తెలంగాణ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ముద్రపడిపోయిన వీసీ సజ్జన్నారి్ హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తానేం చేయాలనుకుంటున్న విషయాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా నేరగాళ్లకు వార్నింగ్ లు ఇచ్చిన సజ్జన్నార్… డ్రంకన్ డ్రైవింగ్ ను మాత్రం ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పారు. డ్రంకన్ డ్రైవింగ్ చేసేవాళ్లను ఆయన ఏకంగా టెర్రరిస్టులతో పోల్చారు.
డ్రంకన్ డ్రైవింగ్ కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోగా… అందులో తాగి బండి నడిపేవాడితో పాటుగా ఏ పాపం తెలియని వ్యక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని సజ్జన్నార్ తెలిపారు. ఈ సందర్భంగా డ్రంకన్ డ్రైవింగ్ చేసేవాళ్లను ఆయన సూసైడ్ బాంబర్లతో పోల్చారు. తాగి రోడ్డెక్కిన వాడు తాను చావడంతో పాటుగా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాడని, ఫలితంగా చాలా కుటుంబాలు అనాథలుగా మిగులుతున్నాయని చెప్పారు. ఈ కారణంగానే ఇప్పటిదాకా నగరంలో డ్రంకన్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకున్నారని, ఇకపై తనిఖీలను మరింతగా ముమ్మరం చేస్తామని ఆయన చెప్పారు.
నగరంలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందన్న సజ్జన్నార్… డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ నగరానికి పలు మార్గాల నుంచి డ్రగ్స్ రావడం అధికమైందన్నారు. దీనిని అరికడతామన్నారు. ఇక నగరంలో చోరీలు, హత్యలు కూడా పెరిగిపోతున్నాయన్న సీపీ… వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఆడపిల్లలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. నేరస్తులు ఇకపై నేరాలు చేయాలంటేనే భయం కలిగేలా చేస్తామని సజ్జన్నార్ తెలిపారు.
This post was last modified on October 1, 2025 3:54 pm
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…