Political News

దేశంలోనే ఏపీ ఫ‌స్ట్‌.. ఏ రాష్ట్రానికీ ద‌క్క‌ని ల‌క్‌!

దేశంలోనే ఏపీ ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలోని ఏ రాష్ట్రానికీ ద‌క్క‌ని ల‌క్కును చేజిక్కించుకుని.. స‌గ‌ర్వంగా నిలిచింది. ఈ రికార్డుకు కార‌ణం సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్న‌మేన‌ని తెలుస్తోంది. రాష్ట్రానికి పెట్టుబ‌డుల వేట‌లో ఉన్న సీఎం చంద్ర‌బాబు.. ఇప్ప‌టికి గ‌త 15 మాసాల్లో 9 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు పెట్టుబ‌డులు తెచ్చారు. వీటి వ‌ల్ల 4 ల‌క్ష‌ల ఉద్యోగాలు, ఉపాధి అవ‌కాశాలు కూడా ల‌భించాయ‌ని చెబుతున్న విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో తాజాగా ఒకేసారి 1.14 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు పెట్టుబ‌డులు వ‌చ్చాయి. ఇవి పూర్తిగా విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు. అంతేకాదు.. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స్థాయిలో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు వ‌చ్చిన దాఖ‌లాలు లేవు. ఇక‌, ఈ పెట్టుబ‌డుల ద్వారా ఒకే సారి 87 వేల మందికి ఉద్యోగాలు.. అదేసంఖ్య‌లో ఉపాధి అవ‌కాశాలు కూడా ద‌క్క‌నున్నాయి. త‌ద్వారా ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుని వ‌చ్చే నాలుగేళ్ల‌లో 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌న ప్ర‌క్రియ‌లో ఈ పెట్టుబ‌డులు కీల‌క పాత్ర పోషించ‌నున్నాయి.

కాగా.. గ‌డిచిన 15 మాసాల్లో సింగ‌పూర్‌, మ‌లేషియా త‌దిత‌ర దేశాల్లో ప‌ర్య‌టించిన సీఎం చంద్ర‌బాబు ప‌లు సంస్థ‌ల‌ను రాష్ట్రానికి ఆహ్వానించారు. అదేస‌మ‌యంలో అమెరికాకు చెందిన గూగుల్‌, మ‌స్క్ వంటి వారికి ఆతిథ్య రంగంలో అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. ఇక ఎలాన్ మ‌స్క్ తొలినాళ్ల‌లో ఇంట్ర‌స్ట్ చూపించినా.. త‌ర్వాత ఆయ‌న వెన‌క్కి త‌గ్గారు. ఇక‌, బిల్ గేట్స్ ఫౌండేష‌న్ ఇంధ‌న‌, ప‌ర్యాట‌క రంగంతో పాటు పీ-4లోనూ పెట్టుబ‌డులు పెట్ట‌నుంది.

తాజా ప్ర‌తిపాద‌న‌లు ఇవీ..

  • పెట్టుబ‌డి పెట్టే కంపెనీ: రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా లిమిటెడ్‌(గూగుల్ అనుబంధ సంస్థ‌)
  • ఎక్క‌డ పెట్టుబ‌డి పెట్ట‌నుంది: విశాఖ‌ప‌ట్నంలో
  • మొత్తం పెట్టుబ‌డి: 87,520 కోట్ల రూపాయ‌లు, దీనికి అనుబంధంగా 18 ల‌క్ష‌ల కోట్లు కూడా.
  • ఏర్పాటు చేసే కంపెనీలు.. : భారీ డేటా సెంటర్‌, ఇన్ఫోటెక్‌ మూడు క్యాంపస్‌లు, ఐటీలో మేలి మ‌లుపుగా మార‌నుంది.
  • దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు అతి పెద్ద పెట్టుబ‌డి: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమెరికా సంస్థ‌. మొత్తం 47 వేల కోట్ల రూపాయ‌లు.

This post was last modified on October 9, 2025 12:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

27 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

35 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

3 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

3 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

5 hours ago