Political News

శభాష్ లోకేష్.. హామీ ఇచ్చాడు, అండగా నిలిచాడు!

పార్టీ కార్యకర్తలను ఆదుకోవడంలో మంత్రి నారా లోకేష్ చూపిస్తున్న చొరవ అభినందనలు అందుకుంటోంది. ప్రతి సందర్భంలోనూ వారికి నేను ఉన్నాను అంటూ ఆయన భరోసాను అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడును అభినందించేందుకు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు నుంచి పాలకొల్లుకు దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావుకు ఇటీవల ఆటోలో వచ్చాడు.

అతనికి ట్రై స్కూటీని ఇస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్ లో వెంకటేశ్వరరావును కలిసి హామీ ఇచ్చిన విధంగా ట్రై స్కూటినీ స్వయంగా మంత్రి లోకేష్ అందజేశారు.

కార్యకర్తలకు అండగా నిలవడం నారా లోకేష్ కు ఇది మొదటిసారి కాదు. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన వెంటనే స్పందిస్తున్నారు. ఒక్క ట్వీట్ చేస్తే చాలు.. ఆ విషయం ఆయన దృష్టికి రాగానే వెంటనే తమ టీం ను అలెర్ట్ చేస్తున్నారు. గతంలో గల్ఫ్ లో ఇబ్బంది పడుతున్న వారికి ఆయన తనవంతు సాయం చేశారు.

ముఖ్యంగా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు లోకేష్ సాయం కోరగానే వెంటనే స్పందించి వారిని ఆదుకుంటున్నారు. దీంతోపాటు సమయం దొరికినప్పుడల్లా ప్రజా దర్బారు నిర్వహిస్తూ వారి సమస్యలను విని, వాటిని అధికారుల ద్వారా పరిష్కరిస్తున్నారు. ఈ కారణంతో ఆయన ఎక్కడ ప్రజా దర్బార్ నిర్వహించిన వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివస్తున్నారు. లోకేష్ కి చెబితే సమస్య తీరిపోతుందనే భరోసా కార్యకర్తల్లో కలిగింది.

Kumar

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

12 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

43 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

8 hours ago