Political News

చంద్రబాబు మాట చెల్లుబాటవుతుందా ?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికలు హీట్ పెంచేస్తున్నాయి. గెలుపు కోసం అధికార టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. ఈ పరిస్ధితుల్లో కాంగ్రెస్ గురించి కానీ లేకపోతే టీడీపీ గురించి కానీ అసలు పట్టించుకునే వాళ్ళే లేకుండాపోయారు. తమ గురించి ఎవరు పట్టించుకోకపోయినా ఆ రెండు పార్టీలు మరెందుకు పోటీ చేస్తున్నాయి ? ఎందుకంటే కేవలం ఉనికి కోసమనే చెప్పాలి. నిజానికి టీడీపీ గనుక గట్టి ప్రతిపక్షంగా ఉండుంటే కనీసం ఇపుడు గ్రేటర్ పరిధిలో అయినా మంచి ప్రభావం చూపేదనటంలో సందేహం లేదు.

గ్రేటర్ పరిధిలోనే ఎందుకంటే 150 డివిజన్లలో కనీసం తక్కువలో తక్కువ 40 డివిజన్లలో సీమాంధ్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉందన్నది అందరికీ తెలిసిందే. గ్రేటర్ పరిధిలో సీమాంధ్రుల ఓట్లు సమారు 35 లక్షలున్నాయని అంచనా. నల్లకుంట, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, నిజాంపేట, కొంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఓల్డ్ బోయినపల్లి, ఉప్పల్, వనస్ధలిపురం, బాచుపల్లి, మియాపూర్, జీడిమెట్ల, లింగంపల్లి, పఠాన్ చెఱువు లాంటి అనేక ప్రాంతాల్లో సీమాంధ్రులదే డామినేషన్.

సీమాంధ్రుల్లో కూడా కచ్చితంగా చెప్పాలంటే కమ్మ సామాజికవర్గానికిదే మెజారిటి. అయితే ఇపుడు వీళ్ళంతా ఏమి చేస్తారు ? అన్నదే పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సీమాంధ్రుల ఓట్లలో టీడీపీకి ఎన్ని పడతాయన్నది అనుమానమే. అందుకనే ఈ ఓట్లన్నింటినీ బీజేపీకి మళ్ళించాలని చంద్రబాబునాయుడు పరోక్షంగా కొందరు తన సామాజికవర్గం ప్రముఖులతో చెప్పారనే ప్రచారం జోరందుకుంది. అయితే చంద్రబాబు చెప్పినంత మాత్రాన బీజేపీకి ఓట్లు పడతాయా ? అన్నదే అనుమానంగా మారింది.

ఎందుకంటే మేయర్ పీఠాన్ని బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఎవరిలోను లేదు. ఒకవేళ గ్రేటర్ లో కమలంపార్టీనే పై చేయి సాధించినా రాష్ట్రప్రభుత్వాన్ని కాదని చేయగలిగేది ఏమీ లేదన్నది అందరికీ తెలిసిందే. ఈమాత్రం దానికి టీఆర్ఎస్ ను కాదని బీజేపీ కి ఓట్లేసి జరిగే ఉపయోగం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. పైగా సీమాంధ్రులే తమను ఓడించారనే మంట అధికార టీఆర్ఎస్ లో మొదలైతే భవిష్యత్తులో చాలా నష్టాటుంటాయి.

ఇదే గనుక జరిగితే సీమాంధ్రులపై అధికార పార్టీ నేతలు కక్ష పెంచుకునే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను చూస్తే ఇది సీమాంధ్రులకు తీరని నష్టం జరుగుతుందని చాలామంది గ్రహించారు. అందుకనే చంద్రబాబు చెప్పినా కమ్మ సామాజికవర్గంలో కూడా బీజేపీకి ఓట్లు పడేది అనుమానమే అంటున్నారు. మరలాంటపుడు ఓట్లు ఎవరికి వేస్తారు ? ఎవరికంటే ముందు అభ్యర్ధులను చూసి తర్వాత తమ ఓటు ఎవరికో డిసైడ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. చూద్దాం ఏ విషయం డిసెంబర్ 4వ తేదీ తేలిపోతుంది కదా.

This post was last modified on November 30, 2020 4:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

10 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago