రాష్ట్రంలోని మేధావి వర్గం అంతా కూడా సీఎం చంద్రబాబు వైపు నిలబడిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో పార్టీలకు అతీతంగా అనేకమంది మేధావులు సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా ఆన్లైన్ ఛానెల్లు, యూట్యూబ్ ద్వారా కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపించారు. అదేవిధంగా కూటమి నేతలకు అనుకూలంగా కామెంట్లు చేశారు. ప్రజలను ఒకరకంగా మొబిలైజ్ చేయడంలో మేధావి వర్గం పాత్ర కూడా ఉందని అంటారు.
గత ఎన్నికల సమయంలో మేధావులుగా ఉన్న మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు, అదేవిధంగా ఉన్నతస్థాయిలో రిటైర్ అయిన అధికారులు కూడా జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం రైతుల నుంచి భూములు లాక్కుంటోందని, ప్రజలపై హింసాత్మకంగా వ్యవహరిస్తోందని, హైకోర్టు తిట్టిపోసిందని వంటి అనేక విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. కనీసం 15 నుంచి 20 శాతం ఓటు బ్యాంకును వారు కూటమి వైపు మళ్లించారన్న వాదన కూడా ఉంది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసింది. అయితే అదే సమస్యలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడుల కోసం కావచ్చు, రాజధాని కోసం కావచ్చు ప్రభుత్వం రైతుల నుంచి, ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా భూములు తీసుకుంటోంది. ఇది పెను వివాదానికి దారితీసింది. నెల్లూరు జిల్లా కరేడు, గుంటూరు జిల్లా అమరావతి, కాకినాడ జిల్లా ఉప్పాడ, విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట, అదేవిధంగా భీమిలిలో కూడా భూసేకరణ జరుగుతోంది. దీనిపై రైతులు, ఇతర సామాజిక వర్గాలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వం గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారంటూ రాత్రికి రాత్రి అరెస్టు చేస్తున్న పరిణామాలు, అదేవిధంగా హైకోర్టును తప్పుదారి పట్టిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే వాదన వినిపిస్తోంది. ఇక శాంతిభద్రతల పరంగా చూస్తే హోమ్ మంత్రి సొంత జిల్లా విశాఖలోనే 9 ఏళ్ల బాలికపై ఘోర అత్యాచారం జరిగింది. ఇతర జిల్లాల్లోనూ అనేక అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.
అయినప్పటికీ మేధావి వర్గం మౌనంగానే ఉండటం పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై స్పందించిన మేధావి వర్గం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ మేధావి వర్గం మాత్రం జగన్ పాలనకన్నా చంద్రబాబు పాలన బెటర్ అన్నట్టుగా ఉన్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది.
ఏదేమైనా పరిస్థితుల్లో కొత్తగా మార్పు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇవి చంద్రబాబు వరకు చేరాయా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం మేధావి వర్గం బాబుకు అనుకూలంగా ఉండటం గమనార్హం.
This post was last modified on October 3, 2025 12:28 am
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…