ఇక ఇప్పటివరకు జరిగిన 17 మాసాల కాలంలో 10 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు సాధించామని, తాజాగా జరిగిన పెట్టుబడుల ఒప్పందాలతో ఈ సంఖ్య 23 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పోర్టులు, విద్యుత్, స్టార్టప్, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు విరివిగా వచ్చాయని చెప్పారు.

ఈ పెట్టుబడుల ద్వారా వేల మందికి ఉద్యోగాలు, లక్షల సంఖ్యలో ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. అదే సమయంలో శ్రీసిటీ తిరుపతిలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఉత్సాహంగా ముందుకు వచ్చారని చెప్పారు. వివిధ దేశాల పరిశ్రమలు శ్రీసిటీ పారిశ్రామిక టౌన్షిప్ కు రావాలని సూచించారు. అక్కడ మరొక 6 వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు. 2028 నాటికే రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

కాగా తొలి రోజు సదస్సుకు 72 దేశాలకు చెందిన ప్రతినిధులు రాగా, రెండో రోజు మరొక 10 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. పెట్టుబడులకు గట్టి హామీ ఇస్తున్నందుకే ఈ తరహా స్పందన లభిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని మరోసారి హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి కూడా సహకారం ఉందని తెలిపారు.

This post was last modified on November 16, 2025 7:57 am

Share
Show comments
Published by
Satya
Tags: Vizag

Recent Posts

అన్నగారంటే ఇంత నిర్లక్ష్యమా?

థియేటర్లలో విడుదలైన పధ్నాలుగు రోజులకే కార్తీ కొత్త సినిమా వా వతియార్ ఓటిటిలో వచ్చేయడం అభిమానులకు షాక్ కలిగించింది. తెలుగు…

53 minutes ago

మారుతికి కొత్త‌ర‌కం టార్చ‌ర్

రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ సినిమా మామూలుగా ఉండ‌ద‌ని చెబుతూ, ప్ర‌భాస్ అభిమానుల‌కు భ‌రోసానిస్తూ, తేడా…

3 hours ago

సంచలన బిల్లు: అసెంబ్లీకి రాకపోతే జీతం కట్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు బడ్జెట్…

3 hours ago

శంక‌ర్‌కు బ‌డా నిర్మాత కండిష‌న్‌

రాజ‌మౌళి కంటే ముందు సౌత్ ఇండియ‌న్ సినిమా స్థాయిని పెంచి.. అద్భుత‌మైన క‌థ‌లు, క‌ళ్లు చెదిరే విజువ‌ల్ ఎఫెక్ట్స్, సాంకేతిక…

4 hours ago

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

5 hours ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

5 hours ago