Political News

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత

తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో శుక్రవారం ఓ కీలక ప్రకటన వెలువడింది. విపక్ష బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సునీత అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. సునీతకే టికెట్ దక్కుతుందని చాలా రోజులుగా అనుకుంటున్నా… శుక్రవారం అధికారిక ప్రకటన రావడంతో ఆ విషయం రూఢీ అయిపోయింది.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీని వదిలి బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ టికెట్ దక్కించుకున్న మాగంటి వరుస విజయాలతో దూసుకెళ్లారు. అయితే ఇటీవల జరిగిన బోరబండ కార్పొరేటర్ మృతితో మాగంటి తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురై ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

మాగంటి మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే బీఆర్ఎస్ విపక్షంలో ఉండటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఈ రెండు పార్టీల మథ్యే ప్రదాన పోటీ నెలకొంది. మాగంటి కుటుంబం నుంచి సునీతతో పాటు ఆమె మరిది కూడా టికెట్ ఆశించారు. అయితే అధిష్ఠానం మాత్రం సునీత వైపే మొగ్గుచూపింది. మాగంటి సతీమణిగా సునీతకు సానుభూతి లభిస్తుందన్నది ఓ భావన కాగా… చనిపోయిన ఎమ్మెల్యే భార్యకే టికెట్ ఇచ్చామని, ఇతర పార్టీలు పోటీ నుంచి తప్పుకుని ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న వాదనను వినిపించేందుకు ఈ వ్యూహం పనికి వస్తుందన్నది మరో భావనగా తెలుస్తోంది.

This post was last modified on September 26, 2025 2:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ టీమ్… గ్రౌండ్ రియాలిటీ తాలూకా

మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…

3 hours ago

అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ, కారణం ఏంటి?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…

3 hours ago

జగన్ ‘అరటి’ విమర్శల్లో నిజమెంత?

ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…

4 hours ago

‘కోనసీమ పచ్చదనం’.. జనసేన పార్టీ ఫస్ట్ రియాక్షన్

ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…

4 hours ago

పీఎంవో పేరు-భ‌వ‌నం కూడా మార్పు.. అవేంటంటే!

దేశంలో పురాత‌న, బ్రిటీష్ కాలం నాటి పేర్ల‌ను, ఊర్ల‌ను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్ర‌భుత్వం…

4 hours ago

‘రాజధాని రైతులను ఒప్పించాలి కానీ నొప్పించకూడదు’

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి మ‌హాన‌గ‌రంగా నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్న సీఎం చంద్ర‌బాబు.. ఆదిశ‌గా వ‌డి వ‌డిగా అడుగులు వేస్తున్నారు.…

5 hours ago