తెలంగాణ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ముద్రపడిపోయిన వీసీ సజ్జన్నారి్ హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తానేం చేయాలనుకుంటున్న విషయాలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా నేరగాళ్లకు వార్నింగ్ లు ఇచ్చిన సజ్జన్నార్… డ్రంకన్ డ్రైవింగ్ ను మాత్రం ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పారు. డ్రంకన్ డ్రైవింగ్ చేసేవాళ్లను ఆయన ఏకంగా టెర్రరిస్టులతో పోల్చారు.
డ్రంకన్ డ్రైవింగ్ కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోగా… అందులో తాగి బండి నడిపేవాడితో పాటుగా ఏ పాపం తెలియని వ్యక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని సజ్జన్నార్ తెలిపారు. ఈ సందర్భంగా డ్రంకన్ డ్రైవింగ్ చేసేవాళ్లను ఆయన సూసైడ్ బాంబర్లతో పోల్చారు. తాగి రోడ్డెక్కిన వాడు తాను చావడంతో పాటుగా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాడని, ఫలితంగా చాలా కుటుంబాలు అనాథలుగా మిగులుతున్నాయని చెప్పారు. ఈ కారణంగానే ఇప్పటిదాకా నగరంలో డ్రంకన్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకున్నారని, ఇకపై తనిఖీలను మరింతగా ముమ్మరం చేస్తామని ఆయన చెప్పారు.
నగరంలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా పెరిగిపోయిందన్న సజ్జన్నార్… డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ నగరానికి పలు మార్గాల నుంచి డ్రగ్స్ రావడం అధికమైందన్నారు. దీనిని అరికడతామన్నారు. ఇక నగరంలో చోరీలు, హత్యలు కూడా పెరిగిపోతున్నాయన్న సీపీ… వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఆడపిల్లలపై దాడులు, అత్యాచారాలకు పాల్పడేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. నేరస్తులు ఇకపై నేరాలు చేయాలంటేనే భయం కలిగేలా చేస్తామని సజ్జన్నార్ తెలిపారు.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…