Political News

అసెంబ్లీ సమావేశాలంటేనే టీడీపీలో టెన్షన్ పెరిగిపోతోందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే ఉంది. మామూలుగా అసెంబ్లీ సమావేశాలంటే ప్రతిపక్షాలు చాలా ఉత్సాహంగా ఉంటాయి. ఎందుకంటే అనేక సమస్యలపై అదికారపక్షాన్ని ఉతికి ఆరేసేందుకు. కానీ రాష్ట్రంలో మాత్రం రాజకీయం రివర్సు గేరులో నడుస్తోంది. ఎందుకంటే అసెంబ్లీలో ప్రస్తావించేందుకు సమస్యలంటు పెద్దగా లేవనే చెప్పాలి. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా మిగిలిన అంశాలన్నీ వెనకబడిపోయాయి.

నవంబర్ 30 తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు జరపాలని స్ధూలంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఏదో సమావేశాలను నిర్వహించాలి కాబట్టి మొక్కుబడిగా నిర్వహించటమంతే. అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ ప్రస్తావించటానికి పెద్దగా అంశాలు కూడా ఏమీ లేవనే చెప్పాలి. కాకపోతే ప్రభుత్వం మీద ఆరోపణలు చేయాలి కాబట్టి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఫెయిల్ అయ్యిందని, ఎస్సీ, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ గోల చేయటానికి అసెంబ్లీ పనికొస్తుందంతే.

అయితే వీటన్నింటికన్నా అసెంబ్లీ సమావేశాలంటే తెలుగుదేశంపార్టీని టెన్షన్ పెట్టేస్తున్న అంశం మరొకటుంది. అదేమిటంటే ఈసారి ఏ ఎంఎల్ఏ పార్టీకి దూరమైపోతారు ? అని. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టినపుడే గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ టీడీపీకి దూరమయ్యారు. ఆ తర్వాత మద్దాలి గిరి కూడా ఇలాగే వెళ్ళిపోయారు. ఆమధ్య కరణం బలరామ్ కూడా పార్టీకి అసెంబ్లీ సమావేశాల సమయంలోనే దూరం అయ్యారు.

మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఇద్దరు ఎంఎల్సీలు పోతుల సునీత, శివనాధరెడ్డి దూరం అయ్యారు. ఈ మధ్య వైజాగ్ ఎంఎల్ఏ వాసుపల్లి గణేష్ కూడా ఇలాగే పార్టీలో నుండి వెళ్ళిపోయారు. ఇక రేపటి అసెంబ్లీ సమావేశాలంటే ఇంకెవరు పార్టీకి దూరం అవుతారో అనే చర్చ పార్టీలో మొదలైపోయింది. విచిత్రమేమిటంటే టీడీపీకి దూరమైన ఎంఎల్ఏల్లో ఎవరు కూడా వైసీపీలో చేరలేదు. టీడీపీకి దూరమైపోయి అసెంబ్లీలో విడిగా కూర్చుంటున్నారంతే.

This post was last modified on November 28, 2020 2:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

44 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago