రాష్ట్రంలోని మేధావి వర్గం అంతా కూడా సీఎం చంద్రబాబు వైపు నిలబడిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో పార్టీలకు అతీతంగా అనేకమంది మేధావులు సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా ఆన్లైన్ ఛానెల్లు, యూట్యూబ్ ద్వారా కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపించారు. అదేవిధంగా కూటమి నేతలకు అనుకూలంగా కామెంట్లు చేశారు. ప్రజలను ఒకరకంగా మొబిలైజ్ చేయడంలో మేధావి వర్గం పాత్ర కూడా ఉందని అంటారు.
గత ఎన్నికల సమయంలో మేధావులుగా ఉన్న మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు, అదేవిధంగా ఉన్నతస్థాయిలో రిటైర్ అయిన అధికారులు కూడా జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం రైతుల నుంచి భూములు లాక్కుంటోందని, ప్రజలపై హింసాత్మకంగా వ్యవహరిస్తోందని, హైకోర్టు తిట్టిపోసిందని వంటి అనేక విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. కనీసం 15 నుంచి 20 శాతం ఓటు బ్యాంకును వారు కూటమి వైపు మళ్లించారన్న వాదన కూడా ఉంది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసింది. అయితే అదే సమస్యలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడుల కోసం కావచ్చు, రాజధాని కోసం కావచ్చు ప్రభుత్వం రైతుల నుంచి, ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా భూములు తీసుకుంటోంది. ఇది పెను వివాదానికి దారితీసింది. నెల్లూరు జిల్లా కరేడు, గుంటూరు జిల్లా అమరావతి, కాకినాడ జిల్లా ఉప్పాడ, విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట, అదేవిధంగా భీమిలిలో కూడా భూసేకరణ జరుగుతోంది. దీనిపై రైతులు, ఇతర సామాజిక వర్గాలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వం గట్టిగానే హెచ్చరికలు జారీ చేస్తోంది. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారంటూ రాత్రికి రాత్రి అరెస్టు చేస్తున్న పరిణామాలు, అదేవిధంగా హైకోర్టును తప్పుదారి పట్టిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే వాదన వినిపిస్తోంది. ఇక శాంతిభద్రతల పరంగా చూస్తే హోమ్ మంత్రి సొంత జిల్లా విశాఖలోనే 9 ఏళ్ల బాలికపై ఘోర అత్యాచారం జరిగింది. ఇతర జిల్లాల్లోనూ అనేక అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.
అయినప్పటికీ మేధావి వర్గం మౌనంగానే ఉండటం పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై స్పందించిన మేధావి వర్గం ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ మేధావి వర్గం మాత్రం జగన్ పాలనకన్నా చంద్రబాబు పాలన బెటర్ అన్నట్టుగా ఉన్నారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది.
ఏదేమైనా పరిస్థితుల్లో కొత్తగా మార్పు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇవి చంద్రబాబు వరకు చేరాయా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి మాత్రం మేధావి వర్గం బాబుకు అనుకూలంగా ఉండటం గమనార్హం.
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…