Political News

విధేయ‌త‌కు వీర‌తాడు: నాగ‌బాబు ప‌ద‌వి.. రామ్‌కు!

రాజ‌కీయాల్లో విధేయుల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌డం కొత్త‌కాదు. పార్టీ ప‌ట్ల‌, పార్టీ అధినేత‌ల ప‌ట్ల విధేయంగా ఉన్న నాయ‌కుల‌కు ప‌ద‌వులు అల‌వోక‌గా వ‌రిస్తుంటాయి. ప్ర‌స్తుతం ఏపీ అధికార పార్టీలలో కీలకమైన జ‌న‌సేన‌లోనూ.. ఇదే త‌రహాలో ప‌ద‌వులు వ‌స్తున్నాయి. పార్టీలో న‌మ్మ‌కంగా ఉంటూ.. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యానికి కార‌ణ‌మైన రామ్ తాళ్లూరికి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కీల‌క ప‌దవిని అప్ప‌గించారు. పార్టీ సంస్థాగ‌త, అభివృద్ధి వ్య‌వ‌హారాల‌ను ఆయ‌న చేతిలో పెట్టారు. ఈ నేప‌థ్యంలోనే జ‌నసేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా రామ్‌ను నియ‌మించారు.

నాగ‌బాబు నుంచి..

ప్ర‌స్తుతం నిన్న‌టి వ‌ర‌కు కూడా జ‌నసేన పార్టీ సంస్థాగ‌త , అభివృద్ధి వ్య‌వ‌హారాల‌ను ఎమ్మెల్సీ నాగ‌బాబు చూసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా నాగ‌బాబు చేతిలోనే ఈ ప‌ద‌వి ఉంది. అయితే.. ప్ర‌స్తుతం ఆయ‌న ఎమ్మెల్సీ కావ‌డం, పార్టీకి ఎక్కువ స‌మ‌యం కేటాయించే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో కొన్నాళ్లుగా పార్టీ వ్య‌వ‌హారాల‌ను చూసుకునేందుకు ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యానికి తోడు.. పార్టీని విస్త‌రించాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు. దీంతో ఇప్పుడు నాగ‌బాబును ప‌క్క‌న పెట్టి.. ఈ ప‌ద‌విని.. రామ్ తాళ్లూరికి అప్ప‌గించారు.

ఎవ‌రీ రామ్‌?

రామ్ తాళ్లూరి నేటివ్ ప్లేస్ తెలంగాణ‌లోని ఖ‌మ్మం. ప్ర‌వాసాంధ్రుడు. అమెరికాలో ప‌లు సంస్థ‌లు నెల‌కొల్పి వ్యాపారాలు చేస్తున్నారు. వీటిలో లీడ్ ఐటీ కార్ప్‌, ఫ్లై జోన్ ట్రాంపోలిన్ పార్క్, రామ్ ఇన్నోవేషన్స్ (రియల్ ఎస్టేట్) వంటి వ్యాపారాలు ఉన్నాయి. అయితే.. తొలుత సినీ రంగంలో అడుగు పెట్టిన ఆయ‌న ప‌వ‌న్‌కు చేరువ అయ్యారు. త‌ర్వాత‌.. ఎస్ ఆర్టీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పేరుతో నిర్మాత‌గా మారి.. సినిమాలు చేశారు. ఆ త‌ర్వాత‌.. జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందారు.

ఇప్ప‌టి వ‌ర‌కు..

ఇక‌, జ‌న‌సేన పార్టీలో ఇప్ప‌టి వ‌ర‌కు రామ్ తాళ్లూరి.. ఐటీ విభాగానికి ఇంచార్జ్‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ప‌వ‌న్ రాజ‌కీయ ప్ర‌సంగాల‌ను.. హైలెట్ చేయ‌డంలోను.. ఐటీ విభాగాన్ని ముందుకున‌డిపించ‌డంలోనూ త‌న స‌మ‌ర్థ‌త‌ను చాటుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా.. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పోస్టును ఇచ్చారు. అటు ఐటీ విభాగాన్ని కూడా ఆయ‌నే న‌డిపించ‌నున్నారు. మొత్తానికి విధేయ‌త‌కు వీర‌తాడు వేసి.. పార్టీలో కొత్త జోష్ నింపార‌ని అంటున్నారు నాయ‌కులు.

This post was last modified on October 3, 2025 10:54 am

Share
Show comments
Published by
Kumar
Tags: Janasena

Recent Posts

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

60 minutes ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

2 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

3 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

4 hours ago

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

6 hours ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

8 hours ago