Political News

గ్రేట‌ర్‌లో ఓట్ల శాతం పెరుగుతుందా? ఎవ‌రికి లాభం!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ పెరుగుతుందా? కొన్ని పార్టీ లు వ్యూహాత్మ‌కంగా పోలింగ్ ప‌ర్సంటేజ్ పెంచేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌చార ప‌ర్వం ముగిసింది. మ‌రికొన్ని గంట‌ల్లోనే పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అయితే.. ఈ నేపథ్యంలో ఎవ‌రు గ్రేట‌ర్ పీఠాన్ని ద‌క్కించుకుంటారు? అనే చ‌ర్చ సాగుతున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి.. ఒక‌వైపు ఎవ‌రి ఊహ‌లు, ఎవ‌రి అంచ‌నాలు, ఎవ‌రి విశ్లేష‌ణ‌లు వారికి ఉన్నాయి.

గ‌త ఎన్నిక‌లకు భిన్నంగా సాగిన ప్ర‌చారం.. బీజేపీ నుంచి కీలక నేత‌లు రావ‌డం వంటివి త‌మ‌కు అనుకూ లంగా ఉంద‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. ఇక‌, బీజేపీ వ్య‌తిరేక‌త త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని.. తాము చేస్తున్న ప్ర‌జాసంక్షేమ కార్య‌క్ర‌మాలు త‌మ‌కు గెలుపు గుర్రాన్ని అందిస్తాయ‌ని టీఆర్ఎస్ నేత‌లు భావిస్తున్నారు. స‌రే! ఇదొక భాగం. అయితే.. ఇప్పుడు మ‌రో కీల‌క విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. అదేంటంటే.. ఓటింగ్ శాతం పెంచ‌డం! గ్రేట‌ర్‌లో ఓటింగ్ శాతం పెరిగేలా బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని తెలుస్తోంది.

గ‌త 2016 ఎన్నిక‌ల్లో 45.27 శాతం పోలింగ్ న‌మోదైంది. అప్ప‌ట్లో టీఆర్ఎస్‌కు 99, మ‌జ్లిస్‌కు 44, బీజేపీకి నాలుగు, కాంగ్రెస్‌కు రెండు వార్డులు ద‌క్కాయి. అయితే.. ఇప్పుడు పోలింగ్ శాతాన్ని పెంచేలా బీజేపీ నేత‌లు సోష‌ల్ మీడియాను వినియోగించుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. అంటే.. సాధార‌ణంగా ఏ ఎన్నిక‌ల్లో అయినా.. త‌ట‌స్థ ఓట‌రు పెద్ద‌గా బ‌య‌ట‌కు రారు. అన్ని పార్టీలూ ఇంతే! అనే ధోర‌ణిలోనే ఉంటారు. ముఖ్యంగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఉన్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాలు.. ఓటింగుకు దూరంగా ఉంటాయి.

ఇప్పుడు ఇలాంటి వారిని టార్గెట్ చేయ‌డం ద్వారా.. త‌మ‌కు అనుకూలంగా ఓట్లు పోటెత్తేలా చేసుకోవాల‌ని .. బీజేపీ భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కూడా పోలింగ్ శాతం పెరిగేలా చ‌ర్యలు తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల మేర‌కు.. సుమారు 57-62 శాతం వ‌ర‌కు పోలింగ్ జ‌రుగుతుంద‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే.. పెరిగిన ఓట్ల‌న్నీ త‌మ‌కు అనుకూలంగా ప‌డేవేన‌ని బీజేపీ నేత‌లు అప్పుడే లెక్క‌లు వేసుకుంటున్నారు. అయితే.. పోలింగ్ పెరిగినంత మాత్రాన ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటే కాన‌వ‌స‌రం లేద‌ని.. టీఆర్ ఎస్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా.. గ్రేట‌ర్ ఫైట్ చిత్రాలు ఇంకెన్ని మ‌లుపులు తిరుగుతాయో.. చూడాలి.

This post was last modified on December 1, 2020 10:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

43 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

2 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

2 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago