దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇప్పటి వరకు దేశంలోని ఏ రాష్ట్రానికీ దక్కని లక్కును చేజిక్కించుకుని.. సగర్వంగా నిలిచింది. ఈ రికార్డుకు కారణం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమేనని తెలుస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడుల వేటలో ఉన్న సీఎం చంద్రబాబు.. ఇప్పటికి గత 15 మాసాల్లో 9 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు తెచ్చారు. వీటి వల్ల 4 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కూడా లభించాయని చెబుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా ఒకేసారి 1.14 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయి. ఇవి పూర్తిగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. అంతేకాదు.. దేశంలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. ఇక, ఈ పెట్టుబడుల ద్వారా ఒకే సారి 87 వేల మందికి ఉద్యోగాలు.. అదేసంఖ్యలో ఉపాధి అవకాశాలు కూడా దక్కనున్నాయి. తద్వారా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రక్రియలో ఈ పెట్టుబడులు కీలక పాత్ర పోషించనున్నాయి.
కాగా.. గడిచిన 15 మాసాల్లో సింగపూర్, మలేషియా తదితర దేశాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు పలు సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానించారు. అదేసమయంలో అమెరికాకు చెందిన గూగుల్, మస్క్ వంటి వారికి ఆతిథ్య రంగంలో అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక ఎలాన్ మస్క్ తొలినాళ్లలో ఇంట్రస్ట్ చూపించినా.. తర్వాత ఆయన వెనక్కి తగ్గారు. ఇక, బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇంధన, పర్యాటక రంగంతో పాటు పీ-4లోనూ పెట్టుబడులు పెట్టనుంది.
తాజా ప్రతిపాదనలు ఇవీ..
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…