దేశంలోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ముద్ర పడిన కాంగ్రెస్ పార్టీ అంటేనే… అదోక అగూర గంప. వయసు ఉఢిగిన సీనియర్లతో పాటుగా అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన కుర్ర నేతల సమాహారం కాంగ్రెస్. అలాంటి పార్టీలో నిత్యం వివాదాలు రేగుతూ ఉంటాయి. వాటికవే సమసిపోతూ ఉంటాయి. ఎవరైనా కీలక నేత తన సహచర నేతను అదాటుగా ఓ బూతు అన్నాడుకో అదో పెద్ద రచ్చ. అయితే అలాంటి రచ్చలు కూడా కాంగ్రెస్ లో ఇట్టే సమసిపోతాయి. తాను తిట్టిన నేతకు సారీ చెప్పే నేత ఆ తర్వాత బాధితుడితో పాటు మిగిలిన నేతలతో కలిసి బంతి భోజనంలో కూర్చుని అరమరికలు లేకుండా మాట్లాడుకుంటారు. అదే కాంగ్రెస్ బలం అని చెప్పక తప్పదు.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అలాంటి ఘటనే జరిగింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్…తన సహచర మంత్రి, కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై దున్నపోతు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారింది. అడ్లూరి కూడా పొన్నంపై ఎాదురు దాడికి సిద్ధమైపోయారు. ఇలాంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డినో, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలతోనే పొన్నం తన తప్పును తెలుసుకున్నారు. అడ్లూరికి బేషరతుగా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమయ్యారు. అంతే ముందూ వెనుకా చూడకుండా అడ్లూరి వద్దకు వెళ్లి ఆయన సారీ చెప్పేశారు. అడ్లూరి కూడా శాంతించారు.
అంతే అంత పెద్ద వివాదం ఒకే ఒక్క సారీతో పరిష్కారం అయిపోయింది. అప్పటికే అక్కడికి చేరుకున్న మహేశ్ గౌడ్, ఒకరిద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు… ఇక సమస్య పరిష్కారం అయ్యింది కదా… మరి ఆకలి దంచేస్తోంది అంటూ సాగదీశారు. దీంతో అక్కడికక్కడే నిమిషాల్లో అల్పాహారం రెడీ కాగా… వారంతా కలిసి నవ్వుతూ తుళ్లుతూ అల్పాహారాన్ని ఆరగించారు. ఈ దృశ్యాలను చూసినవారంతా ఎంత కీచులాడుకున్నా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అవగాహన మంచిగా ఉంటుందని, అదే ఆ పార్టీకి బలమని వ్యాఖ్యలు చేస్తున్నారు.
This post was last modified on October 8, 2025 10:04 pm
పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…
హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నువ్వు నాతో…
మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…