Political News

‘లోకల్’ బరిలో రేవంత్ కు చిక్కులు షురూ!

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు అడుగు పడిందన్న ఆనందం ఒక్కరోజులోనే ఆవిరి అయిపోయింది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారంటూ రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవ రెడ్డి నేరుగా హైకోర్టుకు ఎక్కారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో తన పిటిషన్ ను లంచ్ మోషన్ పిటిషన్ గా విచారించాలని ఆయన కోర్టును కోరారు. మాధవ రెడ్డి వినతికి సరేనన్న తెలంగాణ హైకోర్టు.. రిజర్వేషన్ల అంశం గవర్నర్ పరిధిలో ఉండగా ప్రభుత్వం జీవో ఎలా జారీ చేస్తుందని ప్రశ్నించింది. వెరసి స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ రెడ్డి సర్కారు చిక్కులు మొదలైనట్టేనని చెప్పక తప్పదు.

వాస్తవానికి ఎన్నికలను సెప్టెంబర్ చివరిలోగా ముగించాలని ఇదివరకే హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అందుకనుగుణంగానే రేవంత్ సర్కారు అప్పటికే ముగించిన కుల గణనను ఆధారం చేసుకుని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన ఓ బిల్లును ప్రభుత్వం గవర్నర్ కు పంపింది. ఈ బిల్లును పెద్దగా పట్టించుకోని గవర్నర్… ఫైల్ ను నేరుగా రాష్ట్రపతికి పంపించారు. ప్రస్తుతం సదరు బిల్లు ప్రతి రాష్ట్రపతి భవన్ లోనే ఉండిపోయింది. దానిని కదిలించి రైట్ రాయల్ గా బీసీలకు 42 శాతం రిజర్వషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలను ముగించాలని భావించినా ఫలితం లేకుండా పోయింది.

రాజకీయ కారణాలతోనే ఈ బిల్లు అలా పెండింగ్ లో పడిపోయిందన్న భావనకు వచ్చేసిన రేవంత్ సర్కారు.. జీవో విడుదల చేసి ఎన్నికలకు వెళ్లాలని తీర్మానించింది. అందులో భాగంగా శుక్రవారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇస్తూ పలు జీవోలను జారీ చేసింది. ఈ జీవోలపై తెలంగాణవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. అయితే కొన్ని సంస్థలు రేవంత్ సర్కారు ప్రతిపాదిస్తున్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాయి. వాటిలోని ఓ సంస్థకు చెందిన మాధవ రెడ్డి అందరి కంటే ముందు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు ఉద్దేశించిన బిల్లు గవర్నర్ కార్యాలయం వద్ద పెండింగ్ లో ఉండగా… అంత త్వరగా జీవో జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా సెప్టెంబర్ చివరిలోగా స్థానిక సంస్థల ఎన్నికలను ముగించాలని చెప్పిన కోర్టు ఇప్పుడు మాత్రం అన్ని అవాంతరాలు తేలకుండా ఎన్నికలను అంత హడావిడిగా నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించడం గమనార్హం. అంతేకాకుండా రిజర్వేషన్ల శాతం 50 శాతం మించకుండా ఉండాలి కదా అని కూడా కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.

This post was last modified on September 27, 2025 9:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

4 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

5 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

5 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

6 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

7 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

8 hours ago