ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు అనేక పెట్టుబడులు తెచ్చారు. కానీ, మంగళవారం ఆయన ఢిల్లీలో చేసుకునే ఓ కీలక ఒప్పందం మాత్రం ఆయన రాజకీయ జీవితంలోనే అతి పెద్ద ఒప్పందంగా మారనుంది. ఈ విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. తాజాగా అమరావతిలో పర్యటించిన ఆయన.. మునిసిపల్ శాఖకు చెందిన హెచ్ వోడీని ప్రారంభించారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. తాను ఢిల్లీకి వెళ్తున్నానని.. భారీ అగ్రిమెంట్ చేసుకుంటున్నానని చెప్పారు. ఇది ఏపీకి గేమ్ చేంజర్గా మారుతుందని చెప్పారు. ఈ ఒప్పందంతో ఏపీ భవిత కూడా మారుతుందన్నారు.
ఏంటీఒప్పందం..
గూగుల్ సహ సంస్థ రైడైన్తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటోంది. దీని విలువ ఏకంగా 90 వేల కోట్ల రూపాయలు. ఇదే ఇప్పటి వరకు ఏపీకి వచ్చిన అతి పెద్ద పెట్టుబడి. ఈ సంస్థ విశాఖలో అతి పెద్ద డేటా కేంద్రాన్నిఏర్పాటు చేయనుంది. 2029 నాటికి డేటాసెంటర్ను సంస్థ పూర్తి చేస్తుంది. అయితే.. దేశంలోనే అతిపెద్ద డేటా కేంద్రం ఇదే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి అటు గూగుల్ సంస్థ హిస్టరీలో కూడా భారత్లో ఇంత పెద్ద పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. అది కూడా ఏపీలో పెట్టడం గమనార్హం.
దీనివెనుక.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఉన్నారన్న ప్రచారం ఉంది. ఇక, ఈ డేటా కేంద్రం ఏర్పాటుతో విశాఖపట్నం `డేటాసెంటర్ హబ్`గా మారుతుంది. ఏఐ, హైఎండ్ ఉద్యోగాలు వస్తాయి. డేటా సెంటర్కు సింగపూర్ నుంచి సబ్మెరైన్ కేబుల్ను సముద్రమార్గంలో సంస్థ ఏర్పాటు చేస్తుంది. దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించనుంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చేందుకు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కూడా సహకరించారని సీఎం చంద్రబాబు తాజాగా వెల్లడించారు.
This post was last modified on October 13, 2025 6:49 pm
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…
ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే..…
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…