Political News

చంద్రబాబుకే మేధావి వర్గం మద్దతు.. కారణం ఏమిటి?

రాష్ట్రంలోని మేధావి వర్గం అంతా కూడా సీఎం చంద్రబాబు వైపు నిలబడిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో పార్టీలకు అతీతంగా అనేకమంది మేధావులు సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా ఆన్లైన్ ఛానెల్లు, యూట్యూబ్ ద్వారా కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపించారు. అదేవిధంగా కూటమి నేతలకు అనుకూలంగా కామెంట్లు చేశారు. ప్రజలను ఒకరకంగా మొబిలైజ్ చేయడంలో మేధావి వర్గం పాత్ర కూడా ఉందని అంటారు.

గత ఎన్నికల సమయంలో మేధావులుగా ఉన్న మాజీ ఐఏఎస్‌లు, మాజీ ఐపీఎస్‌లు, అదేవిధంగా ఉన్నతస్థాయిలో రిటైర్ అయిన అధికారులు కూడా జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం రైతుల నుంచి భూములు లాక్కుంటోందని, ప్రజలపై హింసాత్మకంగా వ్యవహరిస్తోందని, హైకోర్టు తిట్టిపోసిందని వంటి అనేక విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. కనీసం 15 నుంచి 20 శాతం ఓటు బ్యాంకును వారు కూటమి వైపు మళ్లించారన్న వాదన కూడా ఉంది.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసింది. అయితే అదే సమస్యలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడుల కోసం కావచ్చు, రాజధాని కోసం కావచ్చు ప్రభుత్వం రైతుల నుంచి, ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా భూములు తీసుకుంటోంది. ఇది పెను వివాదానికి దారితీసింది. నెల్లూరు జిల్లా కరేడు, గుంటూరు జిల్లా అమరావతి, కాకినాడ జిల్లా ఉప్పాడ, విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట, అదేవిధంగా భీమిలిలో కూడా భూసేకరణ జరుగుతోంది. దీనిపై రైతులు, ఇతర సామాజిక వర్గాలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ప్రభుత్వం గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారంటూ రాత్రికి రాత్రి అరెస్టు చేస్తున్న పరిణామాలు, అదేవిధంగా హైకోర్టును తప్పుదారి పట్టిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే వాదన వినిపిస్తోంది. ఇక శాంతిభద్రతల పరంగా చూస్తే హోమ్ మంత్రి సొంత జిల్లా విశాఖలోనే 9 ఏళ్ల బాలికపై ఘోర అత్యాచారం జరిగింది. ఇతర జిల్లాల్లోనూ అనేక అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.

అయినప్పటికీ మేధావి వర్గం మౌనంగానే ఉండటం పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై స్పందించిన మేధావి వర్గం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ మేధావి వర్గం మాత్రం జగన్ పాలనకన్నా చంద్రబాబు పాలన బెటర్ అన్నట్టుగా ఉన్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది.

ఏదేమైనా పరిస్థితుల్లో కొత్తగా మార్పు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇవి చంద్రబాబు వరకు చేరాయా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం మేధావి వర్గం బాబుకు అనుకూలంగా ఉండటం గమనార్హం.

This post was last modified on October 3, 2025 12:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మృణాల్ పాటించాల్సిన సలహానే ఇది

సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…

1 hour ago

స్టాండ‌ప్ క‌మెడియన్ సారీ… అంద‌రికీ ఓ పాఠం

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి వెళ్లిపోతే ప‌రిణామాలు ఎలా ఉంటాయో మ‌రోసారి రుజువైంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్…

3 hours ago

మళ్లీ ‘టీఆర్ఎస్’ గా గులాబీ సేన?

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…

4 hours ago

హీరోలు మారినా ఫలితాలు మారట్లేదు

హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…

5 hours ago

ఎన్టీఆర్ నీల్ ఏం ఇవ్వబోతున్నారు

మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…

6 hours ago

అలా బటన్ నొక్కితే… ఇలా నెంబర్ ప్లేట్ మారిపోద్ది

ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…

7 hours ago