గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా? కొన్ని పార్టీ లు వ్యూహాత్మకంగా పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రచార పర్వం ముగిసింది. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ జరగనుంది. అయితే.. ఈ నేపథ్యంలో ఎవరు గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుంటారు? అనే చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి.. ఒకవైపు ఎవరి ఊహలు, ఎవరి అంచనాలు, ఎవరి విశ్లేషణలు వారికి ఉన్నాయి.
గత ఎన్నికలకు భిన్నంగా సాగిన ప్రచారం.. బీజేపీ నుంచి కీలక నేతలు రావడం వంటివి తమకు అనుకూ లంగా ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక, బీజేపీ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని.. తాము చేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలు తమకు గెలుపు గుర్రాన్ని అందిస్తాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. సరే! ఇదొక భాగం. అయితే.. ఇప్పుడు మరో కీలక విషయం చర్చకు వస్తోంది. అదేంటంటే.. ఓటింగ్ శాతం పెంచడం! గ్రేటర్లో ఓటింగ్ శాతం పెరిగేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.
గత 2016 ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్ నమోదైంది. అప్పట్లో టీఆర్ఎస్కు 99, మజ్లిస్కు 44, బీజేపీకి నాలుగు, కాంగ్రెస్కు రెండు వార్డులు దక్కాయి. అయితే.. ఇప్పుడు పోలింగ్ శాతాన్ని పెంచేలా బీజేపీ నేతలు సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే.. సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా.. తటస్థ ఓటరు పెద్దగా బయటకు రారు. అన్ని పార్టీలూ ఇంతే! అనే ధోరణిలోనే ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న మధ్యతరగతి, ఉన్నతస్థాయి వర్గాలు.. ఓటింగుకు దూరంగా ఉంటాయి.
ఇప్పుడు ఇలాంటి వారిని టార్గెట్ చేయడం ద్వారా.. తమకు అనుకూలంగా ఓట్లు పోటెత్తేలా చేసుకోవాలని .. బీజేపీ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు.. సుమారు 57-62 శాతం వరకు పోలింగ్ జరుగుతుందని అంటున్నారు. ఇదే జరిగితే.. పెరిగిన ఓట్లన్నీ తమకు అనుకూలంగా పడేవేనని బీజేపీ నేతలు అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే.. పోలింగ్ పెరిగినంత మాత్రాన ప్రభుత్వ వ్యతిరేక ఓటే కానవసరం లేదని.. టీఆర్ ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా.. గ్రేటర్ ఫైట్ చిత్రాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో.. చూడాలి.
This post was last modified on December 1, 2020 10:17 am
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…