Political News

ఏపీ అసెంబ్లీలో దొంగ సంత‌కాలు.. దాగుడు మూత‌లు ..!

వైసీపీ ఎమ్మెల్యేల్లో కొంద‌రికి బెరుకు, బెంగ కూడా ఉన్నాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. తమ పార్టీ అధినేత తీరు తో కొంద‌రు విసిగిపోతున్నార‌న్న‌ది కూడా వాస్త‌వ‌మే. ముఖ్యంగా కొంద‌రు ఫ‌స్ట్ టైమ్ గెలిచిన వారు ఉన్నారు. అలాగే.. బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి వంటివారు.. స‌మ‌స్య‌ల‌ను పరిష్క‌రించాల‌ని కోరుకుంటున్నారు. ఎందుకంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో 7 నియోజ‌క‌వ‌ర్గాలు.. అత్యంత సంక్లిష్టంగా ఉన్నాయి. అంటే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌క్కువ మెజారిటీతోనే గెలుపు గుర్రం ఎక్కారు.

ఈ క్ర‌మంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరిగి విజ‌యం ద‌క్కించుకోవాల‌న్నా.. ప్ర‌జ‌ల సానుభూతిని సొంతం చేసుకోవాల‌ని భావించినా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాలి. అసెంబ్లీలోనూ చ‌ర్చించాలి. ఈ వ్య‌వ‌హార‌మే కొత్త వారికి అదేస‌మ‌యంలో బ‌ల‌మైన పోటీ ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోని నాయ‌కుల‌కు కూడా నిద్ర‌లేకుండా చేస్తోంది. ఇక, ఢ‌క్కాముక్కీలు తిన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వంటివారు మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీంతో స‌భ్యులు.. స‌భ‌కు హాజ‌రు కాకుండానే రిజిస్ట‌ర్‌లో సంత‌కాలు చేస్తున్నార‌న్న‌ది వాస్తవం.

దీనివ‌ల్ల క‌నీసం త‌మ‌కు వేత‌నాలు అయినా.. వ‌స్తాయ‌ని, రేపు అసెంబ్లీలో హాజ‌రు శాతాన్ని ప‌రిశీలించిన‌ప్పుడు.. త‌మ పేరు మ‌రీ దిగువ స్థాయికి ప‌డిపోకుండా ఉంటుంద‌ని కూడా లెక్క‌లు వేసుకుని ఇలా వ్య‌వ‌హరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే కొంద‌రు చాటుమాటుగా వెళ్లి హాజ‌రు వేసి వ‌స్తున్నారు. తాజాగా నిర్వ‌హించిన పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో మాజీ సీఎం జ‌గ‌న్‌.. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. “మీరు వెళ్లాల‌ని అనుకుంటే స‌భ‌కు వెళ్ల‌మ‌ని నేనే చెప్పా. కొంద‌రు ఇలా చేస్తున్నారు. వెళ్లాల‌ని అనుకుంటే నేను ఆప‌ను. కానీ, ఇలా చేయ‌డం స‌రికాదు” అని ఆయ‌న తేల్చి చెప్పారు.

అయితే.. జ‌గ‌న్ రాకుండా తాము స‌భ‌కు వెళ్లినా స‌మ‌స్య‌ల‌పై స్పందించినా.. ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న‌ది కొంద‌రు ఎమ్మెల్యేలు చెబుతున్న మాట‌. ఈ నేప‌థ్యంలోనే.. వారు కూడా డుమ్మా కొడుతున్నారు. కానీ, ఆర్థిక స‌మ‌స్య‌లు.. ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల కార‌ణంగా.. వైసీపీ ఎమ్మెల్యేలు.. సంత‌కాలు చేసి వ‌స్తున్నాయి. మొత్తంగా జ‌గ‌న్ క‌దిలితే త‌ప్ప తాము క‌దిలేది లేద‌ని కొంద‌రు చెబుతుండగా.. మ‌రికొంద‌రు మాత్రం.. మౌనంగా ఉంటున్నారు ఇదేస‌మ‌యంలో అసెంబ్లీలో వారిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల‌ను క‌ట్ట‌డి చేయాలంటే.. ఖ‌చ్చితంగా జ‌గ‌నే స్పందించాల్సి ఉంటుంది.

This post was last modified on September 25, 2025 3:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమిళనాడు కూడా తేలింది.. కానీ కేరళ మాత్రం…

తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…

2 hours ago

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

7 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

8 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

8 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

8 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

10 hours ago