Political News

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత

తెలుగు రాష్ట్రాల ప్రజలు అత్యంత ఆసక్తిగా గమనిస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో శుక్రవారం ఓ కీలక ప్రకటన వెలువడింది. విపక్ష బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సునీత అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. సునీతకే టికెట్ దక్కుతుందని చాలా రోజులుగా అనుకుంటున్నా… శుక్రవారం అధికారిక ప్రకటన రావడంతో ఆ విషయం రూఢీ అయిపోయింది.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీని వదిలి బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ టికెట్ దక్కించుకున్న మాగంటి వరుస విజయాలతో దూసుకెళ్లారు. అయితే ఇటీవల జరిగిన బోరబండ కార్పొరేటర్ మృతితో మాగంటి తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురై ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

మాగంటి మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే బీఆర్ఎస్ విపక్షంలో ఉండటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఈ రెండు పార్టీల మథ్యే ప్రదాన పోటీ నెలకొంది. మాగంటి కుటుంబం నుంచి సునీతతో పాటు ఆమె మరిది కూడా టికెట్ ఆశించారు. అయితే అధిష్ఠానం మాత్రం సునీత వైపే మొగ్గుచూపింది. మాగంటి సతీమణిగా సునీతకు సానుభూతి లభిస్తుందన్నది ఓ భావన కాగా… చనిపోయిన ఎమ్మెల్యే భార్యకే టికెట్ ఇచ్చామని, ఇతర పార్టీలు పోటీ నుంచి తప్పుకుని ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న వాదనను వినిపించేందుకు ఈ వ్యూహం పనికి వస్తుందన్నది మరో భావనగా తెలుస్తోంది.

This post was last modified on September 26, 2025 2:43 pm

Share

Recent Posts

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

33 minutes ago

టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి…

53 minutes ago

పిఠాపురం ఇకపై పవన్ కంచు కోట

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…

2 hours ago

రక్తంతో రాసుకున్న ‘ప్యారడైజ్’ శాసనం

న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…

3 hours ago

డీఎస్సీపైనే వైసీపీకి ఎందుకంత మంకుపట్టు?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…

3 hours ago

కొత్త మార్పుల వైపు చరణ్ & సుకుమార్ ?

ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…

4 hours ago