Political News

గుంటూరు టీడీపీలో ఎస‌రు పెట్టిన ఎంపీ రాజ‌కీయం

టీడీపీ కంచుకోట‌.. గుంటూరు జిల్లాలో ఆ పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంది? నాయ‌కులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు? అనే విష‌యం ఇటీవ‌ల చ‌ర్చకు వ‌చ్చింది. దీనికి కార‌ణం.. చంద్ర‌బాబు రెండు రోజుల కింద‌ట నిర్వ‌హించిన కీల‌క నేత‌ల టెలీ కాన్ఫ‌రెన్స్‌లో కొంద‌రు గుంటూరు నాయ‌కులు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌పై ఫిర్యాదులు చేశారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌ల బాణాల‌ను సంధించారు. త‌మ‌కు అందుబాటులో ఉండ‌డంలేద‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు కూడా అందుబాటులో లేర‌ని.. ఎప్పుడు కార్యాల‌యానికి వ‌స్తారో.. ఎప్పుడు వెళ్తారో.. కూడా తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని.. నేత‌లు ఒక్క పెట్టున విమ‌ర్శ‌ల ప‌ర్వం తెరిచారు. దీంతో చంద్ర‌బాబు ఖిన్నుల‌య్యార‌ట‌.

మ‌రీముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుల నోటి నుంచే ఈ విమ‌ర్శ‌లు రావ‌డం మ‌రింత సంచ‌ల‌నంగా మారింద‌ని అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు. కొన్నాళ్లుగా అంటే.. గ‌త ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత నుంచి కూడా క‌మ్మ వ‌ర్గంలోని చాలా మంది నాయ‌కులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలాగ‌ని వీరు పార్టీని విడిచి పెట్టి పోయే బ్యాచ్‌కాదు. కానీ, పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. రాజ‌ధాని ప‌రిధిలోని పెద‌కూర‌పాడు మాజీ ఎమ్మెల్యే నుంచి న‌ర‌స‌రావుపేట మాజీ ఎంపీ రాయ‌పాటి వ‌ర‌కు చోటా.. బ‌డా నేత‌లు.. సీనియ‌ర్లు కూడా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాదిన్న కాలంలో చంద్ర‌బాబు అనేక రూపాల్లో ప్ర‌భుత్వంపై ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చారు.

అయితే.. ధూళిపాళ న‌రేంద్ర కుమార్ నుంచి కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్, ప్ర‌త్తిపాటి పుల్లారావు వ‌ర‌కు ఎవ‌రూ కూడా చంద్ర‌బాబు ఆదేశాల‌ను విని కూడా విన‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో పార్టీలో ఒక‌విధ‌మైన నిరాశ చోటు చేసుకుంది. భారీ ఎత్తున కార్య‌క‌ర్త‌లు ఉన్నా.. కేడ‌ర్ ఉన్నా.. పుంజుకోవ‌డం లేదు. ఒక‌రిద్ద‌రు కీల‌క నేత‌లు మాత్రం ఇక్క‌డ హ‌డావుడి చేయ‌డం మ‌మ అనిపించి ముగించేయ‌డం త‌ప్ప‌.. మ‌న‌సుపెట్టి ప‌నిచేయ‌డం లేద‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. దీనివెనుక ఉన్న రీజ‌నేంట‌ని.. ఆరాతీస్తే.. అంద‌రి వేళ్లూ.. ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌వైపే చూపించ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న త‌మ‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌ని.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లోనూ ఎంపీ ఓటు త‌న‌కు వేయాల‌ని, ఎమ్మెల్యే ఓటు ఎవ‌రికి వేసుకున్నా అభ్యంత‌రం లేద‌ని ఆయ‌న ప్ర‌చారం చేశార‌ని.. ఇదే త‌మ కొంప ముంచింద‌ని నాయ‌కులు అప్ప‌ట్లోనే ఫిర్యాదులు చేశారు.

అయితే.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు సైలెంట్‌గా ఉన్నారు. ఈ ప‌రిస్థితులు చ‌ల్ల‌బ‌డ‌క‌పోవ‌డంతో నాయ‌కులు.. ఎవ‌రికి వారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రి ఈ ప‌రిస్తితిని చంద్ర‌బాబు ఎలా స‌రిదిద్దుతారో చూడాలి. గ‌ల్లా అంటే.. బాబుకు ఎన‌లేని మ‌క్కువ‌ని.. ఆయ‌న‌ను వెనుకేసుకువ‌స్తున్నార‌నే వ్యాఖ్య‌లు కూడా వినిపిస్తుండ‌డం నేత‌ల మ‌ధ్య గూడుక‌ట్టుకున్న అసంతృప్తికి దారితీస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

ఇకపై SIR పాఠాలు

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న ఓట‌ర్ల జాబితా స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజన్(స‌ర్‌) ప్ర‌క్రియ.. విద్యార్థుల‌కు పాఠంగా మార‌నుంది.…

53 minutes ago

బుల్లిరాజు డిమాండ్ ఇంత భారీగానా

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే సామెత హీరో హీరోయిన్లకే కాదు చైల్డ్ ఆర్టిస్టులకు కూడా వర్తిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాంతో పరిచయమైన…

60 minutes ago

మాకు ఆంధ్రా తెలంగాణ ఉండదు: లోకేష్

ఏపీ-తెలంగాణ‌ల మ‌ధ్య ప్రాంతీయ‌త‌, రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధించిన వివాదాలు తీవ్రంగా సాగుతున్న స‌మ‌యంలో కీల‌క విషయం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఏపీలో…

1 hour ago

లెజెండరీ ‘భాగ్యరాజ్’ ఇక లేరు

ఇటీవలే కన్నుమూసిన సుప్రసిద్ధ ఫిలిం మేకర్ భారతీరాజా శాశ్వతంగా సెలవు తీసుకోవడం ఇంకా కళ్ళముందు ఉండగానే కోలీవుడ్ లో మరో…

1 hour ago

ఎన్నిక‌ల ముంగిట బీజేపీకి అయోధ్య ఎఫెక్ట్ ఎంత‌?

బీజేపీకి అత్యంత కీల‌క‌మైన ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల‌కు ముందు చెల‌రేగిన అయోధ్య రామ‌మందిర వివాదం కీల‌క మ‌లుపులు తిరుగుతోంది. దేశంలోనే…

3 hours ago

కేటీఆర్ తప్పు ఒప్పేసుకున్నట్టేగా!

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాదించిన పార్టీగా బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్)కు ఓ ప్రత్యేక గుర్తుంపు అయితే ఉంది. అయినంత మాత్రాన…

3 hours ago