Political News

సునీత క‌న్నీరు.. కేటీఆర్ విమ‌ర్శల జోరు!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌ల వేడి రాజుకుంటోంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు.. ర‌హ్మ‌త్‌న‌గ‌ర్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం… వాడి వేడిగా సాగింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స‌తీమ‌ణి, బీఆర్ఎస్ అభ్య‌ర్థి.. మాగంటి సునీత క‌న్నీరు పెట్టుకున్నారు. త‌న భ‌ర్త ఈ నియోజ‌కవ‌ర్గం ప్ర‌జ‌ల‌ను క‌డుపులో పెట్టుకుని చూసుకున్నార‌ని తెలిపారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా వారికి వెన్నంటి ఉన్నార‌ని గుర్తు చేసుకుంటూ.. క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు.

ఇక‌, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. కీల‌క వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శ‌ల జోరు పెంచారు. జూబ్లీహిల్స్ ఓట‌ర్లు.. కారు కావాలో.. బుల్డోజ‌ర్ కావాలో తేల్చుకోవాల‌ని ఆయ‌న సూచించారు. కారు గెలిస్తే.. నియోజ‌క‌వర్గంలో అభివృద్ధి జ‌రుగుతుంద‌న్నారు. అదే కాంగ్రెస్‌కు ఓటేస్తే.. చుట్టుప‌క్క‌ల ఉన్న ప్రాంతాల‌పై ముఖ్యం గా పేద‌ల ఇళ్ల‌పైకి బుల్డోజ‌ర్ వ‌స్తుంద‌ని.. ప‌లు ఉదాహ‌ర‌ణలుచెప్పుకొచ్చారు. బ‌స్తీల‌కు ర‌క్ష‌ణ కావాలంటే కారు గుర్తుకు ఓట‌యాల‌ని పిలుపునిచ్చారు.

గ‌త ఎన్నిక‌ల్లో ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఏ ఒక్క‌టీ అమ‌లు చేయ‌లేద ని విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో ఇంటింటికీ తిరిగి ఆ గ్యారెంటీ మోసాల‌ను ప్ర‌చారం చేస్తామ‌ని తెలిపా రు. ఇక‌, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను చిత్తు చిత్తుగా ఓడించాల‌ని పిలుపునిచ్చారు. అప్పుడే.. ఆరు గ్యారెంటీలు అమ‌ల‌వుతాయ‌ని చెప్పారు. రాష్ట్రంలో ఏప‌నికావాల న్నా లంచాలు ఇవ్వ‌క త‌ప్ప‌డం లేద‌న్నారు. ఇవ‌న్నీ పోవాలంటే.. మాగంటి సునీత‌ను గెలిపించాల‌ని కోరారు.

నోటిఫికేష‌న్ జారీ..

మ‌రోవైపు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం జూబ్లీహిల్స్ ఉప పోరుకు సంబంధించి నోటిఫికేష‌న్ జారీ చేసింది. కొన్ని రోజుల కింద‌ట షెడ్యూల్ ఇచ్చిన ఈసీ.. ఇప్పుడు నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నెల 13 నుంచి నామినేష‌న్లు స‌మ‌ర్పించ వ‌చ్చు. 21వ తేదీ వ‌ర‌కు గడువు ఉంది. 22న ప‌రిశీల‌న ఉంటుంది. 24వ తేదీ వ‌రకు ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. న‌వంబ‌రు 11న పోలింగ్‌, 14న ఫ‌లితం ప్ర‌క‌టిస్తారు.

This post was last modified on October 14, 2025 9:41 am

Share

Recent Posts

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

1 hour ago

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

3 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

4 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

4 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

4 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

5 hours ago