తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకమైన ఉప ఎన్నికలకు సిద్ధమవుతోంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణం నేపథ్యంలో త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీలో మళ్లీ ఉత్సాహం తీసుకురావాలని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అందరికంటే ముందు అభ్యర్థిని ప్రకటించింది ఆ పార్టీ. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మినే అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఐతే తన పేరు ప్రకటించాక పనబాక లక్ష్మి నుంచి ఎలాంటి స్పందన లేకపోగా.. ఆమె భారతీయ జనతా పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నట్లుగా కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.
పనబాక లక్ష్మి తన కూతురి పెళ్లి పనుల్లో బిజీగా ఉండటం వల్లే ఏమీ స్పందించలేదని.. ఆమె త్వరలోనే ఎన్నికల ప్రచారం మొదలుపెడుతుందని తెదేపా అగ్ర నేతల్లో ఒకరైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించినప్పటికీ జనాల్లో సందేహాలు తొలగిపోలేదు. ఐతే ఈ ఊహాగానాలకు తెరదించుతూ పనబాక లక్ష్మి బయటికి వచ్చారు. సోమిరెడ్డితో కలిసి లక్ష్మి, ఆమె భర్త తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలిశారు.
తద్వారా తెలుగుదేశం పార్టీని వీడట్లేదని, త్వరలోనే తిరుపతిలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నామని సంకేతాలు ఇచ్చారు. దీంతో తెదేపా కార్యకర్తల్లో టెన్షన్ తీరిపోయింది. కష్టకాలంలో చంద్రబాబుకు సైతం ఇది ఉపశమనాన్నిస్తుందనడంలో సందేహం లేదు. కాగా దుర్గా ప్రసాద్ కుటుంబంలో ఎవరికీ టికెట్ ఇవ్వకుండా వైకాపా జగన్ వ్యక్తిగత ఫిజియోథెరపిస్టును తిరుపతి ఎంపీ స్థానంలో బరిలోకి నింపుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 26, 2020 8:17 am
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…