Political News

విజయ్ తప్పు లేదన్న అజిత్

సెప్టెంబరు నెలాఖర్లో తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ రోడ్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మాటలకందని ఈ విషాదం విషయమై తప్పు ఎవరిదే అనే విషయంలో పెద్ద చర్చే జరిగింది. టీవీకే అధినేత విజయే దీనికి బాధ్యత వహించాలంటూ అధికార డీఎంకే దాడి చేసింది. టీవీకేయేమో ప్రభుత్వానిదే బాధ్యత అని, దీని వెనుక కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేసింది. 

సినీ జనాలు కొందరు విజయ్‌కి మద్దతుగా మాట్లాడారు. కొందరు విజయ్‌ని తప్పుబట్టారు. మిగతా వాళ్లు మౌనం వహించారు. ఐతే సినీ రంగంలో చాలా ఏళ్లుగా విజయ్‌కి ప్రధాన పోటీదారుగా ఉన్న అజిత్ ఈ అంశంపై ఒక ఇంటర్వ్యూలో స్పందించడం గమనార్హం. మీడియాకు దూరంగా ఉండే అజిత్.. లేక లేక ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో కరూర్ విషాదం గురించి స్పందించాడు.

విజయ్ పేరు ఎత్తకుండా పరోక్షంగా అతడికి మద్దతుగా నిలిచాడు అజిత్. ఈ విషాదానికి ఏ ఒక్క వ్యక్తినో బాధ్యుడిని చేయడం తప్పని అజిత్ అభిప్రాయపడ్డాడు. దీనికి ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాలని అతనన్నాడు. సినీ తారలను, రాజకీయ నాయకులను చూసేందుకు భారీగా జనం గుమికూడడం పెరిగిపోతోందని.. దీని మీద మోజు తగ్గించుకోవాలని అజిత్ అన్నాడు. ఈ కార్యక్రమాలను సరిగా నిర్వహించలేకపోతున్నారని, కాబట్టి వీటిని నియంత్రించాలని అజిత్ అన్నాడు.

సినీ నటులుగా తాము ఎంతో కష్టపడేది జనాల నుంచి ప్రేమ పొందడానికే అని.. కానీ ఆ ప్రేమను చూపించే పద్ధతి ఇది కాదని అజిత్ అన్నాడు. సెలబ్రెటీలను చూడడానికి జనం ఎగబడడం తగ్గించాలని.. ఈ విషయంలో మీడియా అందరికంటే ఎక్కువ బాధ్యతగా ఉండాలని.. వీటి పట్ల జనాల్లో ఆసక్తి పెంచడం తగ్గించాలని అజిత్ అభిప్రాయపడ్డాడు. కరూర్ లాంటి ఘటనలకు అందరం బాధ్యత వహించి.. ఇకపై ఇలాంటివి జరగకుండా ఏం చేయాలో అది చేయాలని అజిత్ సూచించాడు.

This post was last modified on November 1, 2025 2:21 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

8 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

9 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

10 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

10 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

13 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

14 hours ago