Political News

చంద్రబాబు మాట చెల్లుబాటవుతుందా ?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికలు హీట్ పెంచేస్తున్నాయి. గెలుపు కోసం అధికార టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీలు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. ఈ పరిస్ధితుల్లో కాంగ్రెస్ గురించి కానీ లేకపోతే టీడీపీ గురించి కానీ అసలు పట్టించుకునే వాళ్ళే లేకుండాపోయారు. తమ గురించి ఎవరు పట్టించుకోకపోయినా ఆ రెండు పార్టీలు మరెందుకు పోటీ చేస్తున్నాయి ? ఎందుకంటే కేవలం ఉనికి కోసమనే చెప్పాలి. నిజానికి టీడీపీ గనుక గట్టి ప్రతిపక్షంగా ఉండుంటే కనీసం ఇపుడు గ్రేటర్ పరిధిలో అయినా మంచి ప్రభావం చూపేదనటంలో సందేహం లేదు.

గ్రేటర్ పరిధిలోనే ఎందుకంటే 150 డివిజన్లలో కనీసం తక్కువలో తక్కువ 40 డివిజన్లలో సీమాంధ్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉందన్నది అందరికీ తెలిసిందే. గ్రేటర్ పరిధిలో సీమాంధ్రుల ఓట్లు సమారు 35 లక్షలున్నాయని అంచనా. నల్లకుంట, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, నిజాంపేట, కొంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, ఓల్డ్ బోయినపల్లి, ఉప్పల్, వనస్ధలిపురం, బాచుపల్లి, మియాపూర్, జీడిమెట్ల, లింగంపల్లి, పఠాన్ చెఱువు లాంటి అనేక ప్రాంతాల్లో సీమాంధ్రులదే డామినేషన్.

సీమాంధ్రుల్లో కూడా కచ్చితంగా చెప్పాలంటే కమ్మ సామాజికవర్గానికిదే మెజారిటి. అయితే ఇపుడు వీళ్ళంతా ఏమి చేస్తారు ? అన్నదే పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సీమాంధ్రుల ఓట్లలో టీడీపీకి ఎన్ని పడతాయన్నది అనుమానమే. అందుకనే ఈ ఓట్లన్నింటినీ బీజేపీకి మళ్ళించాలని చంద్రబాబునాయుడు పరోక్షంగా కొందరు తన సామాజికవర్గం ప్రముఖులతో చెప్పారనే ప్రచారం జోరందుకుంది. అయితే చంద్రబాబు చెప్పినంత మాత్రాన బీజేపీకి ఓట్లు పడతాయా ? అన్నదే అనుమానంగా మారింది.

ఎందుకంటే మేయర్ పీఠాన్ని బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ఎవరిలోను లేదు. ఒకవేళ గ్రేటర్ లో కమలంపార్టీనే పై చేయి సాధించినా రాష్ట్రప్రభుత్వాన్ని కాదని చేయగలిగేది ఏమీ లేదన్నది అందరికీ తెలిసిందే. ఈమాత్రం దానికి టీఆర్ఎస్ ను కాదని బీజేపీ కి ఓట్లేసి జరిగే ఉపయోగం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. పైగా సీమాంధ్రులే తమను ఓడించారనే మంట అధికార టీఆర్ఎస్ లో మొదలైతే భవిష్యత్తులో చాలా నష్టాటుంటాయి.

ఇదే గనుక జరిగితే సీమాంధ్రులపై అధికార పార్టీ నేతలు కక్ష పెంచుకునే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను చూస్తే ఇది సీమాంధ్రులకు తీరని నష్టం జరుగుతుందని చాలామంది గ్రహించారు. అందుకనే చంద్రబాబు చెప్పినా కమ్మ సామాజికవర్గంలో కూడా బీజేపీకి ఓట్లు పడేది అనుమానమే అంటున్నారు. మరలాంటపుడు ఓట్లు ఎవరికి వేస్తారు ? ఎవరికంటే ముందు అభ్యర్ధులను చూసి తర్వాత తమ ఓటు ఎవరికో డిసైడ్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. చూద్దాం ఏ విషయం డిసెంబర్ 4వ తేదీ తేలిపోతుంది కదా.

This post was last modified on November 30, 2020 4:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరల్డ్ ఫేమస్ సింగర్… హఠాత్తుగా ఇండియాలో ఎందుకు?

గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్‌గా…

3 minutes ago

ఆర్టీసీ స‌మ్మె… అసలు కారణం ఇదేనా?

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. త‌ద్వారా ఉద్యోగాల‌కు పొంచి…

40 minutes ago

నాయకుడు బయటికి వచ్చేది ఎప్పుడు

తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…

2 hours ago

ఆర్టీసీ డ్రైవర్ బలిదానం.. సీఎంకు పెద్ద పరీక్ష

తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…

2 hours ago

అనంతపురం హనీట్రాప్ గుట్టు వీడింది

సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…

5 hours ago

సమంత చేతికి బంగారం లాంటి ఛాన్స్

బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…

6 hours ago