Political News

బీఆర్ఎస్‌లో కౌశిక్ రెడ్డి కుంప‌టి.. ఇన్ని చిందులా?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌లో ఆది నుంచి ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా గుర్తింపు కోసం త‌హ త‌హలాడుతున్న కౌశిక్ రెడ్డి.. తాజాగా మ‌రో కుంప‌టి నెత్తిన పెట్టుకున్నారు. తాను పెట్టుకున్న‌దే కాకుండా.. పార్టీని కూడా బ‌జారున ప‌డేశారు. గ‌త 2023 ఎన్నిక‌ల్లో హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తొలిసారి విజయం ద‌క్కించుకున్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న కుటుంబంతో స‌హా.. సెల్ఫీ వీడియో విడుద‌ల చేశారు. ఈ ద‌ఫా గెలిపించ‌క‌పోతే.. తాను పాడె ఎక్కుతాన‌ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌ను సెంటిమెంటుతో ఆక‌ట్టుకున్నా రు. ఇదివివాదం కూడా అయింది.

ఇక‌, ఆ త‌ర్వాత పాడి గెల‌వ‌డం.. అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న వివాదాల‌ను నెత్తిన వేసుకుని యాగీ చేయడం తెలిసిందే. దీనివ‌ల్ల బీఆర్ఎస్‌కు చిన్న‌పాటి ప్ర‌యోజ‌నం కూడా ల‌భించ‌లేదు. అయినా.. కూడా.. పాడి మాత్రం త‌న దూకుడును త‌గ్గించ‌డం లేదా.. సొంత పార్టీ అనుకూల వాదుల‌ను, పార్టీ నాయ‌కుల‌ను కూడా ఆయ‌న బెదిరించారు. అలా ఇలా కాదు.. ఏకంగా తీవ్ర‌స్థాయిలో బెదిరించారు. ప్ర‌స్తుతం స్థానిక సంస్థల‌కు ఎన్నిక‌ల రంగం రెడీ అయింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న నియోజక‌వ‌ర్గాల్లో తిరుగుతున్నారు.

పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను కౌశిక్ రెడ్డి క‌లుస్తున్నారు. అయితే.. ఈ సంద‌ర్భంగా క‌మ‌లాపూర్ నియోజక‌వ‌ర్గంలోని ఐదు మండ‌లాల బీఆర్ఎస్ నాయ‌కుల‌ను ఉద్దేశించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు మంట‌లు రేపుతున్నాయి. “బీఆర్ఎస్ త‌ర‌ఫున గెలిచి.. త‌ర్వాత వేరే పార్టీల‌లోకి మారితే.. తుక్కుతుక్కు కింద చిత్తు రేగ్గొడ‌తం!” అంటూ.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు పార్టీ నాయ‌కులను తీవ్రంగా అవ‌మానించేలా ఉన్నాయ‌ని అంటున్నారు. అంతేకాదు.. “ఎవ‌డైనా.. ఇప్పుడు గెలిచి.. త‌ర్వాత‌.. వేరే పార్టీలోకి చేరితే.. వెయ్యి మందితో ఇళ్ల‌పైకి వ‌చ్చి.. చుక్క‌లు చూపిస్తం. తుక్కు రేగ్గొడ‌తాం” అని ప‌దే ప‌దే వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్య‌లు.. ఆవేశంలో అన్నారో.. ఆవేద‌న‌తో అన్నారో తెలియ‌దు కానీ.. కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు నాయ‌కులు రెడీ అయ్యారు. అంత‌న‌మ్మ‌కం లేన‌ప్పుడు.. తాము పార్టీలో ఉండాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు. అంతేకాదు..కౌశిక్ రెడ్డి కి మంత్రి ప‌ద‌వి ఇస్తామంటే.. జంపైపోడా? అని ఒక‌రిద్ద‌రు నిప్పులు చెరిగారు. అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయ‌ని.. నోరేసుకుని.. కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను అవ‌మానించేలా మాట్లాడితే.. ఊరుకునేది లేద‌న్నారు. కేసీఆర్ అంత‌టివారే అంద‌రినీ న‌మ్ముతున్నార‌ని.. ఈయ‌నెంత? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

This post was last modified on October 7, 2025 6:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

15 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

55 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago