తమిళనాడులోని కరూర్ జిల్లాలో గత నెల 27న రాత్రి చోటు చేసుకున్న తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనకు కారణాలేంటి? ఎలా జరిగిందనే విషయంపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నా.. ఇతమిత్థంగా ఇంకా కారణాలు తెలియలేదు. ఇదిలావుంటే.. నాటి ఘటనకు పూర్తిగా డీఎంకే ప్రభుత్వానిదే కారణమని సీనియర్ నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశ పూర్వకంగానే ప్రజలను కట్టడి చేయలేదని ఆమె అన్నారు. దీని వెనుక కుట్ర ఉందన్నారు.
గత నెల 27న రాత్రి తమిళ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత ఇళయ దళపతి విజయ్.. నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. వేలుసామి పురంలో జరిగిన ఈ ఘటనలో 41 మంది మృతి చెందారు. ఇప్పటికీ అనేక మంది ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. అయితే.. ఈ ఘటనకు విజయ్ కారణమని పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఉద్దేశ పూర్వకంగా జన సమీకరణ కోసం ఆయన ఆలస్యంగా వచ్చారని.. దీంతో జనాభా పెరిగిపోయి.. తొక్కిసలాటకు దారి తీసిందన్నారు.
ఇక, విజయ్ వాదన వేరేగా ఉంది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని.. తాము బహిరంగ సభకు అనుమతి అడిగితే ఇవ్వనందుకే.. తాము రోడ్ షో చేయాల్సి వచ్చిందని విజయ్ వ్యాఖ్యానించారు. ఇలా .. ఇరు పక్షాల మధ్య వాదనలు, ప్రతివాదనలు చోటు చేసుకుంటున్న సమయంలో కేంద్రంలోని బీజేపీ నాయకులు రియాక్ట్ అయ్యారు. తమను నిరంతరం తిట్టిపోస్తున్న విజయ్ను వారు వెనుకేసుకు రావడం గమనార్హం. వాస్తవానికి విజయ్ నాస్తికుడు. కానీ, బీజేపీ మాత్రం ఇప్పుడు ఆయనను వెనుకేసుకువస్తోంది.
తాజాగా బీజేపీ తమిళనాడు ఉపాధ్యక్షురాలు, సినీ నటి ఖుష్బూ భారీ ఎత్తున విజయ్ను వెనుకేసుకు వచ్చా రు. అసలు తప్పంతా ప్రభుత్వానిదేనని.. ఉద్దేశ పూర్వకంగా విజయ్పై కుట్రపన్నారని.. అంత ఇరుకు రోడ్డు కేటాయించాలని ప్రభుత్వానికి ఎలా అనిపించిందని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ అధికార పార్టీ కుట్రగా అబివర్ణించారు. ఒక రాజకీయ పార్టీ పుంజుకుంటే ఓర్వలేని తనం వల్లే సీఎం స్టాలిన్ అనుమతి ఇవ్వలేదన్నారు. వాస్తవానికి టీవీకే అడిగిన మేరకు అనుమతి ఇచ్చినట్టు సీఎం కూడా ప్రకటించారు. కానీ, విజయ్ కోసం.. బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు చేయడం గమనార్హం.
This post was last modified on October 5, 2025 2:22 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…