గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా? కొన్ని పార్టీ లు వ్యూహాత్మకంగా పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ప్రచార పర్వం ముగిసింది. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ జరగనుంది. అయితే.. ఈ నేపథ్యంలో ఎవరు గ్రేటర్ పీఠాన్ని దక్కించుకుంటారు? అనే చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి.. ఒకవైపు ఎవరి ఊహలు, ఎవరి అంచనాలు, ఎవరి విశ్లేషణలు వారికి ఉన్నాయి.
గత ఎన్నికలకు భిన్నంగా సాగిన ప్రచారం.. బీజేపీ నుంచి కీలక నేతలు రావడం వంటివి తమకు అనుకూ లంగా ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇక, బీజేపీ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని.. తాము చేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలు తమకు గెలుపు గుర్రాన్ని అందిస్తాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. సరే! ఇదొక భాగం. అయితే.. ఇప్పుడు మరో కీలక విషయం చర్చకు వస్తోంది. అదేంటంటే.. ఓటింగ్ శాతం పెంచడం! గ్రేటర్లో ఓటింగ్ శాతం పెరిగేలా బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.
గత 2016 ఎన్నికల్లో 45.27 శాతం పోలింగ్ నమోదైంది. అప్పట్లో టీఆర్ఎస్కు 99, మజ్లిస్కు 44, బీజేపీకి నాలుగు, కాంగ్రెస్కు రెండు వార్డులు దక్కాయి. అయితే.. ఇప్పుడు పోలింగ్ శాతాన్ని పెంచేలా బీజేపీ నేతలు సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. అంటే.. సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా.. తటస్థ ఓటరు పెద్దగా బయటకు రారు. అన్ని పార్టీలూ ఇంతే! అనే ధోరణిలోనే ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న మధ్యతరగతి, ఉన్నతస్థాయి వర్గాలు.. ఓటింగుకు దూరంగా ఉంటాయి.
ఇప్పుడు ఇలాంటి వారిని టార్గెట్ చేయడం ద్వారా.. తమకు అనుకూలంగా ఓట్లు పోటెత్తేలా చేసుకోవాలని .. బీజేపీ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు.. సుమారు 57-62 శాతం వరకు పోలింగ్ జరుగుతుందని అంటున్నారు. ఇదే జరిగితే.. పెరిగిన ఓట్లన్నీ తమకు అనుకూలంగా పడేవేనని బీజేపీ నేతలు అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే.. పోలింగ్ పెరిగినంత మాత్రాన ప్రభుత్వ వ్యతిరేక ఓటే కానవసరం లేదని.. టీఆర్ ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా.. గ్రేటర్ ఫైట్ చిత్రాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో.. చూడాలి.
This post was last modified on December 1, 2020 10:17 am
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత, సొంత అన్నపై ఆమె తీవ్రస్థాయిలో యుద్ధం…
పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్డేట్స్…
ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు…
ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…
భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…
గుడివాడలో విజయం కోసం నాని నానాపాట్లు పడుతున్నారు. తన అనుచరుల ఆగడాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు కష్టపడుతున్నారు. కానీ…