ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు అనేక పెట్టుబడులు తెచ్చారు. కానీ, మంగళవారం ఆయన ఢిల్లీలో చేసుకునే ఓ కీలక ఒప్పందం మాత్రం ఆయన రాజకీయ జీవితంలోనే అతి పెద్ద ఒప్పందంగా మారనుంది. ఈ విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. తాజాగా అమరావతిలో పర్యటించిన ఆయన.. మునిసిపల్ శాఖకు చెందిన హెచ్ వోడీని ప్రారంభించారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. తాను ఢిల్లీకి వెళ్తున్నానని.. భారీ అగ్రిమెంట్ చేసుకుంటున్నానని చెప్పారు. ఇది ఏపీకి గేమ్ చేంజర్గా మారుతుందని చెప్పారు. ఈ ఒప్పందంతో ఏపీ భవిత కూడా మారుతుందన్నారు.
ఏంటీఒప్పందం..
గూగుల్ సహ సంస్థ రైడైన్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటోంది. దీని విలువ ఏకంగా 90 వేల కోట్ల రూపాయలు. ఇదే ఇప్పటి వరకు ఏపీకి వచ్చిన అతి పెద్ద పెట్టుబడి. ఈ సంస్థ విశాఖలో అతి పెద్ద డేటా కేంద్రాన్నిఏర్పాటు చేయనుంది. 2029 నాటికి డేటాసెంటర్ను సంస్థ పూర్తి చేస్తుంది. అయితే.. దేశంలోనే అతిపెద్ద డేటా కేంద్రం ఇదే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి అటు గూగుల్ సంస్థ హిస్టరీలో కూడా భారత్లో ఇంత పెద్ద పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. అది కూడా ఏపీలో పెట్టడం గమనార్హం.
దీనివెనుక.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఉన్నారన్న ప్రచారం ఉంది. ఇక, ఈ డేటా కేంద్రం ఏర్పాటుతో విశాఖపట్నం `డేటాసెంటర్ హబ్`గా మారుతుంది. ఏఐ, హైఎండ్ ఉద్యోగాలు వస్తాయి. డేటా సెంటర్కు సింగపూర్ నుంచి సబ్మెరైన్ కేబుల్ను సముద్రమార్గంలో సంస్థ ఏర్పాటు చేస్తుంది. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించనుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చేందుకు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కూడా సహకరించారని సీఎం చంద్రబాబు తాజాగా వెల్లడించారు.
This post was last modified on October 13, 2025 6:49 pm
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా…
టాక్సిక్ నుంచి కొత్త పాట వచ్చింది. ఈసారి యష్ తో తారా సుతారియా రొమాన్స్ చేసింది. తబాహి లాగే ఇందులో…
శాటిలైట్ మార్కెట్ మునుపటిలా లేదు. జూనియర్ ఎన్టీఆర్ దేవరకు ఇప్పటిదాకా ఈ విభాగం హక్కులు అమ్ముడుపోలేదు. ఆ మధ్య ఈటీవీ…