‘జగన్ నీకు అసలు సిగ్గుందా..? యువతను డ్రగ్స్ కు బానిసలుగా మారుస్తున్న వారితో సమావేశం ఏర్పాటు చేస్తావా అంటూ హోమంత్రి అనిత హాట్ కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2019 24 మధ్య దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయని చెప్పకొనే పరిస్థితి ఉందన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రానిన గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్ ది అని ఆరోపించారు.
స్కూలు పిల్లల బ్యాగుల్లోకి కూడా గంజాయిని చేర్చిన ఘనత ఆయనదే అన్నారు. తాను అధికారంలో ఉన్నపుడు జగన్ఏనాడైనా డ్రగ్స్, గంజాయిపై ఒక్క సమీక్ష అయినా నిర్వహించారా అని ప్రశ్నించారు. యువత భవిష్యత్ పై మాట్లాడే హక్కు జగన్ కు లేదన్నారు. డ్రగ్స్ దందా చేసిన వాళ్లకు జగన్ వత్తాసు పలుకుతారా అని అనిత ప్రశ్నించారు. తాము అధికారలోకి వచ్చిన తర్వాత ఈగల్ స్థాపించి ఏడాదిన్నరలో జీరో గంజాయి గా మర్చామన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూలు స్థాయిలోకి తీసుకు వెళుతున్నామన్నారు.
అదే విధంగా మరో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విశాఖలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 14, 16 తేదీల్లో విశాఖలో జరిగే సదస్సు వల్ల ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రానికి దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా విశాఖలో భాగస్వామ్య సదస్సు జరుగుతుందన్నారు. రాష్ట్రానికి మేలు జరుగుతుంటే కుట్రలతో అడ్డుకోవాలని చూస్తారా అంటూ ధ్వజం ఎత్తారు. రైతు పరామర్శల పేరుతో జగన్ విన్యాసాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. జగన్ మాట్లాడే ముందు వాస్తవ పరిస్థితులపై అవగహన పెంచుకుంటే మంచిదని హితవు పలికారు.
This post was last modified on November 6, 2025 1:08 pm
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…