తమిళ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత విజయ్ శనివారం తమిళనాడులోని కరూర్ లో చేపట్టిన ర్యాలీలో 40 మంది దాకా మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో విజయ్ ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఘటన జరిగిన తర్వాత ఆయన గట్టి భద్రత మధ్య కరూర్ నుంచి చెన్నై వెళ్లిపోయారు. తాజాగా ఆదివారం ఉదయం కాస్తంత తేరుకున్న విజయ్ చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఓ మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్టు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు సదరు ప్రకటనలో విజయ్ తెలిపారు.
సాధారణంగా రాజకీయ పార్టీ నేతలు నిర్వహించే ర్యాలీల్లో ఈ మేర తొక్కిసలాట జరగడం దాదాపుగా అరుదే. అయితే ఊహించని దానికంటే అధికంగా జనం రావడంతో విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగినట్లు అనుమానిస్తున్నారు. విజయ్ ర్యాలీకి కేవలం 50 వేల మంది హాజరు అవుతారని పోలీసులు భావించారు. అది కూడా టీవీకే ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు ఆ 50 వేల మందిని నియంత్రించేందుకు 500 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. అయితే 50 వేలు అనుకున్న జనం ఏకంగా 5 లక్షల వరకు చేరిపోయింది. దీంతో జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. ఫలితంగానే తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఇదిలా ఉంటే… టీవీకే అధినేత విజయ్ నిర్లక్ష్య వైఖరి కారణంగానే తొక్కిసలాట జరిగి 40 మంది చనిపోయారని తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదానికి, అంతమంది చనిపోవడానికి కారణమైన విజయ్ ను తక్షణమే అరెస్టు చేయాలని ఆయా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు చెన్నైలోని విజయ్ నివాసం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. విజయ్ నివాసంపై దాడులు జరిగే ప్రమాదం ఉందన్న నేపథ్యంలోనే ఈ భద్రత ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…