Political News

గుంటూరు టీడీపీలో ఎస‌రు పెట్టిన ఎంపీ రాజ‌కీయం

టీడీపీ కంచుకోట‌.. గుంటూరు జిల్లాలో ఆ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? నాయ‌కులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు? అనే విష‌యం ఇటీవ‌ల చ‌ర్చకు వ‌చ్చింది. దీనికి కార‌ణం.. చంద్ర‌బాబు రెండు రోజుల కింద‌ట నిర్వ‌హించిన కీల‌క నేత‌ల టెలీ కాన్ఫ‌రెన్స్‌లో కొంద‌రు గుంటూరు నాయ‌కులు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌పై ఫిర్యాదులు చేశారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌ల బాణాల‌ను సంధించారు. త‌మ‌కు అందుబాటులో ఉండ‌డంలేద‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు కూడా అందుబాటులో లేర‌ని.. ఎప్పుడు కార్యాల‌యానికి వ‌స్తారో.. ఎప్పుడు వెళ్తారో.. కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని.. నేత‌లు ఒక్క పెట్టున విమ‌ర్శ‌ల ప‌ర్వం తెరిచారు. దీంతో చంద్ర‌బాబు ఖిన్నుల‌య్యార‌ట‌.

మ‌రీముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల నోటి నుంచే ఈ విమ‌ర్శ‌లు రావ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింద‌ని అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు. కొన్నాళ్లుగా అంటే.. గ‌త ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత నుంచి కూడా క‌మ్మ వ‌ర్గంలోని చాలా మంది నాయ‌కులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలాగ‌ని వీరు పార్టీని విడిచి పెట్టి పోయే బ్యాచ్‌కాదు. కానీ, పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. రాజ‌ధాని ప‌రిధిలోని పెద‌కూర‌పాడు మాజీ ఎమ్మెల్యే నుంచి న‌ర‌స‌రావుపేట మాజీ ఎంపీ రాయ‌పాటి వ‌ర‌కు చోటా.. బ‌డా నేత‌లు.. సీనియ‌ర్లు కూడా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాదిన్న కాలంలో చంద్ర‌బాబు అనేక రూపాల్లో ప్ర‌భుత్వంపై ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చారు.

అయితే.. ధూళిపాళ న‌రేంద్ర కుమార్ నుంచి కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్, ప్ర‌త్తిపాటి పుల్లారావు వ‌ర‌కు ఎవ‌రూ కూడా చంద్ర‌బాబు ఆదేశాల‌ను విని కూడా విన‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో పార్టీలో ఒక‌విధ‌మైన నిరాశ చోటు చేసుకుంది. భారీ ఎత్తున కార్య‌క‌ర్త‌లు ఉన్నా.. కేడ‌ర్ ఉన్నా.. పుంజుకోవ‌డం లేదు. ఒక‌రిద్ద‌రు కీల‌క నేత‌లు మాత్రం ఇక్క‌డ హ‌డావుడి చేయ‌డం మ‌మ అనిపించి ముగించేయ‌డం త‌ప్ప‌.. మ‌న‌సుపెట్టి ప‌నిచేయ‌డం లేద‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. దీనివెనుక ఉన్న రీజ‌నేంట‌ని.. ఆరాతీస్తే.. అంద‌రి వేళ్లూ.. ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌వైపే చూపించ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న త‌మ‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌ని.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనూ ఎంపీ ఓటు త‌న‌కు వేయాల‌ని, ఎమ్మెల్యే ఓటు ఎవ‌రికి వేసుకున్నా అభ్యంత‌రం లేద‌ని ఆయ‌న ప్ర‌చారం చేశార‌ని.. ఇదే త‌మ కొంప ముంచింద‌ని నాయ‌కులు అప్ప‌ట్లోనే ఫిర్యాదులు చేశారు.

అయితే.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు సైలెంట్‌గా ఉన్నారు. ఈ ప‌రిస్థితులు చ‌ల్ల‌బ‌డ‌క‌పోవ‌డంతో నాయ‌కులు.. ఎవ‌రికి వారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రి ఈ ప‌రిస్తితిని చంద్ర‌బాబు ఎలా స‌రిదిద్దుతారో చూడాలి. గ‌ల్లా అంటే.. బాబుకు ఎన‌లేని మ‌క్కువ‌ని.. ఆయ‌న‌ను వెనుకేసుకువ‌స్తున్నార‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తుండ‌డం నేత‌ల మ‌ధ్య గూడుక‌ట్టుకున్న అసంతృప్తికి దారితీస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 30, 2020 8:55 pm

Share

Recent Posts

కల్ట్ మూవీ… ఏదో అనుకుంటే

కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…

7 hours ago

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

8 hours ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

9 hours ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

9 hours ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

10 hours ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

10 hours ago