తెలంగాణ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ముద్రపడిపోయిన వీసీ సజ్జన్నారి్ హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తానేం చేయాలనుకుంటున్న విషయాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా నేరగాళ్లకు వార్నింగ్ లు ఇచ్చిన సజ్జన్నార్… డ్రంకన్ డ్రైవింగ్ ను మాత్రం ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పారు. డ్రంకన్ డ్రైవింగ్ చేసేవాళ్లను ఆయన ఏకంగా టెర్రరిస్టులతో పోల్చారు.
డ్రంకన్ డ్రైవింగ్ కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోగా… అందులో తాగి బండి నడిపేవాడితో పాటుగా ఏ పాపం తెలియని వ్యక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని సజ్జన్నార్ తెలిపారు. ఈ సందర్భంగా డ్రంకన్ డ్రైవింగ్ చేసేవాళ్లను ఆయన సూసైడ్ బాంబర్లతో పోల్చారు. తాగి రోడ్డెక్కిన వాడు తాను చావడంతో పాటుగా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాడని, ఫలితంగా చాలా కుటుంబాలు అనాథలుగా మిగులుతున్నాయని చెప్పారు. ఈ కారణంగానే ఇప్పటిదాకా నగరంలో డ్రంకన్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకున్నారని, ఇకపై తనిఖీలను మరింతగా ముమ్మరం చేస్తామని ఆయన చెప్పారు.
నగరంలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందన్న సజ్జన్నార్… డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ నగరానికి పలు మార్గాల నుంచి డ్రగ్స్ రావడం అధికమైందన్నారు. దీనిని అరికడతామన్నారు. ఇక నగరంలో చోరీలు, హత్యలు కూడా పెరిగిపోతున్నాయన్న సీపీ… వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఆడపిల్లలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. నేరస్తులు ఇకపై నేరాలు చేయాలంటేనే భయం కలిగేలా చేస్తామని సజ్జన్నార్ తెలిపారు.
This post was last modified on October 1, 2025 3:54 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…