Political News

టీడీపీ లేని చోట కూడా పుంజుకోలేక పోతున్న వైసీపీ ఎక్క‌డంటే!

ప్ర‌త్య‌ర్థి బ‌లంగా ఉన్న చోట‌.. ఏ నాయ‌కుడైనా పుంజుకోవ‌డం స‌మ‌యం తీసుకుంటుంది. అస‌లు ప్ర‌త్య‌ర్థే లేని చోట‌.. అందునా.. ప్ర‌త్య‌ర్థి పార్టీ బ‌లంగా దూసుకుపోయే ప‌రిస్థితి లేని చోట‌.. అధికార ప‌క్షం ఎలాంటి దూకుడు ప్ర‌ద‌ర్శించాలి? ఎలా వ్య‌వ‌హ‌రించాలి? అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఏముంటుంది? అయినా కూడా అధికార ప‌క్షంలో దూకుడు క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌కాశం జిల్లాలోని ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం ఎర్ర‌గొండ‌పాలెం. ఇక్క‌డ ప్ర‌స్తుతం టీడీపీ ప‌రిస్థితి జెండా మోసేవారు క‌నిపించ‌డం లేదు. ఉన్న‌వారి లోనూ ఎవ‌రికీ చంద్ర‌బాబు నుంచి క్లారిటీ లేక‌పోవ‌డంతో నాయ‌కులు మౌనం పాటిస్తున్నారు.

ఎర్ర‌గొండ‌పాలెం నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి ఆదిమూల‌పు సురేష్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ త‌ర‌ఫున విజ‌యం సాధించిన ఆయ‌న త‌ర్వాత జ‌గ‌న్‌కు జై కొట్టారు. ఈ క్ర‌మంలోనే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఇక్క‌డ టికెట్ ఇచ్చారు. సురేశ్ గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, ఎస్సీ కోటాలో జ‌గ‌న్ ఆయ‌న‌కు విద్యాశాఖ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఆయ‌న ప‌ని ఆయ‌న చేసుకుని పోతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. పార్టీ ప‌రంగా చూసుకుంటే.. సురేశ్ ఎక్క‌డా ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌డం లేదు. ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌లు మాత్రం చూస్తున్నారు. దీంతో ఇక్క‌డి వైసీపీ నాయ‌కులు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం.. మంత్రి బాలినేని చుట్టూ తిరుగుతున్నారు.

వాస్త‌వానికి టీడీపీకి ఇక్క‌డ బ‌లం లేద‌నే చెప్పాలి. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో 2014, 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున బుడాల అజితారావు పోటీ చేశారు. అయితే, రెండు ఎన్నిక‌ల్లో ఓట‌మి దెబ్బ‌తో అజితారావు దూర‌మ‌య్యారు. ఏకంగా పార్టీలోనూ జాడ క‌నిపించ‌డం లేదు. దీంతో ఇక్క‌డ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని స‌మ‌న్వ‌యం చేసేవారు లేక టీడీపీ అల్లాడుతోంది. ఇటీవ‌ల డాక్ట‌ర్ రవీంద్ర‌, క‌రిముల్లా వంటి యువ నేత‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారికి ఇక్క‌డ ఎలాంటి ప్రాతినిధ్యం ఉండ‌దు. ఇది ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో ఆ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు అయితే.. గ‌ట్టిగా నిల‌దొక్కుకునేందుకు, పార్టీని పరుగులు పెట్టించేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఈ క్ర‌మంలో టీడీపీలో ఉన్న ఈ లోటును త‌న‌కు అనుకూలంగా మార్చుకుని వైసీపీని ప‌రుగులు పెట్టించ‌డంలో మంత్రి సురేష్ ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే, దీనికి ఆయ‌న చెబుతున్న వాద‌న ఏంటంటే.. గ‌తంలో ఇలానే అనుకుని కేడ‌ర్ను పెంచిపోషించాన‌ని, తీరా ఎన్నిక‌లు వ‌చ్చే స‌రికి నియోజ‌క‌వ‌ర్గం మార్చేశార‌ని.. ఏ నిముషానికి ఏం జ‌రుగుతుందో ఎవ‌రికి తెలుసు.. నా ప‌ని నేను చేసుకుని పోతే చాలు! అని నిమ్మ‌కుంటున్నారు. దీంతో పుంజుకునే అవ‌కాశం ఉండి కూడా పార్టీ పుంజుకోవ‌డం ల‌దేని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 26, 2020 8:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

26 minutes ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

3 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

9 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

11 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

11 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago