Political News

ఏపీ అసెంబ్లీలో దొంగ సంత‌కాలు.. దాగుడు మూత‌లు ..!

వైసీపీ ఎమ్మెల్యేల్లో కొంద‌రికి బెరుకు, బెంగ కూడా ఉన్నాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. తమ పార్టీ అధినేత తీరు తో కొంద‌రు విసిగిపోతున్నార‌న్న‌ది కూడా వాస్త‌వ‌మే. ముఖ్యంగా కొంద‌రు ఫ‌స్ట్ టైమ్ గెలిచిన వారు ఉన్నారు. అలాగే.. బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి వంటివారు.. స‌మ‌స్య‌ల‌ను పరిష్క‌రించాల‌ని కోరుకుంటున్నారు. ఎందుకంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో 7 నియోజ‌క‌వ‌ర్గాలు.. అత్యంత సంక్లిష్టంగా ఉన్నాయి. అంటే.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌క్కువ మెజారిటీతోనే గెలుపు గుర్రం ఎక్కారు.

ఈ క్ర‌మంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరిగి విజ‌యం ద‌క్కించుకోవాల‌న్నా.. ప్ర‌జ‌ల సానుభూతిని సొంతం చేసుకోవాల‌ని భావించినా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాలి. అసెంబ్లీలోనూ చ‌ర్చించాలి. ఈ వ్య‌వ‌హార‌మే కొత్త వారికి అదేస‌మ‌యంలో బ‌ల‌మైన పోటీ ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోని నాయ‌కుల‌కు కూడా నిద్ర‌లేకుండా చేస్తోంది. ఇక, ఢ‌క్కాముక్కీలు తిన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వంటివారు మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీంతో స‌భ్యులు.. స‌భ‌కు హాజ‌రు కాకుండానే రిజిస్ట‌ర్‌లో సంత‌కాలు చేస్తున్నార‌న్న‌ది వాస్తవం.

దీనివ‌ల్ల క‌నీసం త‌మ‌కు వేత‌నాలు అయినా.. వ‌స్తాయ‌ని, రేపు అసెంబ్లీలో హాజ‌రు శాతాన్ని ప‌రిశీలించిన‌ప్పుడు.. త‌మ పేరు మ‌రీ దిగువ స్థాయికి ప‌డిపోకుండా ఉంటుంద‌ని కూడా లెక్క‌లు వేసుకుని ఇలా వ్య‌వ‌హరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే కొంద‌రు చాటుమాటుగా వెళ్లి హాజ‌రు వేసి వ‌స్తున్నారు. తాజాగా నిర్వ‌హించిన పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో మాజీ సీఎం జ‌గ‌న్‌.. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. “మీరు వెళ్లాల‌ని అనుకుంటే స‌భ‌కు వెళ్ల‌మ‌ని నేనే చెప్పా. కొంద‌రు ఇలా చేస్తున్నారు. వెళ్లాల‌ని అనుకుంటే నేను ఆప‌ను. కానీ, ఇలా చేయ‌డం స‌రికాదు” అని ఆయ‌న తేల్చి చెప్పారు.

అయితే.. జ‌గ‌న్ రాకుండా తాము స‌భ‌కు వెళ్లినా స‌మ‌స్య‌ల‌పై స్పందించినా.. ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న‌ది కొంద‌రు ఎమ్మెల్యేలు చెబుతున్న మాట‌. ఈ నేప‌థ్యంలోనే.. వారు కూడా డుమ్మా కొడుతున్నారు. కానీ, ఆర్థిక స‌మ‌స్య‌లు.. ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల కార‌ణంగా.. వైసీపీ ఎమ్మెల్యేలు.. సంత‌కాలు చేసి వ‌స్తున్నాయి. మొత్తంగా జ‌గ‌న్ క‌దిలితే త‌ప్ప తాము క‌దిలేది లేద‌ని కొంద‌రు చెబుతుండగా.. మ‌రికొంద‌రు మాత్రం.. మౌనంగా ఉంటున్నారు ఇదేస‌మ‌యంలో అసెంబ్లీలో వారిపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల‌ను క‌ట్ట‌డి చేయాలంటే.. ఖ‌చ్చితంగా జ‌గ‌నే స్పందించాల్సి ఉంటుంది.

Satya

Recent Posts

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

5 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

6 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

6 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

6 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

7 hours ago

అమ‌రావ‌తిలో అల‌జ‌డి… మళ్ళీ ఏం జరిగింది?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో శ‌నివారం తెల్ల‌వారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహ‌రించారు. ఈ ప్రాంతంలో రాజ‌ధాని…

9 hours ago