తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో శుక్రవారం ఓ కీలక ప్రకటన వెలువడింది. విపక్ష బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సునీత అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. సునీతకే టికెట్ దక్కుతుందని చాలా రోజులుగా అనుకుంటున్నా… శుక్రవారం అధికారిక ప్రకటన రావడంతో ఆ విషయం రూఢీ అయిపోయింది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీని వదిలి బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ టికెట్ దక్కించుకున్న మాగంటి వరుస విజయాలతో దూసుకెళ్లారు. అయితే ఇటీవల జరిగిన బోరబండ కార్పొరేటర్ మృతితో మాగంటి తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురై ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మాగంటి మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే బీఆర్ఎస్ విపక్షంలో ఉండటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఈ రెండు పార్టీల మథ్యే ప్రదాన పోటీ నెలకొంది. మాగంటి కుటుంబం నుంచి సునీతతో పాటు ఆమె మరిది కూడా టికెట్ ఆశించారు. అయితే అధిష్ఠానం మాత్రం సునీత వైపే మొగ్గుచూపింది. మాగంటి సతీమణిగా సునీతకు సానుభూతి లభిస్తుందన్నది ఓ భావన కాగా… చనిపోయిన ఎమ్మెల్యే భార్యకే టికెట్ ఇచ్చామని, ఇతర పార్టీలు పోటీ నుంచి తప్పుకుని ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న వాదనను వినిపించేందుకు ఈ వ్యూహం పనికి వస్తుందన్నది మరో భావనగా తెలుస్తోంది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…