బెజవాడ టీడీపీ నేతల మధ్య ఓ ఆసక్తికర విషయం హల్చల్ చేస్తోంది. స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఫిక్సయితే.. ఆ జాబితాలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉంటాయి. ఈ క్రమంలో మేయర్ పీఠం ఎవరికి? అనే ప్రశ్న.. మరోసారి తెరమీదికి వచ్చింది. వాస్తవానికి ఇప్పటికే కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతకు కేటాయించారు. దీంతో ఇప్పటికే కేశినేని కుటుంబం మేయర్ అభ్యర్థిగా శ్వేత కూడా ప్రచారానికి దిగారు. అయితే..అనూహ్యంగా ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే.
అయితే.. ఇటీవల కాలంలో పార్టీకి కేశినేని నాని దూరంగా ఉంటున్నారు. విజయవాడ ఎంపీగా తనకు పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా ఆయన స్వపక్షంలోనే విపక్షంగా మారి విమర్శలకు దిగారు. పైగా.. కమ్మ సామాజిక వర్గంపైనే ఆయన విమర్శలు ఎక్కు పెట్టారు. ఈ పరిణామంతో విజయవాడ నగరంలోని కమ్మ వర్గం సహా.. విజయవాడ నగర పార్టీ కూడా నాయకులు కూడా కేశినేనికి దూరంగా ఉంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా.. మేయర్ అభ్యర్థిని మార్చాలనే డిమాండ్ తెరమీదకి వచ్చింది.
ఇటీవల నలుగురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన విజయవాడ నాయకులు.. భేటీ అయి.. మేయర్ అభ్యర్థి విషయంలో చంద్రబాబు పునరాలోచించాలని.. అందరినీ కలుపుకొని పోయే నాయకురాలికి కేటాయించాలని కొత్త డిమాండ్ను తెరమీదికి తెచ్చారు. మేయర్ అభ్యర్థిగా మాజీ జెడ్పీ చైర్ పర్సన్.. గద్దె అనురాధ వైపు వీరు మొగ్గుతున్నారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సతీమణి.. అనురాధ.. అయితే.. బాగుంటుందనేది వీరి అంతర్గత సంభాషణల్లో వచ్చిన సూచన. అయితే.. నేరగా ఈ విషయాన్ని చెప్పకుండా.. అభ్యర్థిని మార్చాలంటూ.. చంద్రబాబు లేఖ రాసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం విజయవాడ రాజకీయాల్లో చర్చగా మారింది. మరి బాబు ఏం చేస్తారు? ఇప్పటికే ప్రకటించిన శ్వేత అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకుంటారా? లేక ఆమెనే కొనసాగిస్తారా? అనేది చూడాలి.
This post was last modified on November 29, 2020 12:57 pm
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…
ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే..…
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…