Political News

ఎల‌క్ష‌న్ స్ట్రాట‌జీ: నాడు ర‌జ‌నీ.. నేడు విజ‌య్… బీజేపీ త‌హ‌త‌హ‌!

ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే చాటు.. బీజేపీ వ్యూహాలు మారుతాయి. గెలుపే ధ్యేయంగా ఎలాంటి వ్యూహాల‌నైనా క‌మ‌ల నాథులు అమ‌లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే గ‌తంలో వైరం ఉన్న టీడీపీతో చేతులు క‌లిపి గ‌త ఏడాది జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల‌లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు త‌మిళ‌నాడుపైనా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నారు. త‌మిళ‌నాడులో వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి – మార్చి మ‌ధ్య సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. ఈ క్ర‌మంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌మ‌ను తిట్టిపోసిన ఇళ‌య ద‌ళ‌ప‌తి, టీవీకే అధినేత విజ‌య్‌ను మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.

వాస్త‌వానికి బీజేపీ.. త‌మిళ‌నాడు విష‌యంలో వేయ‌ని పాచిక లేదు. అనుస‌రించ‌ని వ్యూహం లేదు. గ‌తంలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీని ముందు పెట్టి రాజ‌కీయాలు చేశారు. ఆయ‌న సొంత‌గా పార్టీ పెట్టుకున్న‌ప్పుడు.. బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. ముందు నువ్వు.. త‌ర్వాత నేను.. అనే వ్యూహానికి తెర‌దీసింది. వాస్త‌వానికి త‌మిళ ప్ర‌జ‌లు బీజేపీ విష‌యంలో జాగ‌రూక‌త‌తోనే ఉన్నారు. అందుకే మూడు ద‌శాబ్దాల్లో ఎన్న‌డూ ఇక్క‌డ బీజేపీ ఆశించిన మేర‌కు ఫ‌లితాన్ని రాబ‌ట్టుకోలేక పోయింది. అయినా.. ప్ర‌య‌త్నాలు మాత్రం కొన‌సాగుతూనే ఉన్నాయి.

జ‌య‌లలిత పార్టీ అన్నాడీఎంకేలో చీలిక‌లు తీసుకువ‌చ్చి తాను ల‌బ్ధి పొందే ప్ర‌య‌త్నం చేసింది. ఈ క్ర‌మంలో జ‌య నెచ్చెలిని జైలుకు పంపారు. ఇప్పుడు కూడా ఆమె ఆస్తుల‌పై దాడులు చేయించారు. క‌రోనా స‌మ‌యంలో ఆస్తులు పెరిగాయ‌న్న కార‌ణంగా ఇటీవ‌ల సీబీఐ దాడులు చేసింది. దీంతో జ‌య నెచ్చెలిగా పేరొందిన శ‌శిక‌ళ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఇక‌, ర‌జ‌నీ గ‌తంలోనే బీజేపీ వ్యూహాన్ని ప‌సిగ‌ట్టి.. దూరం జ‌రిగారు. అస‌లు రాజ‌కీయాలే వ‌ద్ద‌న్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా బీజేపీ క‌న్ను విజ‌య్‌పై ప‌డింది.

టీవీకే పార్టీ ద్వారా త‌మిళ‌నాడులో ప్ర‌భంజ‌నం సృష్టించాల‌ని నిర్ణ‌యించుకున్న విజ‌య్‌.. గ‌త ఏడాది నుంచి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వ‌చ్చారు. ఆయ‌న పెడుతున్న స‌భ‌ల‌కు భారీ స్పంద‌న కూడా వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న తాను ఎవ‌రికీ తోక కాద‌ని.. ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ‌న‌ని చెబుతున్నారు. అయితే.. తాజాగాక‌రూర్‌లో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌.. 41 మంది మృతి అనంత‌రం.. అనూహ్యంగా బీజేపీ ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికింది. ఈ విష‌యంలో విజ‌య్ త‌ప్పులేద‌ని బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేశారు.

త‌ద్వారా ఆయ‌న‌ను చేరువ చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో విజ‌య్ త‌న‌ను తాను కాపాడుకుని.. పార్టీని పైకి తెచ్చేందుకు ఎవ‌రో ఒక‌రి మ‌ద్ద‌తు అవ‌స‌రం అనే స్థాయిలో ఉన్నారు. దీనిని బీజేపీ త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. మ‌రి ఈ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా? లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. బీజేపీ కుటిల రాజ‌కీయాల‌పై త‌మిళులు నిప్పులు చెరుగుతున్నార‌న్న‌ది వాస్త‌వం.

Kumar

Recent Posts

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

16 minutes ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

31 minutes ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

2 hours ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

2 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

3 hours ago

మీనాక్షి కోసం డీకే క్యాంపు

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…

4 hours ago