దేశంలోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ముద్ర పడిన కాంగ్రెస్ పార్టీ అంటేనే… అదోక అగూర గంప. వయసు ఉఢిగిన సీనియర్లతో పాటుగా అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన కుర్ర నేతల సమాహారం కాంగ్రెస్. అలాంటి పార్టీలో నిత్యం వివాదాలు రేగుతూ ఉంటాయి. వాటికవే సమసిపోతూ ఉంటాయి. ఎవరైనా కీలక నేత తన సహచర నేతను అదాటుగా ఓ బూతు అన్నాడుకో అదో పెద్ద రచ్చ. అయితే అలాంటి రచ్చలు కూడా కాంగ్రెస్ లో ఇట్టే సమసిపోతాయి. తాను తిట్టిన నేతకు సారీ చెప్పే నేత ఆ తర్వాత బాధితుడితో పాటు మిగిలిన నేతలతో కలిసి బంతి భోజనంలో కూర్చుని అరమరికలు లేకుండా మాట్లాడుకుంటారు. అదే కాంగ్రెస్ బలం అని చెప్పక తప్పదు.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అలాంటి ఘటనే జరిగింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్…తన సహచర మంత్రి, కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై దున్నపోతు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారింది. అడ్లూరి కూడా పొన్నంపై ఎాదురు దాడికి సిద్ధమైపోయారు. ఇలాంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డినో, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలతోనే పొన్నం తన తప్పును తెలుసుకున్నారు. అడ్లూరికి బేషరతుగా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమయ్యారు. అంతే ముందూ వెనుకా చూడకుండా అడ్లూరి వద్దకు వెళ్లి ఆయన సారీ చెప్పేశారు. అడ్లూరి కూడా శాంతించారు.
అంతే అంత పెద్ద వివాదం ఒకే ఒక్క సారీతో పరిష్కారం అయిపోయింది. అప్పటికే అక్కడికి చేరుకున్న మహేశ్ గౌడ్, ఒకరిద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు… ఇక సమస్య పరిష్కారం అయ్యింది కదా… మరి ఆకలి దంచేస్తోంది అంటూ సాగదీశారు. దీంతో అక్కడికక్కడే నిమిషాల్లో అల్పాహారం రెడీ కాగా… వారంతా కలిసి నవ్వుతూ తుళ్లుతూ అల్పాహారాన్ని ఆరగించారు. ఈ దృశ్యాలను చూసినవారంతా ఎంత కీచులాడుకున్నా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అవగాహన మంచిగా ఉంటుందని, అదే ఆ పార్టీకి బలమని వ్యాఖ్యలు చేస్తున్నారు.
This post was last modified on October 8, 2025 10:04 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…
నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…