దేశంలోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ముద్ర పడిన కాంగ్రెస్ పార్టీ అంటేనే… అదోక అగూర గంప. వయసు ఉఢిగిన సీనియర్లతో పాటుగా అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన కుర్ర నేతల సమాహారం కాంగ్రెస్. అలాంటి పార్టీలో నిత్యం వివాదాలు రేగుతూ ఉంటాయి. వాటికవే సమసిపోతూ ఉంటాయి. ఎవరైనా కీలక నేత తన సహచర నేతను అదాటుగా ఓ బూతు అన్నాడుకో అదో పెద్ద రచ్చ. అయితే అలాంటి రచ్చలు కూడా కాంగ్రెస్ లో ఇట్టే సమసిపోతాయి. తాను తిట్టిన నేతకు సారీ చెప్పే నేత ఆ తర్వాత బాధితుడితో పాటు మిగిలిన నేతలతో కలిసి బంతి భోజనంలో కూర్చుని అరమరికలు లేకుండా మాట్లాడుకుంటారు. అదే కాంగ్రెస్ బలం అని చెప్పక తప్పదు.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అలాంటి ఘటనే జరిగింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్…తన సహచర మంత్రి, కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై దున్నపోతు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారింది. అడ్లూరి కూడా పొన్నంపై ఎాదురు దాడికి సిద్ధమైపోయారు. ఇలాంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డినో, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలతోనే పొన్నం తన తప్పును తెలుసుకున్నారు. అడ్లూరికి బేషరతుగా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమయ్యారు. అంతే ముందూ వెనుకా చూడకుండా అడ్లూరి వద్దకు వెళ్లి ఆయన సారీ చెప్పేశారు. అడ్లూరి కూడా శాంతించారు.
అంతే అంత పెద్ద వివాదం ఒకే ఒక్క సారీతో పరిష్కారం అయిపోయింది. అప్పటికే అక్కడికి చేరుకున్న మహేశ్ గౌడ్, ఒకరిద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు… ఇక సమస్య పరిష్కారం అయ్యింది కదా… మరి ఆకలి దంచేస్తోంది అంటూ సాగదీశారు. దీంతో అక్కడికక్కడే నిమిషాల్లో అల్పాహారం రెడీ కాగా… వారంతా కలిసి నవ్వుతూ తుళ్లుతూ అల్పాహారాన్ని ఆరగించారు. ఈ దృశ్యాలను చూసినవారంతా ఎంత కీచులాడుకున్నా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అవగాహన మంచిగా ఉంటుందని, అదే ఆ పార్టీకి బలమని వ్యాఖ్యలు చేస్తున్నారు.
This post was last modified on October 8, 2025 10:04 pm
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు…
ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…