Political News

ఎన్నిక‌లు ఆగుత‌యి.. దావ‌త్‌లు ఇవ్వ‌కండి: ఈటల

తెలంగాణలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు నోటిఫికేష‌న్ ఇచ్చారు. డేట్లు కూడా ప్ర‌క‌టించారు. మ‌రో ప‌ది రోజుల్లో నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా ప్రారంభం కానుంది. ఎన్నిక‌ల జాబితాల‌ను కూడా అధికారులు రెడీ చేస్తున్నారు. ఇక‌, పార్టీల ప‌రంగా అటు బీఆర్ఎస్‌, ఇటు కాంగ్రెస్‌లు కూడా స‌ర్వ‌స‌న్న‌ద్ధం అవుతున్నాయి. ప్ర‌చార ప‌ర్వాల‌కు కూడా దిగేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో బీజేపీ నాయ‌కుడు, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోవ‌మ‌ని అన్నారు. నోటిఫికేష‌న్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చ‌ని, కానీ.. ఈ ఎన్నిక‌లు జ‌ర‌గే అవ‌కాశం లేద‌ని తేల్చి చెప్పారు. ఎందుకంటే.. రాజ్యాంగ విరుద్ధంగా స్థానిక సంస్థ‌ల్లో ప్ర‌భుత్వం 42 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌ని చూస్తోంద‌న్నారు. దీనిని ఎవ‌రూ ఒప్పుకోవ‌డం లేద‌న్నారు. రేపు ఎవ‌రైనా కోర్టును ఆశ్ర‌యిస్తే.. అప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా ర‌ద్దు చేసే అవ‌కాశం ఉంద‌ని తేల్చి చెప్పారు. ఈ విష‌యాన్ని దృస్టిలో పెట్టుకుని నాయ‌కులు ఖ‌ర్చు పెట్టుకోవ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు. దావ‌త్‌లు కూడా ఇవ్వ‌ద్ద‌న్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప‌లు సూచ‌న‌లు కూడా చేశారు.

గ‌తంలో మ‌హారాష్ట్రంలోనూ ఇలానే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించార‌ని ఈట‌ల తెలిపారు. అప్ప‌ట్లో అక్క‌డ‌.. కూడా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేశార‌ని.. కానీ, అవి రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని బాంబే హైకోర్టులో ప‌లువురు పిటిష‌న్లు వేశార‌ని తెలిపారు. ఫ‌లితంగా ఆ ఎన్నిక‌ల‌ను ఆరుమాసాల త‌ర్వాత‌.. హైకోర్టు ర‌ద్దు చేసింద‌న్నారు. దీంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో భారీ ఎత్తున ఖ‌ర్చు చేసిన వారు తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని తెలిపారు. ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని నాయ‌కులు ఎవ‌రూ ఖ‌ర్చు పెట్టొద్ద‌ని సూచించారు. ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోవ‌న్నారు.

బండి ఏం చేస్తున్నారు?: కాంగ్రెస్ ఫైర్‌

కాగా, ఈటల రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ మ‌హేష్ గౌడ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేస్తుంటే ఓర్చుకోలేక పోతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. బీసీ నాయ‌కుల‌మ‌ని చెప్పే.. ఈట‌ల రాజేంద‌ర్‌, బండి సంజ‌య్‌లు ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రిగా బండి సంజ‌య్‌కు ఈట‌ల‌ను అదుపు చేసే బాధ్య‌త‌లేదా? అని ప్ర‌శ్నించారు. బీసీల‌కు న్యాయం చేసేందుకు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని.. ఎన్నిక‌లు జ‌ర‌గ‌కూడ‌ద‌ని బీజేపీ నాయ‌కులు కుట్ర ప‌న్నుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on September 30, 2025 6:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మైఖేల్ జాక్సన్ మీద ఇంత ప్రేమ ఉందా

ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…

20 minutes ago

శ్రీలీల డెబ్యూకి మోక్షం ఎప్పుడో

అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…

1 hour ago

పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…

3 hours ago

LSG: ఓనర్ గోయెంకా కోపంలో తప్పు లేదు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…

3 hours ago

తెలుగు టైటిల్స్ నిర్లక్ష్యం చేయకండి

ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…

3 hours ago

క‌విత దూకుడు మామూలుగా లేదు

క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. మాజీసీఎం కేసీఆర్ త‌న‌య‌గా.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఆ పార్టీతో…

3 hours ago