Political News

బీఆర్ఎస్ నోట ఓట్ చోరీ మాట‌: హైకోర్టుకు నేత‌లు!

చిత్రంగా ఉన్నా.. ఇది వాస్త‌వం. ఇప్ప‌టి వ‌ర‌కు బీహార్‌లో మాత్ర‌మే వినిపించిన ఓట్ చోరీ మాట‌.. ఇప్పుడు తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ నోట కూడా వినిపించింది. అనూహ్యంగా ఆ పార్టీ ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ విష‌యంపై విచార‌ణను చేప‌ట్టాల‌ని.. త‌క్ష‌ణ‌మే విచారించాల‌ని కోరుతూ.. గురువారం లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. దీనిలో ప‌లు విష‌యాల‌ను పేర్కొంది.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌.. అటు అధికార కాంగ్రెస్ పార్టీకి, ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌కు కూడా కీల‌కంగా మారిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అభ్య‌ర్థిని కూడా ఖ‌రారు చేసిన బీఆర్ఎస్.. మాగంటి సునీత‌తో నామినేష‌న్ కూడా వేయించింది. ఇక‌, మ‌రోవైపు.. ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే జాబితాల‌ను కూడా రిలీజ్ చేసింది. ఇంత జ‌రిగిన త‌ర్వాత‌.. అనూహ్యంగా జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జ‌రిగింద‌ని ఆరోపిస్తూ.. బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ల‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది.

జూబ్లీహిల్స్‌లో సుమారు 30 వేల ఓట్లను తొల‌గించార‌ని పేర్కొన్న బీఆర్ఎస్‌.. భారీ ఎత్తున న‌కిలీ ఓట‌ర్ల‌ను.. చేర్చార‌ని ఆరోపించింది. కాంగ్రెస్‌, బీజేపీల‌కు అనుకూలంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన ఓట‌ర్ల‌ను తీసుకు వ‌చ్చి .. ఇక్క‌డ ఓటు హ‌క్కు క‌ల్పించార‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. త‌ద్వారా ఏక‌ప‌క్షంగా గెలిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పేర్కొంది. దీనిపై త‌క్ష‌ణం విచార‌ణ జ‌రపాల‌ని కోరింది. అయితే.. వాస్త‌వానికి ఎన్నిక‌ల సంఘం జాబితాల‌ను కూడా రెడీ చేసి విడుద‌ల చేసిన త‌ర్వాత‌.. బీఆర్ఎస్ ఎత్తి చూపిన ఈ వాద‌న ఏమేర‌కు నిల‌బ‌డుతుందో చూడాలి.

This post was last modified on October 16, 2025 3:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

32 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

51 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago