Political News

అమ‌రావ‌తికి కీల‌క సంస్థ‌… జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గాల్సిందే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావతి విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే త‌న నిర్ణ‌య‌మే క‌రెక్ట్ అన్న ధోర‌ణితో ఉన్నారు. ఈ విష‌యం ఇటీవల ఆయ‌న మీడియాతో మాట్లాడిన‌ప్పుడు కూడా స్ప‌ష్ట‌మైంది. నిజానికి కాలం మారుతోంది. ప్ర‌జ‌ల ఆలోచ‌నా ధోర‌ణులు కూడా మారుతున్నాయి. ఒక‌ప్ప‌టి మాదిరిగా.. నాయ‌కులు మంకు ప‌ట్టు ప‌డితే.. కుద‌ర‌దు. ఒక సంద‌ర్భంలో కాక‌పోతే.. మ‌రో సంద‌ర్భంలో అయినా.. ప్ర‌జ‌ల నాడిని తెలుసుకునే ప్ర‌య‌త్నాలు చేయాలి.

కానీ, ఈ దిశ‌గా జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. నిజానికి విశ్వ‌గురుగా పేరు తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న ప్ర‌ధాని మోడీ కూడా.. ఓ సంద‌ర్భంలో వెన‌క్కి త‌గ్గారు. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు తెచ్చిన‌ప్పుడు దేశ‌వ్యాప్తంగా రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ప్పుడు.. ఆయ‌న ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చారు. స‌ద‌రు చ‌ట్టాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డంలో తాము విఫ‌ల‌మ‌య్యామ‌ని ఒప్పుకొన్నారు. వాటిని వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న గ్రాఫ్ కూడా పెరిగింది.

ఈ త‌ర‌హా ప‌రిస్థితి జ‌గ‌న్‌లో ఎక్క‌డా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. అమ‌రావ‌తి రాజ‌ధానికి ప‌లు ప్ర‌ఖ్యాత సంస్థ‌లు వ‌స్తున్నాయి. వీటిలో తాజాగా రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. తాజాగా రాజధానిలో స‌చివాల‌యానికి స‌మీపంలోని నేల‌పాడు వ‌ద్ద‌.. 4 ఎక‌రాల భూమిని ఆర్బీఐ కొనుగోలు చేసింది. మొత్తం 12 కోట్ల రూపాయ‌ల‌కు ఈ భూమిని ప్ర‌భుత్వం విక్ర‌యించింది. దీనిలో ఆర్బీఐ త‌న ప్ర‌ధాన కార్యా లయాన్ని నిర్మించ‌నుంది. నిజానికి ఇత‌ర సంస్థ‌ల రాక వేరు.. ఆర్బీఐ వంటి కీల‌కమైన సంస్థ వ‌చ్చిందంటే.. అన్నీ ఆలోచించుకునే వ‌చ్చింద‌ని నిపుణులు చెబుతున్నారు.

సో.. ఇక‌, రాజ‌ధాని అమ‌రావ‌తిని క‌దిలించే ప్ర‌య‌త్నాలు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉండ‌వ‌ని ఆర్బీఐ భావించిన త‌ర్వాతే.. ఇంత భారీ మొత్తంలో నిర్మాణాన్ని చేప‌ట్టేందుకు ముందుకు వ‌చ్చింద‌ని బ్యాంకింగ్ వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. ఇక‌, ఇప్ప‌టికే ఎస్బీఐ.. స‌హా ఇత‌ర బ్యాంకులు త‌మ ప్రాంతీయ కార్యాల‌యాల‌ను నిర్మించేందుకు రెడీ అయ్యాయి. ఈ ప‌రిణామాల‌ నేప‌థ్యంలో అయినా.. జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌దు. దీనిని ఆయ‌న త‌ప్పుగా కూడా భావించాల్సిన అవ‌స‌రం లేదు. రాజ‌కీయాల్లో ఉన్న వారంతా.. అన్నీ క‌రెక్టే చేసేస్తార‌ని అనుకునే ప‌రిస్థితి లేదు. అయితే.. ఏదైనా పొర‌పాటు నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు దానిని అంతే హుందాగా అంగీక‌రించి వెన‌క్కి తీసుకుంటే.. ప్ర‌జ‌లు కూడా అర్ధం చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

This post was last modified on October 26, 2025 8:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

3 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

3 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

3 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

5 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

7 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

7 hours ago