Political News

మోడీ ప‌ర్య‌ట‌న‌: వైసీపీ మ‌రో యాగీ.. కేంద్రం ఎంట్రీ!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌ర్నూలులో ప‌ర్య‌టించిన నేప‌థ్యంలో అధికార టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అదేస‌మ‌యంలో వైసీపీ సోష‌ల్ మీడియా స‌హా ప్ర‌ధాన మీడియాలో వ‌చ్చిన కొన్ని వార్త‌ల‌పై వెంట‌నే కేంద్ర ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు కూడా జోక్యం చేసుకున్న‌ట్టు రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. దీనిపై త‌మ‌కు నివేదిక ఇవ్వాల‌ని కేంద్ర వ‌ర్గాలు డీజీపీని కోరిన‌ట్టు స‌మాచారం. దీంతో ఈ వ్య‌వ‌హారంలో అస‌లు ఏం జ‌రిగింద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.

ప్రధాన మంత్రి.. గురువారం ఉద‌యం ఢిల్లీ నుంచి క‌ర్నూలు ఎయిర్‌పోర్టుకు(ఓర్వ‌క‌ల్లు) వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికే అధికార పార్టీ స‌హా.. స్థానిక ప్రజాప్ర‌తినిధుల‌ను ప్రొటోకాల్ ప్ర‌కారం ఆహ్వానిస్తారు. ఈ స‌మ‌యంలో స్థానిక ఎమ్మెల్యే వైసీపీ నేత‌.. విరూపాక్షి, అదేవిధంగా ఎమ్మెల్సీ.. మ‌ధుసూద‌న్‌, క‌ర్నూలు జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌(స్థానిక ప్ర‌జాప్ర‌తినిధి) ఉన్నారు. వీరికి ప్రొటోకాల్ ప్ర‌కారం ప్ర‌భుత్వ అధికారులు ఆహ్వానం పంపారు. వారు వ‌చ్చి ప్ర‌ధానికి పుష్ప‌గుచ్ఛం ఇచ్చి ఆహ్వానం ప‌లికారు.

అయితే.. ఇంత వ‌ర‌కుబాగానే ఉన్నా.. ఆ త‌ర్వాత‌.. వైసీపీ నాయ‌కులు త‌మ దారిన తాము వెళ్లిపోయి.. మీడియా ముందు.. ప్ర‌ధాని మోడీకి తాము విన‌తి ప‌త్రాలు ఇచ్చామ‌ని చెప్పారు. అంతేకాదు.. రాష్ట్రంలో సీఎం చంద్ర‌బాబు చేస్తున్న మెడిక‌ల్ కాలేజీల‌ ప్రైవేటీక‌ర‌ణ స‌హా క‌ర్నూలులో స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధానికి ఫిర్యాదు చేశామ‌ని.. ఆయ‌న సావ‌ధానంగా విన్నార‌ని.. తాము ఇచ్చిన ఫిర్యాదుల‌ను కూడా తీసుకున్నార‌ని చెప్పారు. ఈ వ్య‌వ‌హారం వెలుగు చూడ‌గానే టీడీపీ నాయ‌కులు.. అగ్గిమీద గుగ్గిలంలా మండిప‌డ్డారు.

“మిమ్మ‌ల్ని ప్రొటోకాల్ ప్ర‌కారం ఆహ్వానించాం. మీరు వ‌చ్చి పుష్ప‌గుచ్చాలు మాత్ర‌మే ఇచ్చారు. కానీ.. బ‌య‌ట‌కు వ‌చ్చి ఇలా చెప్ప‌డానికి సి.. లేదా!” అని వ్యాఖ్యానించారు. ఇరు ప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటా లు పేలాయి. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై కేంద్ర ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు అలెర్ట‌యిన‌ట్టు స్థానిక పోలీసులు తెలిపారు. అస‌లు ఏం జ‌రిగింది? ప్ర‌ధానికి నిజంగానే వారు విన‌తి ప‌త్రాలు ఇచ్చారా? ఇస్తే.. ఎవ‌రు తీసుకున్నారు? అనే విష‌యాల‌పై నివేదిక ఇవ్వాల‌ని డీజీపీని వివ‌ర‌ణ కోరిన‌ట్టు తెలిసింది. కానీ… రాష్ట్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు మాత్రం.. వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ ఎలాంటి విన‌తులు ఇవ్వ‌లేద‌ని.. కావాల‌నే యాగీ చేస్తున్నార‌ని చెబుతున్నారు.

This post was last modified on October 16, 2025 11:31 pm

Share
Show comments
Published by
Satya
Tags: ModiYSRCP

Recent Posts

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

44 minutes ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

44 minutes ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

2 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

2 hours ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

2 hours ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

3 hours ago