దేశంలోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ముద్ర పడిన కాంగ్రెస్ పార్టీ అంటేనే… అదోక అగూర గంప. వయసు ఉఢిగిన సీనియర్లతో పాటుగా అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన కుర్ర నేతల సమాహారం కాంగ్రెస్. అలాంటి పార్టీలో నిత్యం వివాదాలు రేగుతూ ఉంటాయి. వాటికవే సమసిపోతూ ఉంటాయి. ఎవరైనా కీలక నేత తన సహచర నేతను అదాటుగా ఓ బూతు అన్నాడుకో అదో పెద్ద రచ్చ. అయితే అలాంటి రచ్చలు కూడా కాంగ్రెస్ లో ఇట్టే సమసిపోతాయి. తాను తిట్టిన నేతకు సారీ చెప్పే నేత ఆ తర్వాత బాధితుడితో పాటు మిగిలిన నేతలతో కలిసి బంతి భోజనంలో కూర్చుని అరమరికలు లేకుండా మాట్లాడుకుంటారు. అదే కాంగ్రెస్ బలం అని చెప్పక తప్పదు.
ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అలాంటి ఘటనే జరిగింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్…తన సహచర మంత్రి, కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై దున్నపోతు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారింది. అడ్లూరి కూడా పొన్నంపై ఎాదురు దాడికి సిద్ధమైపోయారు. ఇలాంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డినో, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలతోనే పొన్నం తన తప్పును తెలుసుకున్నారు. అడ్లూరికి బేషరతుగా క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమయ్యారు. అంతే ముందూ వెనుకా చూడకుండా అడ్లూరి వద్దకు వెళ్లి ఆయన సారీ చెప్పేశారు. అడ్లూరి కూడా శాంతించారు.
అంతే అంత పెద్ద వివాదం ఒకే ఒక్క సారీతో పరిష్కారం అయిపోయింది. అప్పటికే అక్కడికి చేరుకున్న మహేశ్ గౌడ్, ఒకరిద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు… ఇక సమస్య పరిష్కారం అయ్యింది కదా… మరి ఆకలి దంచేస్తోంది అంటూ సాగదీశారు. దీంతో అక్కడికక్కడే నిమిషాల్లో అల్పాహారం రెడీ కాగా… వారంతా కలిసి నవ్వుతూ తుళ్లుతూ అల్పాహారాన్ని ఆరగించారు. ఈ దృశ్యాలను చూసినవారంతా ఎంత కీచులాడుకున్నా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అవగాహన మంచిగా ఉంటుందని, అదే ఆ పార్టీకి బలమని వ్యాఖ్యలు చేస్తున్నారు.
This post was last modified on October 8, 2025 10:04 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…