తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో శుక్రవారం ఓ కీలక ప్రకటన వెలువడింది. విపక్ష బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సునీత అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. సునీతకే టికెట్ దక్కుతుందని చాలా రోజులుగా అనుకుంటున్నా… శుక్రవారం అధికారిక ప్రకటన రావడంతో ఆ విషయం రూఢీ అయిపోయింది.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీని వదిలి బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ టికెట్ దక్కించుకున్న మాగంటి వరుస విజయాలతో దూసుకెళ్లారు. అయితే ఇటీవల జరిగిన బోరబండ కార్పొరేటర్ మృతితో మాగంటి తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురై ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మాగంటి మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే బీఆర్ఎస్ విపక్షంలో ఉండటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఈ రెండు పార్టీల మథ్యే ప్రదాన పోటీ నెలకొంది. మాగంటి కుటుంబం నుంచి సునీతతో పాటు ఆమె మరిది కూడా టికెట్ ఆశించారు. అయితే అధిష్ఠానం మాత్రం సునీత వైపే మొగ్గుచూపింది. మాగంటి సతీమణిగా సునీతకు సానుభూతి లభిస్తుందన్నది ఓ భావన కాగా… చనిపోయిన ఎమ్మెల్యే భార్యకే టికెట్ ఇచ్చామని, ఇతర పార్టీలు పోటీ నుంచి తప్పుకుని ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న వాదనను వినిపించేందుకు ఈ వ్యూహం పనికి వస్తుందన్నది మరో భావనగా తెలుస్తోంది.
This post was last modified on September 26, 2025 2:43 pm
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…