Political News

ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఇంత కీలకం అవుతోందా…?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఏపీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముందుగా నంద్యాల జిల్లాలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వర్ల దేవాలయంలో పూజా, దర్శనం చేసిన తర్వాత, కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్’ భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ₹13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాథమిక శిలాన్యాసం చేసి, ప్రారంభిస్తారు – విద్యుత్, రైల్వే, పరిశ్రమలు వంటి రంగాల్లో ఉన్నవి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రకారం, పన్ను స్లాబులను తగ్గించి పేదలు, మధ్యతరగతి వర్గాలకు నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు చౌకగా అందేలా చేసింది.

ఈ సంస్కరణలు దేశవ్యాప్తంగా అమలులో ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రధానంగా భుజాన వేసుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీంతో ప్రధానమంత్రిని ఆహ్వానించి, కర్నూలులో ఈ భారీ బహిరంగ సభకు సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతోంది. మరి దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నది ఏమిటి? ప్రధానమంత్రిని ఆహ్వానించటం, దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం వెనుక ఉన్న కారణాలేంటి? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. దీనిని మరింత బలోపేతం చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మరోసారి విజయం సాధించాలంటే కూటమి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోడీతో మరింత సాన్నిహిత్యంగా ఉండడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయాలన్నది ఆయన ప్రధాన లక్ష్యం.

ముఖ్యంగా వైసీపీ ఏ క్షణంలో అయినా బీజేపీతో వ్యవహారాలు నడిపే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ.ఆది నుంచి బీజేపీతో సన్నిహితంగా ఉన్న వైసీపీ, వచ్చే ఎన్నికల నాటికి బహిరంగంగా పొత్తు పెట్టుకునే అవకాశాలను కూడా తోసి పుచ్చలేమని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీకి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కూడా కూటమిని బలోపేతం చేయాలన్నది ఆయన ఉద్దేశం. అందుకే ఇప్పటికి రెండుసార్లు ఏపీకి ఆహ్వానించిన నేపథ్యంలో, ఇప్పుడు మూడోసారి కూడా ప్రధానమంత్రికి పెద్దపేట వేస్తున్నారు. దీనిని ముందుముందు మరింత బలోపేతం చేసుకోవాలని, వైసీపీకి అవకాశం ఇవ్వకూడదని చంద్రబాబు ఉద్దేశంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారని వారు చెబుతున్నారు.

This post was last modified on October 16, 2025 11:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

45 minutes ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

45 minutes ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

2 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

2 hours ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

2 hours ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

3 hours ago