Political News

`గూగుల్`కు అడ్డు ప‌డుతోందెవ‌రు: చంద్ర‌బాబు ఆరా

ఏపీలో పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిస్తున్న కూట‌మి ప్ర‌భుత్వానికి వైసీపీ నాయ‌కులు ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా అడ్డు ప‌డుతున్నార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. “వారు పెట్టుబ‌డులు తీసుకురాలేదు. ఇప్పుడు తెస్తుంటే అడ్డుప‌డుతున్నారు. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు. ఎట్టి ప‌రిస్థితిలోనూ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే“ అని సీఎం తేల్చి చెప్పారు. విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత డేటా సెంట‌ర్‌ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకునేందుకురెడీ అయింది. అయితే.. ముందుగా భూ సేక‌ర‌ణ కోసం ప్ర‌య‌త్నిస్తోంది.

`గూగుల్ డేటా సెంట‌ర్‌` రాక‌తో విశాఖ రూపు రేఖ‌లు మారుతాయ‌ని.. ఐటీ రాజ‌ధానిగా విశాఖ భాసిల్లుతుంద‌ని ప్ర‌భుత్వం భావి స్తోంది. దీనిపై చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ క్ర‌మంలో డేటా సెంట‌ర్ ఏర్పాటుకు వీలుగా భూ సేక‌ర‌ణ‌కు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. సంబంధిత రైతుల‌ను కూడా ఒప్పంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. స‌ద‌రు భూముల విష‌యంపై కోర్టుల‌లో పిటిష‌న్లు ప‌డ్డాయి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్ల‌లో రైతుల పేర్ల‌ను ప‌రిశీలించిన స‌ర్కారు.. వీరిలో ఒక‌రిద్ద‌రు ఎప్పుడో చ‌నిపోయిన వారేన‌ని గుర్తించింది. దీంతో ఈ పిటిష‌న్ల వెనుక కుట్ర చోటు చేసుకుంద‌ని భావించి.. తాజాగా చ‌ర్య‌ల‌కు ఆదేశించింది.

బుధ‌వారం విశాఖ‌లో ప‌ర్య‌టించిన సీఎం చంద్ర‌బాబు గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన భూ సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం ఎక్క‌డిదాకా వ‌చ్చింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేందిర ప్ర‌సాద్‌ను విచారించారు. అయితే.. కోర్టులో కేసులు న‌మోద‌య్యాయ‌ని.. వీటి విష‌యంలో స్పందించాల్సిఉంద‌ని తెలిపారు. కానీ, ఆ పిటిష‌న్ల‌ను ఎవ‌రు దాఖ‌లు చేశారు? వీరి వెనుక ఎవ‌రున్నారు? అనే విష‌యాల‌పై స్ప‌ష్టత లేకుండా పోయింద‌న్నారు. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సీఎం చంద్ర‌బాబు.. ఇవ‌న్నీ..వైసీపీ నే చేయిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం బాగుప‌డ‌డం ఆ పార్టీకి ఇష్టం లేద‌న్నారు. రైతుల పేరుతో పిటిష‌న్లు వేసిన వారిని గుర్తించి.. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ భూముల సేక‌ర‌ణ జ‌ర‌గాల‌ని సూచించారు.

ప‌రిహారం డ‌బుల్‌!

డేటా సెంట‌ర్ కోసం.. ఇచ్చే భూముల విష‌యంలో సీఎం చంద్ర‌బాబు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కొంద‌రు రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావ‌డం లేద‌ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు తెలిపారు. దీనిపై స్పందించిన చంద్ర‌బాబు.. ప‌రిహారం రెట్టింపు ఇస్తున్నామ‌ని.. అయినా.. చాల‌దంటే ఎలా? అని ప్ర‌శ్నించారు. వాస్త‌వానికి కేంద్రం చేసిన చ‌ట్టం ప్ర‌కారం.. భూసేక‌ర‌ణ కింద ప‌రిహారం ఇస్తామ‌ని.. ఇక్క‌డ మాత్రం దీనినిడ‌బుల్ ఇస్తున్నామ‌ని చెప్పారు. రైతుల‌ను ఒప్పించి.. భూములు తీసుకునేందుకు .. పార్టీ త‌ర‌ఫున కూడా ప్ర‌య‌త్నాలు చేయాల‌ని ఆయ‌న సూచించారు.

This post was last modified on October 2, 2025 8:43 am

Share

Recent Posts

మధ్య వయసులో ‘విశ్వనాథ్’ ప్రేమ

సూర్య హీరోగా తమిళంలో రూపొందుతున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ పేరుకి కోలీవుడ్ మూవీ అయినప్పటికీ దర్శకుడు, నిర్మాత ఇద్దరూ…

1 hour ago

అమెచ్యూరిష్ వివాదంపై స్పందించిన మెగా హీరో

ఈ రోజు మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది కొరియన్ కనకరాజు సినిమా. వరుణ్ తేేజ్ హీరోగా మేర్లపాక…

3 hours ago

సీఎం విజయ్ విడాకుల కేసు ముగిసింది

టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసు వ్యవహారం ఎన్నికలకు ముందు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.…

3 hours ago

విశ్వనాథంని కవ్విస్తున్న విశాల్

వచ్చే వారం ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న విశ్వనాథం అండ్ సన్స్ మీద ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి బజ్…

7 hours ago

వరుణ్ తేజ్ నమ్మలేని నిజం ఇది

వరుణ్ తేజ్ గత సినిమాల ఓపెనింగ్స్ ఒకసారి తవ్వి తీస్తే రిలీజ్ రోజు మార్నింగ్ షోకు చాలా చోట్ల ఫుల్స్…

9 hours ago

జడల్ జమానా మీద మిశ్రమ స్పందనా

న్యాచురల్ స్టార్ నాని అభిమానుల విపరీతమైన ఎదురు చూపులకు చెక్ పెడుతూ ది ప్యారడైజ్ టీజర్ వచ్చేసింది. నిమిషంన్నర లోపే…

11 hours ago