Political News

మోడీ ప‌ర్య‌ట‌న‌: వైసీపీ మ‌రో యాగీ.. కేంద్రం ఎంట్రీ!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌ర్నూలులో ప‌ర్య‌టించిన నేప‌థ్యంలో అధికార టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అదేస‌మ‌యంలో వైసీపీ సోష‌ల్ మీడియా స‌హా ప్ర‌ధాన మీడియాలో వ‌చ్చిన కొన్ని వార్త‌ల‌పై వెంట‌నే కేంద్ర ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు కూడా జోక్యం చేసుకున్న‌ట్టు రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. దీనిపై త‌మ‌కు నివేదిక ఇవ్వాల‌ని కేంద్ర వ‌ర్గాలు డీజీపీని కోరిన‌ట్టు స‌మాచారం. దీంతో ఈ వ్య‌వ‌హారంలో అస‌లు ఏం జ‌రిగింద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.

ప్రధాన మంత్రి.. గురువారం ఉద‌యం ఢిల్లీ నుంచి క‌ర్నూలు ఎయిర్‌పోర్టుకు(ఓర్వ‌క‌ల్లు) వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికే అధికార పార్టీ స‌హా.. స్థానిక ప్రజాప్ర‌తినిధుల‌ను ప్రొటోకాల్ ప్ర‌కారం ఆహ్వానిస్తారు. ఈ స‌మ‌యంలో స్థానిక ఎమ్మెల్యే వైసీపీ నేత‌.. విరూపాక్షి, అదేవిధంగా ఎమ్మెల్సీ.. మ‌ధుసూద‌న్‌, క‌ర్నూలు జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌(స్థానిక ప్ర‌జాప్ర‌తినిధి) ఉన్నారు. వీరికి ప్రొటోకాల్ ప్ర‌కారం ప్ర‌భుత్వ అధికారులు ఆహ్వానం పంపారు. వారు వ‌చ్చి ప్ర‌ధానికి పుష్ప‌గుచ్ఛం ఇచ్చి ఆహ్వానం ప‌లికారు.

అయితే.. ఇంత వ‌ర‌కుబాగానే ఉన్నా.. ఆ త‌ర్వాత‌.. వైసీపీ నాయ‌కులు త‌మ దారిన తాము వెళ్లిపోయి.. మీడియా ముందు.. ప్ర‌ధాని మోడీకి తాము విన‌తి ప‌త్రాలు ఇచ్చామ‌ని చెప్పారు. అంతేకాదు.. రాష్ట్రంలో సీఎం చంద్ర‌బాబు చేస్తున్న మెడిక‌ల్ కాలేజీల‌ ప్రైవేటీక‌ర‌ణ స‌హా క‌ర్నూలులో స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధానికి ఫిర్యాదు చేశామ‌ని.. ఆయ‌న సావ‌ధానంగా విన్నార‌ని.. తాము ఇచ్చిన ఫిర్యాదుల‌ను కూడా తీసుకున్నార‌ని చెప్పారు. ఈ వ్య‌వ‌హారం వెలుగు చూడ‌గానే టీడీపీ నాయ‌కులు.. అగ్గిమీద గుగ్గిలంలా మండిప‌డ్డారు.

“మిమ్మ‌ల్ని ప్రొటోకాల్ ప్ర‌కారం ఆహ్వానించాం. మీరు వ‌చ్చి పుష్ప‌గుచ్చాలు మాత్ర‌మే ఇచ్చారు. కానీ.. బ‌య‌ట‌కు వ‌చ్చి ఇలా చెప్ప‌డానికి సి.. లేదా!” అని వ్యాఖ్యానించారు. ఇరు ప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటా లు పేలాయి. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై కేంద్ర ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు అలెర్ట‌యిన‌ట్టు స్థానిక పోలీసులు తెలిపారు. అస‌లు ఏం జ‌రిగింది? ప్ర‌ధానికి నిజంగానే వారు విన‌తి ప‌త్రాలు ఇచ్చారా? ఇస్తే.. ఎవ‌రు తీసుకున్నారు? అనే విష‌యాల‌పై నివేదిక ఇవ్వాల‌ని డీజీపీని వివ‌ర‌ణ కోరిన‌ట్టు తెలిసింది. కానీ… రాష్ట్ర ప్ర‌భుత్వ వ‌ర్గాలు మాత్రం.. వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ ఎలాంటి విన‌తులు ఇవ్వ‌లేద‌ని.. కావాల‌నే యాగీ చేస్తున్నార‌ని చెబుతున్నారు.

This post was last modified on October 16, 2025 11:31 pm

Share
Show comments
Published by
Satya
Tags: ModiYSRCP

Recent Posts

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

6 minutes ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

28 minutes ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

2 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

3 hours ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

3 hours ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

6 hours ago