కొన్ని రోజుల ముందు వరకు భారతీయ జనతా పార్టీకి బలం అనుకున్న వ్యక్తి ఇప్పుడు పెద్ద బలహీనతగా మారిపోతున్నాడు. సీనియర్ నాయకుడు లక్ష్మణ్ స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. పగ్గాలు చేపట్టాక కొన్ని నెలలు బాగానే పని చేశారు. దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీలో ఉత్సాహం తీసుకొచ్చారు.
దుబ్బాక ఎన్నికల్లో కూడా ఆయన దూకుడు సానుకూల ఫలితాలే ఇచ్చింది. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం మాత్రం ఆయన బీజేపీకి పెద్ద భారంగా మారిపోతున్నారు. రోజుకో వివాదాస్పద వ్యాఖ్యతో బండి సంజయ్ నెగెటివ్గా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన చేసిన కామెంట్లు కొన్ని మరీ కామెడీ అయిపోతుండటం పార్టీని కంగారు పెట్టేస్తోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై వేసే చలాన్లను తాము అధికారంలోకి వస్తే జీహెచ్ఎంసీనే కడుతుందంటూ ఈ మధ్య ఒక హామీ ఇచ్చి తీవ్ర విమర్శల పాలయ్యారు సంజయ్. దాని మీద సోషల్ మీడియా ఆయన్ని ఏకిపారేసింది. ఇప్పుడు అలాంటి అర్థం లేని హామీ మరొకటి ఇచ్చి దొరికిపోయారు సంజయ్. హైదరాబాద్లో వరదలొచ్చి కార్లు, బైక్లు కొట్టుకుపోతే వాటి స్థానంలో కొత్తవి కొనిస్తామని తాజాగా ఒక ప్రెస్ మీట్లో హామీ గుప్పించేశారు సంజయ్.
దీని గురించి ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. సంజయ్ ఇచ్చిన సమాధానం నవ్వుల పాలైంది. బైక్లు, కార్లకు ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి అవి వచ్చేలా చూస్తాం అని ఆయన బదులివ్వడం గమనార్హం. ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికి వాళ్లు తెచ్చుకుంటారు కానీ.. దీన్ని ఒక రాజకీయ పార్టీ హామీగా ఇవ్వడం ఏంటో సంజయ్కే తెలియాలి. సంబంధిత వీడియోతో సంజయ్ను మామూలుగా ట్రోల్ చేయట్లేదు సోషల్ మీడియా జనం.
This post was last modified on November 27, 2020 8:28 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…