భారతీయ జనతా పార్టీ.. ఎంఐఎం.. ఈ రెండు ఉప్పు నిప్పుల్లా ఉంటాయి ఎప్పుడూ. ఈ రెండు పార్టీలవి పూర్తి భిన్నమైన సిద్ధాంతాలు, విధానాలు. ఒకటంటే ఇంకోదానికి పడదు. ఇరు పార్టీల వాళ్లూ ఎప్పుడూ కలహించుకుంటూనే ఉంటారన్నది తెలిసిన సంగతే. ఐతే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ రెండు పార్టీలు ఎవరి స్థాయిలో వాళ్లు మతం పేరు చెప్పి, జనాల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నంలో ఉన్నాయని.. వారి మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపించారు.
ఐతే బీజేపీ, ఎంఐఎం ఎందుకు కలుస్తాయి.. వాటి మధ్య స్నేహం ఏంటి అని చాలామంది కొట్టిపారేశారు. రేవంత్ మాటల్ని తేలిగ్గా తీసుకున్నారు. కానీ రేవంత్ ఆరోపణలకు బలం చేకూర్చే ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
జీహెచ్ంసీ ఎన్నికల ప్రచారం కూడా ఇటీవలే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆమెను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది తాజాగా ఇద్దరూ కలుసుకున్నపుడు తీసిన ఫొటోనే అని అంటున్నారు. ఇరు పార్టీలు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటూ, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న సమయంలో కేంద్ర మంత్రిని ఎంఐఎం అధినేత ఎందుకు కలవాల్సి వచ్చిందన్నది ప్రశ్నార్థకం.
ఇలా కలిసినంత మాత్రాన లోపాయకారీ ఒప్పందం ఉన్నట్లేమీ కాదు కానీ.. ఈ ఫొటో అయితే సరైన సంకేతాలనివ్వట్లేదు. ఎన్నికల్లో టీఆర్ఎస్తో బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్న నేపథ్యంలో హైదరాబాద్లో తన పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ను ప్రధాని మోడీ దూరం పెట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో మర్యాదపూర్వకంగా కూడా ప్రత్యర్థులు కలవొద్దని అందరూ అనుకుంటారు. మరి స్మృతిని ఒవైసీ ఎందుకు కలిశారో?
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…