Political News

మీ పెట్టుబడికి మా హామీ: చంద్రబాబు భరోసా

ఏపీకి పెట్టుబడుల వేట కొనసాగిస్తున్న సీఎం చంద్రబాబు అలుపెరగని పోరాటమే చేస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఆయన పెట్టుబడుల కోసం గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. బుధవారం దుబాయ్‌కు వెళ్లిన ఆయన, అక్కడ నుంచి గురువారం ఉదయం అబుదాబీకి చేరుకున్నారు.క్కడి పారిశ్రామిక వేత్తలను కలుసుకుని వారికి కూడా ఏపీ ప్రాధాన్యాన్ని వివరించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలిపారు. మీ పెట్టుబడికి మా హామీ అంటూ ఆయన భరోసా కల్పించారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఒక్కొక్కరూ కనీసం ఒక్క పెట్టుబడి అయినా పెట్టాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో సురక్షిత పెట్టుబడికి సుగమమైన అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. పెట్టుబడి పెట్టాలని భావించే వారికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు. పెట్టుబడి పెట్టాలని భావించే వారికి అన్ని విధాలా సహకరిస్తామన్న ఆయన, లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అబుదాబీ పారిశ్రామిక వేత్తలకు సూచించారు.

పెట్టుబడితో తరలి వచ్చేవారికి అన్ని విధాలా ప్రభుత్వం, అధికారులు సహకరిస్తారని తెలిపారు. “పెట్టుబడి మీరు పెట్టినా, దానిని మాదిగా భావిస్తాం. మీకు అన్ని విధాలా సహకరిస్తాం” అని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. అయితే, సాధ్యమైనంత వరకు స్థానికంగా యువతకు అవకాశం కల్పించాల‌ని ఆయ‌న కోరారు. ప్రతిొక్కరూ ఒక్కొక్క పెట్టుబడితో తరలి వచ్చినా, అది ఏపీకి సువర్ణావకాశంగా మారుతుందన్నరు. గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని పరోక్షంగా గత ఐదేళ్ల వైసీపీ పాలనను ఆయన ఉటంకించారు.

ముఖ్యంగా కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం ఉందన్న సీఎం చంద్రబాబు, 24 గంటల్లోనే అనుమతులు ఇస్తున్నట్టు తెలిపారు. వనరులు పుష్కలంగా ఉన్నాయని, రవాణా సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పెట్టుబడిదారులకు ఇదొక గొప్ప అవకాశంగా ఆయ‌న పేర్కొన్నారు. పెట్టుబడులతో తరలి వచ్చేవారిని స్వాగతిస్తున్నామన్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నామని, తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

This post was last modified on October 23, 2025 7:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

29 minutes ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

2 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

2 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

3 hours ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

4 hours ago

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

5 hours ago