భారతీయ జనతా పార్టీ.. ఎంఐఎం.. ఈ రెండు ఉప్పు నిప్పుల్లా ఉంటాయి ఎప్పుడూ. ఈ రెండు పార్టీలవి పూర్తి భిన్నమైన సిద్ధాంతాలు, విధానాలు. ఒకటంటే ఇంకోదానికి పడదు. ఇరు పార్టీల వాళ్లూ ఎప్పుడూ కలహించుకుంటూనే ఉంటారన్నది తెలిసిన సంగతే. ఐతే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ రెండు పార్టీలు ఎవరి స్థాయిలో వాళ్లు మతం పేరు చెప్పి, జనాల్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నంలో ఉన్నాయని.. వారి మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపించారు.
ఐతే బీజేపీ, ఎంఐఎం ఎందుకు కలుస్తాయి.. వాటి మధ్య స్నేహం ఏంటి అని చాలామంది కొట్టిపారేశారు. రేవంత్ మాటల్ని తేలిగ్గా తీసుకున్నారు. కానీ రేవంత్ ఆరోపణలకు బలం చేకూర్చే ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
జీహెచ్ంసీ ఎన్నికల ప్రచారం కూడా ఇటీవలే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆమెను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసిన ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది తాజాగా ఇద్దరూ కలుసుకున్నపుడు తీసిన ఫొటోనే అని అంటున్నారు. ఇరు పార్టీలు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటూ, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న సమయంలో కేంద్ర మంత్రిని ఎంఐఎం అధినేత ఎందుకు కలవాల్సి వచ్చిందన్నది ప్రశ్నార్థకం.
ఇలా కలిసినంత మాత్రాన లోపాయకారీ ఒప్పందం ఉన్నట్లేమీ కాదు కానీ.. ఈ ఫొటో అయితే సరైన సంకేతాలనివ్వట్లేదు. ఎన్నికల్లో టీఆర్ఎస్తో బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్న నేపథ్యంలో హైదరాబాద్లో తన పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ను ప్రధాని మోడీ దూరం పెట్టిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో మర్యాదపూర్వకంగా కూడా ప్రత్యర్థులు కలవొద్దని అందరూ అనుకుంటారు. మరి స్మృతిని ఒవైసీ ఎందుకు కలిశారో?
This post was last modified on November 30, 2020 11:30 am
నటుడిగా విజయ్ దేవరకొండ.. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ కెరీర్లను మార్చేసిన సినిమా.. అర్జున్ రెడ్డి. ట్రెండ్ సెట్టర్ అనే…
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…