Political News

అసెంబ్లీ సమావేశాలంటేనే టీడీపీలో టెన్షన్ పెరిగిపోతోందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే ఉంది. మామూలుగా అసెంబ్లీ సమావేశాలంటే ప్రతిపక్షాలు చాలా ఉత్సాహంగా ఉంటాయి. ఎందుకంటే అనేక సమస్యలపై అదికారపక్షాన్ని ఉతికి ఆరేసేందుకు. కానీ రాష్ట్రంలో మాత్రం రాజకీయం రివర్సు గేరులో నడుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీలో ప్రస్తావించేందుకు సమస్యలంటు పెద్దగా లేవనే చెప్పాలి. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా మిగిలిన అంశాలన్నీ వెనకబడిపోయాయి.

నవంబర్ 30 తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు జరపాలని స్ధూలంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఏదో సమావేశాలను నిర్వహించాలి కాబట్టి మొక్కుబడిగా నిర్వహించటమంతే. అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ ప్రస్తావించటానికి పెద్దగా అంశాలు కూడా ఏమీ లేవనే చెప్పాలి. కాకపోతే ప్రభుత్వం మీద ఆరోపణలు చేయాలి కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఫెయిల్ అయ్యిందని, ఎస్సీ, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ గోల చేయటానికి అసెంబ్లీ పనికొస్తుందంతే.

అయితే వీటన్నింటికన్నా అసెంబ్లీ సమావేశాలంటే తెలుగుదేశంపార్టీని టెన్షన్ పెట్టేస్తున్న అంశం మరొకటుంది. అదేమిటంటే ఈసారి ఏ ఎంఎల్ఏ పార్టీకి దూరమైపోతారు ? అని. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టినపుడే గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ టీడీపీకి దూరమయ్యారు. ఆ తర్వాత మద్దాలి గిరి కూడా ఇలాగే వెళ్ళిపోయారు. ఆమధ్య కరణం బలరామ్ కూడా పార్టీకి అసెంబ్లీ సమావేశాల సమయంలోనే దూరం అయ్యారు.

మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఇద్దరు ఎంఎల్సీలు పోతుల సునీత, శివనాధరెడ్డి దూరం అయ్యారు. ఈ మధ్య వైజాగ్ ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కూడా ఇలాగే పార్టీలో నుండి వెళ్ళిపోయారు. ఇక రేపటి అసెంబ్లీ సమావేశాలంటే ఇంకెవరు పార్టీకి దూరం అవుతారో అనే చర్చ పార్టీలో మొదలైపోయింది. విచిత్రమేమిటంటే టీడీపీకి దూరమైన ఎంఎల్ఏల్లో ఎవరు కూడా వైసీపీలో చేరలేదు. టీడీపీకి దూరమైపోయి అసెంబ్లీలో విడిగా కూర్చుంటున్నారంతే.

This post was last modified on November 28, 2020 2:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…

1 hour ago

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

3 hours ago

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

5 hours ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

5 hours ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

6 hours ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

6 hours ago