బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు మరో 15 రోజుల గడువు మాత్రమే ఉన్న సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ కూటమిలో ఏర్పడిన అనిశ్చితి పూర్తిగా తొలిగిపోయింది. దీంతో ఇప్పుడు.. మహాఘట్ బంధన్ నాయకులు పుంజుకున్నారు. పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టనున్నారు. అయితే.. మరో చిన్న సమస్య ఈ కూటమిని వెంటాడుతోంది. 8 స్థానాల్లో కూటమిలోని మూడు కీలక పార్టీలు.. కాంగ్రెస్-ఆర్జేడీ-సీపీఐలు.. వారి వారి అభ్యర్థులను రంగంలోకి దించాయి.
వాస్తవానికి కూటమిలో ఉన్న పార్టీలో ఏదో ఒక పార్టీ మాత్రమే తమ అభ్యర్థిని బరిలో నిలపాల్సి ఉంటుంది. కానీ ఈ 8 స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీనిపై త్వరలోనే నిర్ణయం రానుందని నాయకులు చెప్పారు. ఇక, తాజాగా జరిగిన పరిణామం చూస్తే.. మహాఘట్ బంధన్ కనుక వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుంటే ముఖ్యమంత్రిగా ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వి యాదవ్ పగ్గాలు చేపడతారని కాంగ్రెస్ పార్టీ లైన్ క్లియర్ చేసింది. ఈ మేరకు పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లోత్ గురువారం సాయంత్రం ప్రకటన చేశారు.
అంతేకాదు.. మహాఘట్ బంధన్ను ముందుకు నడిపించే బాధ్యతు కూడా ఆయనకే అప్పగించారు. మంత్రి వర్గంలో సీట్లపై ఉమ్మడిగా చర్చించుకుంటామన్నారు. ఫలితంగా ఇప్పటి వరకు డోలాయమానంలో ఉన్న తేజస్వి యాదవ్కు కాంగ్రెస్ తీపికబురు చెప్పినట్టు అయింది. నిన్న మొన్నటి వరకు కూడా.. ఈ వ్యవహారమే పెద్ద తలనొప్పిగా మారింది. అయితే.. తాజాగా ఈ విషయంలో కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వడంతో తేజస్వి అభిమానులు, ఆర్జేడీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు.
బీజేపీకి ఇబ్బందే!
తేజస్వి యాదవ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత.. బీహార్లో రాజకీయ సమీకరణలు సంపూర్ణంగా మారాయి. తేజస్వి యువ నాయకుడు కావడంతో మెజారిటీ యవత ఆయనను అనుసరించే అవకాశం ఉంది. ముఖ్యంగా యాదవులు, కుర్మి సామాజిక వర్గం కూడా తేజస్విని కోరుకుంటున్నారు. ఇది బీజేపీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారనుంది. పైగా.. బీజేపీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరంటూ.. ప్రశ్నలు తెరమీదికి వచ్చాయి.
నితీష్ కుమార్కు మతిమరుపు వచ్చిందన్న ప్రచారంతో ఆయనను మరోసారి ప్రకటిస్తే అది కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చే అంశమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అలాగని తమ పార్టీ నాయకుడిని ప్రకటిస్తే.. అది నీతిష్కు కోపం తెప్పించడమే అవుతుందన్న అంచనా వేస్తున్నారు. దీంతో సీఎం అభ్యర్థి విషయంలో బీజేపీ ఎటూ తేల్చుకోలేక పోతోంది.
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…