Political News

అసెంబ్లీ సమావేశాలంటేనే టీడీపీలో టెన్షన్ పెరిగిపోతోందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే ఉంది. మామూలుగా అసెంబ్లీ సమావేశాలంటే ప్రతిపక్షాలు చాలా ఉత్సాహంగా ఉంటాయి. ఎందుకంటే అనేక సమస్యలపై అదికారపక్షాన్ని ఉతికి ఆరేసేందుకు. కానీ రాష్ట్రంలో మాత్రం రాజకీయం రివర్సు గేరులో నడుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీలో ప్రస్తావించేందుకు సమస్యలంటు పెద్దగా లేవనే చెప్పాలి. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా మిగిలిన అంశాలన్నీ వెనకబడిపోయాయి.

నవంబర్ 30 తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు జరపాలని స్ధూలంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఏదో సమావేశాలను నిర్వహించాలి కాబట్టి మొక్కుబడిగా నిర్వహించటమంతే. అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ ప్రస్తావించటానికి పెద్దగా అంశాలు కూడా ఏమీ లేవనే చెప్పాలి. కాకపోతే ప్రభుత్వం మీద ఆరోపణలు చేయాలి కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఫెయిల్ అయ్యిందని, ఎస్సీ, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ గోల చేయటానికి అసెంబ్లీ పనికొస్తుందంతే.

అయితే వీటన్నింటికన్నా అసెంబ్లీ సమావేశాలంటే తెలుగుదేశంపార్టీని టెన్షన్ పెట్టేస్తున్న అంశం మరొకటుంది. అదేమిటంటే ఈసారి ఏ ఎంఎల్ఏ పార్టీకి దూరమైపోతారు ? అని. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టినపుడే గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ టీడీపీకి దూరమయ్యారు. ఆ తర్వాత మద్దాలి గిరి కూడా ఇలాగే వెళ్ళిపోయారు. ఆమధ్య కరణం బలరామ్ కూడా పార్టీకి అసెంబ్లీ సమావేశాల సమయంలోనే దూరం అయ్యారు.

మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఇద్దరు ఎంఎల్సీలు పోతుల సునీత, శివనాధరెడ్డి దూరం అయ్యారు. ఈ మధ్య వైజాగ్ ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కూడా ఇలాగే పార్టీలో నుండి వెళ్ళిపోయారు. ఇక రేపటి అసెంబ్లీ సమావేశాలంటే ఇంకెవరు పార్టీకి దూరం అవుతారో అనే చర్చ పార్టీలో మొదలైపోయింది. విచిత్రమేమిటంటే టీడీపీకి దూరమైన ఎంఎల్ఏల్లో ఎవరు కూడా వైసీపీలో చేరలేదు. టీడీపీకి దూరమైపోయి అసెంబ్లీలో విడిగా కూర్చుంటున్నారంతే.

This post was last modified on November 28, 2020 2:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

5 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

9 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

10 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago