Political News

న‌వీన్ యాద‌వ్ ఘ‌న విజ‌యం.. కాంగ్రెస్ మార్పు ఇప్ప‌టి నుంచే!

జూబ్లీహిల్స్ ఒకే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం దక్కించుకుంది. ఆ పార్టీ ఊహించని విధంగా ఎన్నికల ఫలితం కూడా రావడం విశేషం అనే చెప్పాలి. మహా గెలిస్తే 4000 లేదా 5000 ఓట్లతో గెలుస్తామన్న వాదన ఆది నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు దాదాపు 25 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ విజయం దక్కించుకున్నారు. అయితే, ప్రభుత్వం విజయం దక్కించుకున్నప్పటికీ ఇది ఒక హెచ్చరిక గానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇది ఏకపక్ష విజయం అయితే కాదన్నది పరిశీలకుల మాట.

నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నామని చెబుతోంది. 6 గ్యారెంటీ లతో పాటు చెప్పని వాటిని కూడా అమలు చేస్తున్నామని ఆది నుంచి చెబుతున్నారు. ముఖ్యంగా 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని అదే విధంగా రైతులకు, నిరుద్యోగులకు మేలు చేస్తున్నామని పెట్టుబడులు తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే చెబుతూ వచ్చారు. అలాంటప్పుడు భారీ విజయం నమోదు చేసుకోవడంతో పాటు ఏకపక్షంగానే ఇక్కడ ఎన్నికల జరుగుతాయని కొందరు భావించారు.

కానీ అలా జరగలేదు. పైగా ఆది నుంచి బీఆర్ఎస్ నుంచి బలమైన పోటీ అయితే వచ్చింది. విజయం అయితే దక్కించుకున్నారు. కానీ, ఆశించిన విధంగా అయితే ఏకపక్ష విజయం కాదన్నది స్పష్టమవుతుంది. ఇది ఒక రకంగా ప్రభుత్వానికే హెచ్చరికే. ప్రజలు ఎటువైపు ఏకపక్షంగా మొగ్గ చూపడం లేదన్నది జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చెబుతున్న వాస్తవం. అధికార పార్టీకి సహజంగా ఉప ఎన్నికల్లో అనుకూల ఫలితమే వస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగిందన్న వాదన కూడా వినిపిస్తోంది.

ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అధికారంలో ఉన్న పార్టీ విజయం దక్కించుకోవడం కామన్. ఎక్కడో ఒక్కొక్క సందర్భంలో మాత్రమే ప్రతిపక్షాలు విజయం దక్కించుకున్నాయి. గతంలో మునుగోడు ఉప‌ ఎన్నికల్లో ఇలాగే జరిగింది. దీంతో అధికార పక్షం ఇకనుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సగానికి పైగా ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేరనే విషయాన్ని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ ప్రాధాన్యాలు ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉపఎన్నిక అటు అధికార పక్షానికి ఇటు విపక్షానికి కూడా ఒక పాఠం అనే చెప్పాల్సి ఉంటుంది. ప్రజలు కోరుకుంటున్న విధంగా పాలన అందించడంలో అధికార పార్టీ అదేవిధంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసే విషయంలో బీఆర్ఎస్ రెండూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆలోచన చేసుకోవాల్సిన అవసరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తీసుకువచ్చిందనే చెప్పాలి. ఒక విజయంతో ఏది జరగదు. ఒక పరాజయంతో ఏది మునిగిపోదు. ఈ విషయాన్ని ఇరు పార్టీలు గ్రహించాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రెండు పార్టీలు ఈ తరహా ఆలోచనతో ముందుకు సాగితే తప్ప ప్రజల నాడిని పసి కట్టడం అనేది సాధ్యం కాదన్నది జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌ స్పష్టం చేస్తున్న ప్రధాన విషయం.

This post was last modified on November 14, 2025 2:24 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘పవన్ అన్న’ మాటే… ‘తమ్ముడు లోకేష్’ మాట!

కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…

23 minutes ago

అవకాశాన్ని ఆంధ్రకింగ్ వాడుకుంటాడా

రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…

3 hours ago

అఖండ 2 ఆగింది… అసలేం జరుగుతోంది

బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…

4 hours ago

అన్నగారు వచ్చేలా లేరు

నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…

4 hours ago

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

9 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

12 hours ago