ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవలే.. దుబాయ్లో మూడు రోజుల పాటు పర్యటించారు. పెట్టుబడుల వేటలో ఉన్న ఆయన.. గల్ఫ్ దేశాల్లో సుడిగాలి పర్యటనలు చేసి.. పెట్టుబడిదారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. అదేవిధంగా దుబాయ్ మంత్రులతోనూ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ప్రవాసాంధ్రులను కలిసి.. పీ-4లో భాగస్వామ్యం కావాలని కోరారు. ఇలా.. మూడు రోజుల పాటు అనేక మందిని కలిసి పెట్టుబడులపై చర్చించారు.
ఈ క్రమంలో మరోసారి చంద్రబాబు పెట్టుబడుల వేటకు వెళ్తున్నారు. రేపటి(శనివారం, నవంబరు 1) నుంచి 5 రోజులపాటు లండన్ పర్యటనలో పర్యటించనున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలను కలిసి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. ముఖ్యంగా అమరావతి, విశాఖపట్నం లో ఇప్పటికే పెట్టుబడులకు ఉన్న అవకాశాలతోపాటు.. మరిన్ని అవకాశాలు కల్పించే విషయంపై వారితో చర్చించనున్నారు.
అదేవిధంగా విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. విశాఖలో నవంబరు 14, 15 తేదీల్లో పెట్టుబడుల భాగస్వామ్య సదస్సు జరగనుంది. దీనికి వారిని రావాలని కోరనున్నారు. అదేవిధంగా లండన్లో సీఐఐ ఆధ్వర్యంలో జరిగే రోడ్షోలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అదేవిధంగా ప్రవాసాంధ్రులతోనూ చర్చలు జరపనున్నారు. ముఖ్యమంత్రి వెంట.. మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్రెడ్డి, ఉన్నతాధికారులు కూడా లండన్లో పర్యటించనున్నారు. కాగా.. నవంబర్ 6న తిరిగి సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారు.
This post was last modified on October 31, 2025 3:28 pm
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…