ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవలే.. దుబాయ్లో మూడు రోజుల పాటు పర్యటించారు. పెట్టుబడుల వేటలో ఉన్న ఆయన.. గల్ఫ్ దేశాల్లో సుడిగాలి పర్యటనలు చేసి.. పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. అదేవిధంగా దుబాయ్ మంత్రులతోనూ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ప్రవాసాంధ్రులను కలిసి.. పీ-4లో భాగస్వామ్యం కావాలని కోరారు. ఇలా.. మూడు రోజుల పాటు అనేక మందిని కలిసి పెట్టుబడులపై చర్చించారు.
ఈ క్రమంలో మరోసారి చంద్రబాబు పెట్టుబడుల వేటకు వెళ్తున్నారు. రేపటి(శనివారం, నవంబరు 1) నుంచి 5 రోజులపాటు లండన్ పర్యటనలో పర్యటించనున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలను కలిసి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. ముఖ్యంగా అమరావతి, విశాఖపట్నం లో ఇప్పటికే పెట్టుబడులకు ఉన్న అవకాశాలతోపాటు.. మరిన్ని అవకాశాలు కల్పించే విషయంపై వారితో చర్చించనున్నారు.
అదేవిధంగా విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. విశాఖలో నవంబరు 14, 15 తేదీల్లో పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు జరగనుంది. దీనికి వారిని రావాలని కోరనున్నారు. అదేవిధంగా లండన్లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగే రోడ్షోలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అదేవిధంగా ప్రవాసాంధ్రులతోనూ చర్చలు జరపనున్నారు. ముఖ్యమంత్రి వెంట.. మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్రెడ్డి, ఉన్నతాధికారులు కూడా లండన్లో పర్యటించనున్నారు. కాగా.. నవంబర్ 6న తిరిగి సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు.
This post was last modified on October 31, 2025 3:28 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
+ దేశ సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానిదే. + దేశ సరిహద్దుల నుంచి పెరుగుతున్న చొరబాట్లను…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…