Political News

గ్రేట‌ర్‌లో ఓట్ల శాతం పెరుగుతుందా? ఎవ‌రికి లాభం!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పోలింగ్ ప‌ర్సంటేజ్ పెరుగుతుందా? కొన్ని పార్టీ లు వ్యూహాత్మ‌కంగా పోలింగ్ ప‌ర్సంటేజ్ పెంచేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌చార ప‌ర్వం ముగిసింది. మ‌రికొన్ని గంట‌ల్లోనే పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అయితే.. ఈ నేపథ్యంలో ఎవ‌రు గ్రేట‌ర్ పీఠాన్ని ద‌క్కించుకుంటారు? అనే చ‌ర్చ సాగుతున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి.. ఒక‌వైపు ఎవ‌రి ఊహ‌లు, ఎవ‌రి అంచ‌నాలు, ఎవ‌రి విశ్లేష‌ణ‌లు వారికి ఉన్నాయి.

గ‌త ఎన్నిక‌లకు భిన్నంగా సాగిన ప్ర‌చారం.. బీజేపీ నుంచి కీలక నేత‌లు రావ‌డం వంటివి త‌మ‌కు అనుకూ లంగా ఉంద‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. ఇక‌, బీజేపీ వ్య‌తిరేక‌త త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని.. తాము చేస్తున్న ప్ర‌జాసంక్షేమ కార్య‌క్ర‌మాలు త‌మ‌కు గెలుపు గుర్రాన్ని అందిస్తాయ‌ని టీఆర్ఎస్ నేత‌లు భావిస్తున్నారు. స‌రే! ఇదొక భాగం. అయితే.. ఇప్పుడు మ‌రో కీల‌క విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. అదేంటంటే.. ఓటింగ్ శాతం పెంచ‌డం! గ్రేట‌ర్‌లో ఓటింగ్ శాతం పెరిగేలా బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని తెలుస్తోంది.

గ‌త 2016 ఎన్నిక‌ల్లో 45.27 శాతం పోలింగ్ న‌మోదైంది. అప్ప‌ట్లో టీఆర్ఎస్‌కు 99, మ‌జ్లిస్‌కు 44, బీజేపీకి నాలుగు, కాంగ్రెస్‌కు రెండు వార్డులు ద‌క్కాయి. అయితే.. ఇప్పుడు పోలింగ్ శాతాన్ని పెంచేలా బీజేపీ నేత‌లు సోష‌ల్ మీడియాను వినియోగించుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. అంటే.. సాధార‌ణంగా ఏ ఎన్నిక‌ల్లో అయినా.. త‌ట‌స్థ ఓట‌రు పెద్ద‌గా బ‌య‌ట‌కు రారు. అన్ని పార్టీలూ ఇంతే! అనే ధోర‌ణిలోనే ఉంటారు. ముఖ్యంగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఉన్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాలు.. ఓటింగుకు దూరంగా ఉంటాయి.

ఇప్పుడు ఇలాంటి వారిని టార్గెట్ చేయ‌డం ద్వారా.. త‌మ‌కు అనుకూలంగా ఓట్లు పోటెత్తేలా చేసుకోవాల‌ని .. బీజేపీ భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కూడా పోలింగ్ శాతం పెరిగేలా చ‌ర్యలు తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల మేర‌కు.. సుమారు 57-62 శాతం వ‌ర‌కు పోలింగ్ జ‌రుగుతుంద‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే.. పెరిగిన ఓట్ల‌న్నీ త‌మ‌కు అనుకూలంగా ప‌డేవేన‌ని బీజేపీ నేత‌లు అప్పుడే లెక్క‌లు వేసుకుంటున్నారు. అయితే.. పోలింగ్ పెరిగినంత మాత్రాన ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటే కాన‌వ‌స‌రం లేద‌ని.. టీఆర్ ఎస్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా.. గ్రేట‌ర్ ఫైట్ చిత్రాలు ఇంకెన్ని మ‌లుపులు తిరుగుతాయో.. చూడాలి.

This post was last modified on December 1, 2020 10:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

52 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

59 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago