బుధవారమంతా సోషల్ మీడియాలో తెలుగువాళ్ల పొటిలికల్ చర్చలన్నీ ఒక వీడియో మీదే నడిచాయి. అసెంబ్లీలో వైకాపా సర్కారు చంద్రబాబుకు సంబంధించి ప్రదర్శించిన ఓ వీడియో తెగ వైరల్ అయిపోయింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నపుడు జనాల్ని పోలవరం ప్రాజెక్టు వద్దకు బస్సులు పెట్టి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
అందులో ఓ బృందంలోని మహిళలు జయము జయము చంద్రన్నా అంటూ పాటలు పాడిన వీడియోను స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అడిగి మరీ ప్లే చేయించారు. దీన్ని చూపించి జగన్.. చంద్రబాబును ఎగతాళి చేయడం, వైకాపా ఎమ్మెల్యేలు వెటకారంగా నవ్వడం టీడీపీ వాళ్లు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. వైసీపీ మద్దతుదారులతో పాటు టీడీపీ వ్యతిరేకులు ఈ పరిణామాన్ని బాగా ఎంజాయ్ చేశారు సోషల్ మీడియాలో.
ఐతే టీడీపీ మద్దతుదారులతో పాటు కొందరు తటస్థులు జగన్ తీరును తప్పుబట్టారు. సభలో ఇలాంటి వీడియో ప్లే చేయడం ద్వారా ఎలాంటి సంస్కృతిని మొదలుపెడుతున్నారన్న ప్రశ్న తలెత్తింది. ఈ ఒరవడి ఇలాగే కొనసాగిస్తే దీనికి అంతెక్కడ అన్నది వారి అభ్యంతరం. ఇప్పటికే హద్దులు దాటిన మాటలతో సభ హుందాతనం, దాని పట్ల గౌరవం బాగా తగ్గిపోయిందన్న అభిప్రాయాల నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయన్న వాదన మొదలైంది.
చంద్రబాబు వైపు వేలెత్తి చూపుతున్న జగన్ కూడా.. భజన చేయించుకోవడంలో తక్కువేమీ కాదన్నదీ తెలిసిన సంగతే. జగన్ సీఎం అయ్యాక సభలో వైకాపా సభ్యులు, మంత్రులు పోటీపడి ఎలా పొగిడారో, పొగుడుతున్నారో.. బయట ఆ పార్టీ వాళ్లు హద్దులు దాటి జగన్ భజన ఎలా చేస్తున్నారో తెలిసిందే. ఈ వీడియోలన్నీ దాచి.. రేప్పొద్దున టీడీపీ అధికారంలోకి వచ్చి వాళ్లు కూడా ఇలా సభలో వీడియోలు ప్లే చేస్తే పరిస్థితేంటి?
This post was last modified on December 3, 2020 8:14 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…