Political News

నేను పూజారిని మాత్ర‌మే: ఏపీ స్పీక‌ర్‌

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీ అనే దేవాల‌యం లో తాను కేవ‌లం పూజారిని మాత్ర‌మేన‌ని.. ప్ర‌జ‌లే దేవుళ్ల‌ని వ్యాఖ్యానించారు. దేవుళ్ల‌కు సేవ చేసుకునేందుకు మాత్రమే ఇక్క‌డ ఎన్నికైన స‌భ్యులు ప‌నిచేయాల‌ని సూచించారు. ఇదేస‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ కోరుతున్న‌ట్టుగా .. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా అనేది దేవుడే ఇవ్వాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. పూజారి ఏమైనా ఇవ్వ‌గ‌ల‌డా? అని ప్ర‌శ్నించారు. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ అర్ధం చేసుకోవాల‌ని సూచించారు.

“అసెంబ్లీకి రాకుండా జ‌గ‌న్ మారాం చేస్తున్నారు. ఆయ‌న వైఖ‌రిని ప్ర‌జ‌లు గ‌మ‌నించాలి. నేనేదో త‌ప్పు చేస్తున్నట్టు ప్ర‌క‌టించారు. ఇది స‌రికాదు. నేను పూజారిని మాత్ర‌మే. ప్ర‌జ‌లే దేవుళ్లు. నాకైనా మీకైనా.. జ‌గ‌న్‌కైనా వారే అవ‌కాశం క‌ల్పించారు. దీనిని స‌ద్వినియోగం చేసుకునే బాధ్య‌త జ‌గ‌న్‌పైనే ఉంది. పూజారి ఏం చేయ‌గ‌ల‌డు? దేవుడు వ‌రమిస్తే.. పూజారి ఆప‌గ‌ల‌డా? చెప్పండి.” అని స్పీక‌ర్ వ్యాఖ్యానించారు. కాబ‌ట్టి.. జ‌గ‌న్ స‌భ‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల స‌మస్య‌ల‌పై స్పందించాలి. ప్ర‌శ్నించాలి. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి అయినా న్యాయం చేయాలని వ్యాఖ్యానించారు.

వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌హా ఆయ‌న పార్టీ ఎమ్మెల్యేలు స‌భ‌కు రాకుండా డుమ్మా కొడుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై వైసీపీ పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తోంది. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌కుండా అడ్డుప‌డుతున్నార‌ని.. స‌భ‌లో మ‌రో పార్టి ప్ర‌తిప‌క్షంగా లేన‌ప్పుడు.. త‌మ‌కే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల‌న్న‌దివైసీపీ అధినేత చెబుతున్న మాట‌. అప్పుడు త‌మ‌కు సీఎంతో స‌మానంగా మాట్లాడేందుకు అవ‌కాశం ల‌భిస్తుంద‌ని అంటున్నారు. అలా …. ఇవ్వ‌నంత వ‌ర‌కు తాము స‌భ‌కు వ‌చ్చేది లేద‌ని చెప్పుకొచ్చారు.

ఈ విష‌యంపై వైసీపీ స‌భ్యుడు ఒక‌రు స‌భ‌లో లిఖిత పూర్వ‌క ప్ర‌శ్న సంధించారు. వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా ఇచ్చే ఆలోచ‌న ఉందా? లేదా? అని ప్ర‌శ్నించారు. దీనిపై మ‌రోసారి అయ్య‌న్న పాత్రుడు స్పందించారు. అవ‌కాశం లేద‌ని తేల్చి చెప్పారు. తాను ఏమీ చేయలేన‌ని అయ్య‌న్న వ్యాఖ్యానించారు. అంతేకాదు.. వైసీపీ అధినేత త‌న‌పై దేశంలోని ఏ కోర్టుకు వెళ్లినా ఫ‌ర్వాలేద‌న్న అయ్య‌న్న‌.. చ‌ట్టం, న్యాయం ప్ర‌కార‌మే తాను న‌డుచుకుంటాన‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on September 26, 2025 11:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

4 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

6 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

6 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

7 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

8 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

9 hours ago