బుధవారమంతా సోషల్ మీడియాలో తెలుగువాళ్ల పొటిలికల్ చర్చలన్నీ ఒక వీడియో మీదే నడిచాయి. అసెంబ్లీలో వైకాపా సర్కారు చంద్రబాబుకు సంబంధించి ప్రదర్శించిన ఓ వీడియో తెగ వైరల్ అయిపోయింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నపుడు జనాల్ని పోలవరం ప్రాజెక్టు వద్దకు బస్సులు పెట్టి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
అందులో ఓ బృందంలోని మహిళలు జయము జయము చంద్రన్నా అంటూ పాటలు పాడిన వీడియోను స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అడిగి మరీ ప్లే చేయించారు. దీన్ని చూపించి జగన్.. చంద్రబాబును ఎగతాళి చేయడం, వైకాపా ఎమ్మెల్యేలు వెటకారంగా నవ్వడం టీడీపీ వాళ్లు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. వైసీపీ మద్దతుదారులతో పాటు టీడీపీ వ్యతిరేకులు ఈ పరిణామాన్ని బాగా ఎంజాయ్ చేశారు సోషల్ మీడియాలో.
ఐతే టీడీపీ మద్దతుదారులతో పాటు కొందరు తటస్థులు జగన్ తీరును తప్పుబట్టారు. సభలో ఇలాంటి వీడియో ప్లే చేయడం ద్వారా ఎలాంటి సంస్కృతిని మొదలుపెడుతున్నారన్న ప్రశ్న తలెత్తింది. ఈ ఒరవడి ఇలాగే కొనసాగిస్తే దీనికి అంతెక్కడ అన్నది వారి అభ్యంతరం. ఇప్పటికే హద్దులు దాటిన మాటలతో సభ హుందాతనం, దాని పట్ల గౌరవం బాగా తగ్గిపోయిందన్న అభిప్రాయాల నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయన్న వాదన మొదలైంది.
చంద్రబాబు వైపు వేలెత్తి చూపుతున్న జగన్ కూడా.. భజన చేయించుకోవడంలో తక్కువేమీ కాదన్నదీ తెలిసిన సంగతే. జగన్ సీఎం అయ్యాక సభలో వైకాపా సభ్యులు, మంత్రులు పోటీపడి ఎలా పొగిడారో, పొగుడుతున్నారో.. బయట ఆ పార్టీ వాళ్లు హద్దులు దాటి జగన్ భజన ఎలా చేస్తున్నారో తెలిసిందే. ఈ వీడియోలన్నీ దాచి.. రేప్పొద్దున టీడీపీ అధికారంలోకి వచ్చి వాళ్లు కూడా ఇలా సభలో వీడియోలు ప్లే చేస్తే పరిస్థితేంటి?
This post was last modified on December 3, 2020 8:14 am
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…