Political News

పొంగులేటి పెత్త‌నం చేస్తాడా?: కొండా ముర‌ళి ఫైర్‌

వ‌రంగ‌ల్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా ఉన్న మంత్రి సురేఖ భ‌ర్త కొండా ముర‌ళి.. మ‌రోసారి తెర‌మీదికి వ‌చ్చారు. గ‌తంలో ఇదే జిల్లాకు చెందిన క‌డియం శ్రీహ‌రిపై విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన ముర‌ళి.. అధిష్టానం ముందు వివ‌ర‌ణ ఇచ్చుకున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న మంత్రి, ఖ‌మ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. “పొంగులేటి మాపై పెత్త‌నం చేస్తాడా?  అంత‌.. మొగోడా?!“ అంటూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ప్ర‌స్తుతం సురేఖ దేవ‌దాయ శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే.. ఆమె శాఖ వ్య‌వ‌హారాల‌ను పొంగులేటి ఆదేశిస్తున్నార‌న్న‌ది ముర‌ళి ప్ర‌ధాన ఆరోప‌ణ‌. గ‌త నెల‌లో మేడారం జాత‌ర జ‌రిగిన‌ప్పుడు.. త‌ర్వాత కూడా.. ఆయ‌న ఆధిప‌త్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించార‌ని చెప్పారు. మేడారంలో కాంట్ర‌క్టు ప‌నుల‌ను త‌న కంపెనీల‌కే ఇచ్చుకున్నార‌ని ఆరోపించారు. భ‌ద్రాచ‌లం ఆల‌యానికి సంబంధించిన వ్య‌వ‌హారాల్లోనూ ఆయ‌న త‌ల‌దూర్చుతున్నార‌ని పేర్కొన్నారు.

అన్ని విష‌యాల్లోనూ జోక్యం చేసుకుని.. సురేఖ శాఖ‌లో వేలు పెడుతున్నార‌ని కొండా ముర‌ళి ఆరోపించారు. దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన‌ట్టు వివ‌రించారు. ఇది మ‌రోసారి రిపీట్ అయితే.. ఏమాత్రం స‌హించేది లేద‌న్నారు. పార్టీ ఏఐసీసీ అధ్య‌క్షుడు స‌హా రాష్ట్ర పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ మీనాక్షీ న‌ట‌రాజ‌న్ కు కూడా తాను ఫిర్యాదు చేశాన‌ని.. వారి నుంచి స‌రైన చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ఆశిస్తున్న‌ట్టు తెలిపారు.

“ఒక‌ళ్ల శాఖ‌లో ఒక‌రు వేలు పెట్ట‌డం ఏంటి?  ఎందుకు..?  నీకు అంత‌గా ఇష్ట‌మైతే.. ఆ శాఖ‌నే తీసుకోవ‌చ్చు క‌దా. సురేఖ‌మ్మ శాఖ‌లోనీకేం ప‌ని. అన్ని ప‌నులు నీకే కావాల‌. అన్నీ నీకేవాలా? మిగిలిన వారు ఏం చేస్తారు?  ఇందుకేనా మంత్రి ప‌ద‌వి ఇచ్చింది?“ అని కొండా ముర‌ళి వ్యాఖ్యానించారు. ఇక నుంచి ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను ఉపేక్షించేది లేద‌న్నారు. పార్టీ అధిష్టానం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ఆశిస్తున్న‌ట్టు పేఏర్కొన్నారు.

This post was last modified on October 11, 2025 4:13 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

4 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

6 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

7 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

7 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

8 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

8 hours ago