Political News

మొదటిసారి ఇండియాకు తాలిబాన్ మంత్రి.. సమస్య ఏమిటంటే..

ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకీ వారం రోజుల ట్రిప్‌ కోసం ఇండియాకు వచ్చారు. యూఎన్ నుంచి స్పెషల్ పర్మిషన్ (ట్రావెల్ వేవర్) తెచ్చుకుని ఆయన రావడం పెద్ద న్యూస్. 2021లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌లో పవర్ లోకి వచ్చిన తర్వాత, ఆ గ్రూప్ నుంచి ఇంత సీనియర్ లీడర్ ఇండియాకు రావడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ ట్రిప్‌లో ముత్తకీ, మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్‌తో మీట్ అయ్యే చాన్స్ ఉంది.

ఈ మీటింగ్‌ను పాకిస్థాన్‌తో సహా చుట్టుపక్కల దేశాలన్నీ చాలా జాగ్రత్తగా చూస్తున్నాయి. మీటింగ్స్ జరపడానికి ఢిల్లీ రెడీ అవుతున్నప్పటికీ, ఒక చిన్న సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. అదే ఫ్లాగ్ (జెండా) డిప్లొమసీ. రూల్ ప్రకారం, ఒక ఫారిన్ లీడర్ మీటింగ్స్‌కి వస్తే, వాళ్ల దేశపు జెండాను మన జాతీయ జెండాతో పాటు వెనుక పెట్టాలి. కానీ ఇండియా ఇప్పటివరకు తాలిబాన్ గవర్నమెంట్‌ను అధికారికంగా గుర్తించలేదు. అందుకే, తాలిబాన్ జెండా (తెల్లటి క్లాత్‌పై రాసి ఉంటుంది) కు అఫీషియల్ స్టేటస్ ఇవ్వలేదు. ఢిల్లీలోని ఆఫ్ఘన్ ఎంబసీలో ఇప్పటికీ పాత ఆఫ్ఘన్ రిపబ్లిక్ జెండానే ఎగురుతోంది.

ఈ జెండా మ్యాటరే ఇప్పుడు పెద్ద ఇష్యూ అయ్యింది. గతంలో మన అధికారులు దుబాయ్‌లో ముత్తకీని కలిసినప్పుడు, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏ జెండా పెట్టకుండా ప్రాబ్లమ్‌ను తప్పించుకున్నారు. కానీ ఈసారి మీటింగ్ ఢిల్లీలో, అది కూడా చాలా హై-ప్రొఫైల్ లెవల్‌లో జరుగుతోంది కాబట్టి, అధికారులు ఏం చేయాలనే కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. ఒకవేళ తాలిబాన్ జెండాను పెడితే, దానిని గుర్తించినట్లు అవుతుంది. పెట్టకపోతే, డిప్లొమాటిక్ రూల్స్ బ్రేక్ చేసినట్లు అవుతుంది.

గతంలో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్లీగా ఉండేవి. ఉగ్ర జ్వాలతో తాలిబాన్ వచ్చాక ఇండియా ఎంబసీని మూసేసింది, కానీ తర్వాత ట్రేడ్, మెడికల్ సాయం కోసం చిన్న మిషన్‌ను మళ్లీ ఓపెన్ చేసింది. ముత్తకీ ఈ ట్రిప్‌కి రావడం అంటే, తాలిబాన్‌తో సంబంధాలను ఒక కొత్త లెవెల్‌కు తీసుకెళ్లడానికి ఇండియా ట్రై చేస్తుందని అర్థం. ఆఫ్ఘనిస్తాన్ గడ్డను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదానికి వాడకూడదని ఇండియా కండిషన్ పెడుతోంది.

మొత్తానికి, ముత్తకీ పర్యటన చాలా ఇంపార్టెంట్. జెండా సమస్యను పక్కన పెడితే, ప్రాంతీయ భద్రత, టెర్రరిజం వంటి కీలక విషయాలపై ఇండియా చర్చించనుంది. ఈ దౌత్యపరమైన బ్యాలెన్సింగ్‌ను ఇండియా ఎలా హ్యాండిల్ చేస్తుందనేది ఇక్కడ మెయిన్ పాయింట్. తాలిబాన్ వైపు నుంచి ఇంత సీరియస్ ఎంగేజ్‌మెంట్ రావడం అనేది రీజనల్ పాలిటిక్స్‌ను కచ్చితంగా మార్చబోతోందని నిపుణులు చెబుతున్నారు.

This post was last modified on October 9, 2025 6:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేవలం ‘టీవీ సౌండ్’ గొడవ వల్లే భర్తను భార్య పొడిచిందా?

కట్టుకున్న వాడిపైనే భార్య కత్తి దూసింది.. కారణం చిన్నదిగానే కనిపిస్తున్నా దాని వెనక అభిప్రాయ భేదాలు, అపార్థాలు కూడా పెద్ద…

17 minutes ago

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

11 hours ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

11 hours ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

13 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

15 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

15 hours ago