బుధవారమంతా సోషల్ మీడియాలో తెలుగువాళ్ల పొటిలికల్ చర్చలన్నీ ఒక వీడియో మీదే నడిచాయి. అసెంబ్లీలో వైకాపా సర్కారు చంద్రబాబుకు సంబంధించి ప్రదర్శించిన ఓ వీడియో తెగ వైరల్ అయిపోయింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నపుడు జనాల్ని పోలవరం ప్రాజెక్టు వద్దకు బస్సులు పెట్టి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
అందులో ఓ బృందంలోని మహిళలు జయము జయము చంద్రన్నా అంటూ పాటలు పాడిన వీడియోను స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే అడిగి మరీ ప్లే చేయించారు. దీన్ని చూపించి జగన్.. చంద్రబాబును ఎగతాళి చేయడం, వైకాపా ఎమ్మెల్యేలు వెటకారంగా నవ్వడం టీడీపీ వాళ్లు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. వైసీపీ మద్దతుదారులతో పాటు టీడీపీ వ్యతిరేకులు ఈ పరిణామాన్ని బాగా ఎంజాయ్ చేశారు సోషల్ మీడియాలో.
ఐతే టీడీపీ మద్దతుదారులతో పాటు కొందరు తటస్థులు జగన్ తీరును తప్పుబట్టారు. సభలో ఇలాంటి వీడియో ప్లే చేయడం ద్వారా ఎలాంటి సంస్కృతిని మొదలుపెడుతున్నారన్న ప్రశ్న తలెత్తింది. ఈ ఒరవడి ఇలాగే కొనసాగిస్తే దీనికి అంతెక్కడ అన్నది వారి అభ్యంతరం. ఇప్పటికే హద్దులు దాటిన మాటలతో సభ హుందాతనం, దాని పట్ల గౌరవం బాగా తగ్గిపోయిందన్న అభిప్రాయాల నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయన్న వాదన మొదలైంది.
చంద్రబాబు వైపు వేలెత్తి చూపుతున్న జగన్ కూడా.. భజన చేయించుకోవడంలో తక్కువేమీ కాదన్నదీ తెలిసిన సంగతే. జగన్ సీఎం అయ్యాక సభలో వైకాపా సభ్యులు, మంత్రులు పోటీపడి ఎలా పొగిడారో, పొగుడుతున్నారో.. బయట ఆ పార్టీ వాళ్లు హద్దులు దాటి జగన్ భజన ఎలా చేస్తున్నారో తెలిసిందే. ఈ వీడియోలన్నీ దాచి.. రేప్పొద్దున టీడీపీ అధికారంలోకి వచ్చి వాళ్లు కూడా ఇలా సభలో వీడియోలు ప్లే చేస్తే పరిస్థితేంటి?
This post was last modified on December 3, 2020 8:14 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…