Political News

ఎప్పుడూ కామ్ గా ఉండే మంత్రి నిమ్మల ఈసారి సీరియస్!

మంత్రి నిమ్మల రామానాయుడుకు సౌమ్యుడు అన్న పేరుంది. వివాదాస్పద వ్యాఖ్యలకు, కాంట్రవర్సీలకు ఆయన దూరంగా ఉంటారు. వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేస్తూ వారిని ఇరకాటంటో పెడుతుంటారు. అధికారులపై కూడా ఆయన ఎప్పుడూ సీరియస్ అయిన దాఖలాలు లేవు. అయితే, తొలిసారిగా విద్యుత్ శాఖ అధికారులు నిమ్మలకు చిరాకు తెప్పించారు. దీంతో, ఎప్పుడూ కామ్ గా ఉంటే నిమ్మల అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పరిశీలన సందర్భంగా విద్యుత్ శాఖ అధికారుల అలసత్వంపై నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొంథా తుపాను వల్ల విద్యుత్ వైర్లు తెగి పది రోజులవుతున్నా దోర్నాల మండలం కొత్తూరులో కరెంటు సరఫరాల లేదని ఆయన ఫైర్ అయ్యారు. ప్రజలకు కరెంటు సరఫరా లేదని…కరెంటు లేక బోర్లు నడవక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తనతో మొరపెట్టుకుంటున్నారని అన్నారు. వరద వచ్చింది..వైర్లు తెగిపోయాయి..వాటిని సరిచేయడం, పాడైన ట్రాన్స్ ఫార్మర్ స్థానంలో కొత్తది వేయడం..మీ బాధ్యత కదా? ఎందుకు వేయలేదు అని ప్రశ్నించారు.

టౌన్ లో నిమిషంలో ట్రాన్స్ ఫార్మర్లు వేసి వైర్లు వేస్తారు…ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్లకు నిమిషం కూడా కరెంటు పోకూడదు అంటూ అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. డబ్బున్నోళ్లకు జనరేటర్, ఇవ్వర్టర్లు ఉంటాయి…పేదోళ్లకేం ఉంటాయి? అని నిలదీశారు. వారం క్రితం చెప్పినా ఇంకా ఎందుకు చేయలేదని విద్యుత్ శాఖ అధికారులను ఆయన నిలదీశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కొందరు అధికారులకు ఇది అలవాటయిందని, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా వారు ఇంకా మారడం లేదని క్లాస్ పీకారు. ఎక్కడికక్కడ అలవాటైపోయిందని..కొందరు అధికారులు ఇంకా వైసీపీ ప్రభుత్వం స్టైల్లోనే ఉన్నారని మండిపడ్డారు.

This post was last modified on November 12, 2025 3:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

1 minute ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

13 minutes ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

31 minutes ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

4 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

5 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

6 hours ago