Political News

డేంజ‌ర్ జోన్లో మ‌ద్యం అమ్మ‌కాల‌కు గ్రీన్ సిగ్న‌ల్

ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు 35 వేల దాకా ఉంటే.. అందులో దాదాపు మూడో వంతు కేసులు మ‌హారాష్ట్ర‌లోనే ఉన్నాయి. అక్క‌డ క‌రోనా కేసుల సంఖ్య 11 వేలు దాటింది. 600 మంది దాకా మృతి చెందారు. దేశంలోనే అత్యంత జ‌న‌సాంద్ర‌త క‌లిగిన ప్రాంతం అయిన ధారావి మురికివాడ‌లో వంద‌ల సంఖ్య‌లో క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ప‌దుల సంఖ్య‌లో చ‌నిపోతున్నారు.

అలాంటి రాష్ట్రంలో మ‌ద్యం అమ్మ‌కాల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న‌ప్ప‌టి నుంచి దేశ‌వ్యాప్తంగా మందుబాబుల క‌ష్టం మామూలుగా లేదు. ప్ర‌తి రాష్ట్రం మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా వ‌చ్చే ఆదాయం మీద ఎంత‌గానో ఆధార‌ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వాల్ని న‌డ‌ప‌డ‌మే క‌ష్టంగా ఉంది. అయినప్ప‌టికీ క‌రోనా ముప్పును దృష్టిలో ఉంచుకుని మ‌ద్యం అమ్మ‌కాల‌కు సాహ‌సించ‌డం లేదు.

ఐతే దేశంలోనే క‌రోనా ప్రభావం అత్యధికంగా ఉన్నా.. మున్ముందు మ‌రింత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఎదుర‌య్యేలా ఉన్నా మ‌హారాష్ట్ర మాత్రం మ‌ద్యం అమ్మ‌కాల‌కు ప‌చ్చ జెండా ఊపేసింది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి చాలా ఇబ్బందిక‌రంగా త‌యార‌వ‌డంతో మ‌ద్యం అమ్మ‌కాలు పునఃప్రారంభించాల్సిందే అని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే నిర్ణ‌యించారు. కొన్ని రోజుల కింద‌ట ఆయ‌న సోద‌రుడు, మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన అధినేత రాజ్ థాక్రే.. రాష్ట్రంలో మ‌ద్యం అమ్మ‌కాల‌కు అనుమ‌తి ఇవ్వకుంటే చాలా క‌ష్ట‌మ‌వుతుంద‌ని హెచ్చ‌రిస్తూ అన్న‌కు లేఖ రాశాడు.

అధికారుల నుంచి కూడా ఇదే ర‌కమైన సూచ‌న‌లు రావ‌డంతో ఉద్ధ‌వ్ సానుకూల నిర్ణ‌యం తీసుకున్నాడు. ఐతే నెలన్న‌ర‌ రోజుల పాటు మ‌ద్యానికి ముఖం వాచిపోయిన మందుబాబులు వైన్ షాపుల మీదికి ఒక్క‌సారిగా దండెత్తితే, పార్టీల పేరుతో గుమిగూడి హంగామా చేస్తే.. ఇళ్ల‌లో మందు కొట్టి కుటుంబ స‌భ్యుల్ని హింస‌ల‌కు గురి చేస్తే ప‌రిస్థితేంటి అన్న‌ది చూడాలి.

This post was last modified on May 2, 2020 5:11 am

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

2 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

6 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

10 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

10 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

11 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

12 hours ago