ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు అనేక పెట్టుబడులు తెచ్చారు. కానీ, మంగళవారం ఆయన ఢిల్లీలో చేసుకునే ఓ కీలక ఒప్పందం మాత్రం ఆయన రాజకీయ జీవితంలోనే అతి పెద్ద ఒప్పందంగా మారనుంది. ఈ విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. తాజాగా అమరావతిలో పర్యటించిన ఆయన.. మునిసిపల్ శాఖకు చెందిన హెచ్ వోడీని ప్రారంభించారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. తాను ఢిల్లీకి వెళ్తున్నానని.. భారీ అగ్రిమెంట్ చేసుకుంటున్నానని చెప్పారు. ఇది ఏపీకి గేమ్ చేంజర్గా మారుతుందని చెప్పారు. ఈ ఒప్పందంతో ఏపీ భవిత కూడా మారుతుందన్నారు.
ఏంటీఒప్పందం..
గూగుల్ సహ సంస్థ రైడైన్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటోంది. దీని విలువ ఏకంగా 90 వేల కోట్ల రూపాయలు. ఇదే ఇప్పటి వరకు ఏపీకి వచ్చిన అతి పెద్ద పెట్టుబడి. ఈ సంస్థ విశాఖలో అతి పెద్ద డేటా కేంద్రాన్నిఏర్పాటు చేయనుంది. 2029 నాటికి డేటాసెంటర్ను సంస్థ పూర్తి చేస్తుంది. అయితే.. దేశంలోనే అతిపెద్ద డేటా కేంద్రం ఇదే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి అటు గూగుల్ సంస్థ హిస్టరీలో కూడా భారత్లో ఇంత పెద్ద పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. అది కూడా ఏపీలో పెట్టడం గమనార్హం.
దీనివెనుక.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఉన్నారన్న ప్రచారం ఉంది. ఇక, ఈ డేటా కేంద్రం ఏర్పాటుతో విశాఖపట్నం `డేటాసెంటర్ హబ్`గా మారుతుంది. ఏఐ, హైఎండ్ ఉద్యోగాలు వస్తాయి. డేటా సెంటర్కు సింగపూర్ నుంచి సబ్మెరైన్ కేబుల్ను సముద్రమార్గంలో సంస్థ ఏర్పాటు చేస్తుంది. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించనుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చేందుకు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కూడా సహకరించారని సీఎం చంద్రబాబు తాజాగా వెల్లడించారు.
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…
విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న కొరియన్ కనకరాజుకి మోక్షం దొరికేసింది. ఆగస్ట్ 7 రిలీజ్ కు రంగం సిద్ధం…
గత వారం భారీ అంచనాల మధ్య ప్రేక్షెకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా తొలి వీకెండ్లో అంచనాలకు తగ్గట్లే భారీ…
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి. అలాంటిది కాంగ్రెస్ మంత్రితో బీజేపీ ఎంపీ భేటీ…
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…