Political News

డేంజ‌ర్ జోన్లో మ‌ద్యం అమ్మ‌కాల‌కు గ్రీన్ సిగ్న‌ల్

ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు 35 వేల దాకా ఉంటే.. అందులో దాదాపు మూడో వంతు కేసులు మ‌హారాష్ట్ర‌లోనే ఉన్నాయి. అక్క‌డ క‌రోనా కేసుల సంఖ్య 11 వేలు దాటింది. 600 మంది దాకా మృతి చెందారు. దేశంలోనే అత్యంత జ‌న‌సాంద్ర‌త క‌లిగిన ప్రాంతం అయిన ధారావి మురికివాడ‌లో వంద‌ల సంఖ్య‌లో క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ప‌దుల సంఖ్య‌లో చ‌నిపోతున్నారు.

అలాంటి రాష్ట్రంలో మ‌ద్యం అమ్మ‌కాల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న‌ప్ప‌టి నుంచి దేశ‌వ్యాప్తంగా మందుబాబుల క‌ష్టం మామూలుగా లేదు. ప్ర‌తి రాష్ట్రం మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా వ‌చ్చే ఆదాయం మీద ఎంత‌గానో ఆధార‌ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వాల్ని న‌డ‌ప‌డ‌మే క‌ష్టంగా ఉంది. అయినప్ప‌టికీ క‌రోనా ముప్పును దృష్టిలో ఉంచుకుని మ‌ద్యం అమ్మ‌కాల‌కు సాహ‌సించ‌డం లేదు.

ఐతే దేశంలోనే క‌రోనా ప్రభావం అత్యధికంగా ఉన్నా.. మున్ముందు మ‌రింత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఎదుర‌య్యేలా ఉన్నా మ‌హారాష్ట్ర మాత్రం మ‌ద్యం అమ్మ‌కాల‌కు ప‌చ్చ జెండా ఊపేసింది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి చాలా ఇబ్బందిక‌రంగా త‌యార‌వ‌డంతో మ‌ద్యం అమ్మ‌కాలు పునఃప్రారంభించాల్సిందే అని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే నిర్ణ‌యించారు. కొన్ని రోజుల కింద‌ట ఆయ‌న సోద‌రుడు, మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే.. రాష్ట్రంలో మ‌ద్యం అమ్మ‌కాల‌కు అనుమ‌తి ఇవ్వకుంటే చాలా క‌ష్ట‌మ‌వుతుంద‌ని హెచ్చ‌రిస్తూ అన్న‌కు లేఖ రాశాడు.

అధికారుల నుంచి కూడా ఇదే ర‌కమైన సూచ‌న‌లు రావ‌డంతో ఉద్ధ‌వ్ సానుకూల నిర్ణ‌యం తీసుకున్నాడు. ఐతే నెలన్న‌ర‌ రోజుల పాటు మ‌ద్యానికి ముఖం వాచిపోయిన మందుబాబులు వైన్ షాపుల మీదికి ఒక్క‌సారిగా దండెత్తితే, పార్టీల పేరుతో గుమిగూడి హంగామా చేస్తే.. ఇళ్ల‌లో మందు కొట్టి కుటుంబ స‌భ్యుల్ని హింస‌ల‌కు గురి చేస్తే ప‌రిస్థితేంటి అన్న‌ది చూడాలి.

This post was last modified on May 2, 2020 5:11 am

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

1 hour ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

4 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago