తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకమైన ఉప ఎన్నికలకు సిద్ధమవుతోంది. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణం నేపథ్యంలో త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీలో మళ్లీ ఉత్సాహం తీసుకురావాలని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అందరికంటే ముందు అభ్యర్థిని ప్రకటించింది ఆ పార్టీ. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మినే అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఐతే తన పేరు ప్రకటించాక పనబాక లక్ష్మి నుంచి ఎలాంటి స్పందన లేకపోగా.. ఆమె భారతీయ జనతా పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నట్లుగా కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.
పనబాక లక్ష్మి తన కూతురి పెళ్లి పనుల్లో బిజీగా ఉండటం వల్లే ఏమీ స్పందించలేదని.. ఆమె త్వరలోనే ఎన్నికల ప్రచారం మొదలుపెడుతుందని తెదేపా అగ్ర నేతల్లో ఒకరైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించినప్పటికీ జనాల్లో సందేహాలు తొలగిపోలేదు. ఐతే ఈ ఊహాగానాలకు తెరదించుతూ పనబాక లక్ష్మి బయటికి వచ్చారు. సోమిరెడ్డితో కలిసి లక్ష్మి, ఆమె భర్త తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలిశారు.
తద్వారా తెలుగుదేశం పార్టీని వీడట్లేదని, త్వరలోనే తిరుపతిలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నామని సంకేతాలు ఇచ్చారు. దీంతో తెదేపా కార్యకర్తల్లో టెన్షన్ తీరిపోయింది. కష్టకాలంలో చంద్రబాబుకు సైతం ఇది ఉపశమనాన్నిస్తుందనడంలో సందేహం లేదు. కాగా దుర్గా ప్రసాద్ కుటుంబంలో ఎవరికీ టికెట్ ఇవ్వకుండా వైకాపా జగన్ వ్యక్తిగత ఫిజియోథెరపిస్టును తిరుపతి ఎంపీ స్థానంలో బరిలోకి నింపుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 26, 2020 8:17 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…