భారతీయ జనతా పార్టీ.. ఎంఐఎం.. ఈ రెండు ఉప్పు నిప్పుల్లా ఉంటాయి ఎప్పుడూ. ఈ రెండు పార్టీలవి పూర్తి భిన్నమైన సిద్ధాంతాలు, విధానాలు. ఒకటంటే ఇంకోదానికి పడదు. ఇరు పార్టీల వాళ్లూ ఎప్పుడూ కలహించుకుంటూనే ఉంటారన్నది తెలిసిన సంగతే. ఐతే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ రెండు పార్టీలు ఎవరి స్థాయిలో వాళ్లు మతం పేరు చెప్పి, జనాల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నంలో ఉన్నాయని.. వారి మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపించారు.
ఐతే బీజేపీ, ఎంఐఎం ఎందుకు కలుస్తాయి.. వాటి మధ్య స్నేహం ఏంటి అని చాలామంది కొట్టిపారేశారు. రేవంత్ మాటల్ని తేలిగ్గా తీసుకున్నారు. కానీ రేవంత్ ఆరోపణలకు బలం చేకూర్చే ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
జీహెచ్ంసీ ఎన్నికల ప్రచారం కూడా ఇటీవలే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆమెను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది తాజాగా ఇద్దరూ కలుసుకున్నపుడు తీసిన ఫొటోనే అని అంటున్నారు. ఇరు పార్టీలు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటూ, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న సమయంలో కేంద్ర మంత్రిని ఎంఐఎం అధినేత ఎందుకు కలవాల్సి వచ్చిందన్నది ప్రశ్నార్థకం.
ఇలా కలిసినంత మాత్రాన లోపాయకారీ ఒప్పందం ఉన్నట్లేమీ కాదు కానీ.. ఈ ఫొటో అయితే సరైన సంకేతాలనివ్వట్లేదు. ఎన్నికల్లో టీఆర్ఎస్తో బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్న నేపథ్యంలో హైదరాబాద్లో తన పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ను ప్రధాని మోడీ దూరం పెట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో మర్యాదపూర్వకంగా కూడా ప్రత్యర్థులు కలవొద్దని అందరూ అనుకుంటారు. మరి స్మృతిని ఒవైసీ ఎందుకు కలిశారో?
This post was last modified on November 30, 2020 11:30 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…