మంత్రి నిమ్మల రామానాయుడుకు సౌమ్యుడు అన్న పేరుంది. వివాదాస్పద వ్యాఖ్యలకు, కాంట్రవర్సీలకు ఆయన దూరంగా ఉంటారు. వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేస్తూ వారిని ఇరకాటంటో పెడుతుంటారు. అధికారులపై కూడా ఆయన ఎప్పుడూ సీరియస్ అయిన దాఖలాలు లేవు. అయితే, తొలిసారిగా విద్యుత్ శాఖ అధికారులు నిమ్మలకు చిరాకు తెప్పించారు. దీంతో, ఎప్పుడూ కామ్ గా ఉంటే నిమ్మల అధికారులపై సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు పరిశీలన సందర్భంగా విద్యుత్ శాఖ అధికారుల అలసత్వంపై నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. మొంథా తుపాను వల్ల విద్యుత్ వైర్లు తెగి పది రోజులవుతున్నా దోర్నాల మండలం కొత్తూరులో కరెంటు సరఫరాల లేదని ఆయన ఫైర్ అయ్యారు. ప్రజలకు కరెంటు సరఫరా లేదని…కరెంటు లేక బోర్లు నడవక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తనతో మొరపెట్టుకుంటున్నారని అన్నారు. వరద వచ్చింది..వైర్లు తెగిపోయాయి..వాటిని సరిచేయడం, పాడైన ట్రాన్స్ ఫార్మర్ స్థానంలో కొత్తది వేయడం..మీ బాధ్యత కదా? ఎందుకు వేయలేదు అని ప్రశ్నించారు.
టౌన్ లో నిమిషంలో ట్రాన్స్ ఫార్మర్లు వేసి వైర్లు వేస్తారు…ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్లకు నిమిషం కూడా కరెంటు పోకూడదు అంటూ అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. డబ్బున్నోళ్లకు జనరేటర్, ఇవ్వర్టర్లు ఉంటాయి…పేదోళ్లకేం ఉంటాయి? అని నిలదీశారు. వారం క్రితం చెప్పినా ఇంకా ఎందుకు చేయలేదని విద్యుత్ శాఖ అధికారులను ఆయన నిలదీశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కొందరు అధికారులకు ఇది అలవాటయిందని, కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా వారు ఇంకా మారడం లేదని క్లాస్ పీకారు. ఎక్కడికక్కడ అలవాటైపోయిందని..కొందరు అధికారులు ఇంకా వైసీపీ ప్రభుత్వం స్టైల్లోనే ఉన్నారని మండిపడ్డారు.
This post was last modified on November 12, 2025 3:50 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…