Political News

శభాష్ లోకేష్.. హామీ ఇచ్చాడు, అండగా నిలిచాడు!

పార్టీ కార్యకర్తలను ఆదుకోవడంలో మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న చొరవ అభినందనలు అందుకుంటోంది. ప్రతి సందర్భంలోనూ వారికి నేను ఉన్నాను అంటూ ఆయన భరోసాను అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడును అభినందించేందుకు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు నుంచి పాలకొల్లుకు దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావుకు ఇటీవల ఆటోలో వచ్చాడు.

అతనికి ట్రై స్కూటీని ఇస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ లో వెంకటేశ్వరరావును కలిసి హామీ ఇచ్చిన విధంగా ట్రై స్కూటినీ స్వయంగా మంత్రి లోకేష్ అందజేశారు.

కార్యకర్తలకు అండగా నిలవడం నారా లోకేష్ కు ఇది మొదటిసారి కాదు. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన వెంటనే స్పందిస్తున్నారు. ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. ఆ విషయం ఆయన దృష్టికి రాగానే వెంటనే తమ టీం ను అలెర్ట్ చేస్తున్నారు. గతంలో గల్ఫ్ లో ఇబ్బంది పడుతున్న వారికి ఆయన తనవంతు సాయం చేశారు.

ముఖ్యంగా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు లోకేష్ సాయం కోరగానే వెంటనే స్పందించి వారిని ఆదుకుంటున్నారు. దీంతోపాటు సమయం దొరికినప్పుడల్లా ప్రజా దర్బారు నిర్వహిస్తూ వారి సమస్యలను విని, వాటిని అధికారుల ద్వారా పరిష్కరిస్తున్నారు. ఈ కారణంతో ఆయన ఎక్కడ ప్రజా దర్బార్ నిర్వహించిన వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివస్తున్నారు. లోకేష్ కి చెబితే సమస్య తీరిపోతుందనే భరోసా కార్యకర్తల్లో కలిగింది.

This post was last modified on November 11, 2025 10:50 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Nara Lokesh

Recent Posts

పదిరోజుల్లోనే మాట నిలబెట్టుకున్న పవన్

మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…

30 minutes ago

మంచు మనోజ్ సినిమాకు మల్టీస్టారర్ హంగులు ?

నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…

47 minutes ago

తెలుగు ఐపీఎస్ సూసైడ్ ఎఫెక్ట్.. డీజీపీపై బదిలీ వేటు!

హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

2 hours ago

మెస్సీ పక్కన సీఎం భార్య.. ఇదేం ఆటిట్యూడ్ బాబోయ్

మెస్సీ ఇండియాకు రావడమే ఒక పండగలా ఉంటే, ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

2 hours ago

వెయ్యి కోట్ల టార్గెట్ అంత ఈజీ కాదు

దురంధర్ అంచనాలకు మించి దూసుకుపోతున్న మాట నిజమే. అఖండ 2 వచ్చాక స్లో అవుతుందనుకుంటే రివర్స్ లో నిన్న వీకెండ్…

2 hours ago

పద్మభూషణ్ ను కూడా మోసం చేసేశారు…

డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు సామాన్యులకే కాదు, ప్రముఖులకూ పెద్ద ముప్పుగా మారాయి. ప్రభుత్వం ఎంత అవగాహన…

3 hours ago