Political News

ఎప్పుడూ కామ్ గా ఉండే మంత్రి నిమ్మల ఈసారి సీరియస్!

మంత్రి నిమ్మల రామానాయుడుకు సౌమ్యుడు అన్న పేరుంది. వివాదాస్పద వ్యాఖ్యలకు, కాంట్రవర్సీలకు ఆయన దూరంగా ఉంటారు. వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేస్తూ వారిని ఇరకాటంటో పెడుతుంటారు. అధికారులపై కూడా ఆయన ఎప్పుడూ సీరియస్ అయిన దాఖలాలు లేవు. అయితే, తొలిసారిగా విద్యుత్ శాఖ అధికారులు నిమ్మలకు చిరాకు తెప్పించారు. దీంతో, ఎప్పుడూ కామ్ గా ఉంటే నిమ్మల అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పరిశీలన సందర్భంగా విద్యుత్ శాఖ అధికారుల అలసత్వంపై నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొంథా తుపాను వల్ల విద్యుత్ వైర్లు తెగి పది రోజులవుతున్నా దోర్నాల మండలం కొత్తూరులో కరెంటు సరఫరాల లేదని ఆయన ఫైర్ అయ్యారు. ప్రజలకు కరెంటు సరఫరా లేదని…కరెంటు లేక బోర్లు నడవక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తనతో మొరపెట్టుకుంటున్నారని అన్నారు. వరద వచ్చింది..వైర్లు తెగిపోయాయి..వాటిని సరిచేయడం, పాడైన ట్రాన్స్ ఫార్మర్ స్థానంలో కొత్తది వేయడం..మీ బాధ్యత కదా? ఎందుకు వేయలేదు అని ప్రశ్నించారు.

టౌన్ లో నిమిషంలో ట్రాన్స్ ఫార్మర్లు వేసి వైర్లు వేస్తారు…ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్లకు నిమిషం కూడా కరెంటు పోకూడదు అంటూ అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. డబ్బున్నోళ్లకు జనరేటర్, ఇవ్వర్టర్లు ఉంటాయి…పేదోళ్లకేం ఉంటాయి? అని నిలదీశారు. వారం క్రితం చెప్పినా ఇంకా ఎందుకు చేయలేదని విద్యుత్ శాఖ అధికారులను ఆయన నిలదీశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కొందరు అధికారులకు ఇది అలవాటయిందని, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా వారు ఇంకా మారడం లేదని క్లాస్ పీకారు. ఎక్కడికక్కడ అలవాటైపోయిందని..కొందరు అధికారులు ఇంకా వైసీపీ ప్రభుత్వం స్టైల్లోనే ఉన్నారని మండిపడ్డారు.

This post was last modified on November 12, 2025 3:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మెగా ఛాన్స్ వదిలేసిన విశ్వంభర

మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ ఫలితాన్ని విశ్వంభర క్యాష్ చేసుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగకపోవడం అభిమానులను బాధ…

14 minutes ago

హార్దిక్ పాండ్య ఏం సాధించాడు?

గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు…

38 minutes ago

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

2 hours ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

4 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

5 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

6 hours ago